breaking news
desecrated
-
ఈద్గా స్థలాన్ని అపవిత్రం చేసిన టీడీపీ మూకలు
సత్తెనపల్లి: ముస్లింలు పవిత్రంగా భావించే ఈద్గా స్థలాన్ని టీడీపీ మూకలు అపవిత్రం చేసిన ఘటన పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో శనివారం రాత్రి జరిగింది. ప్రజాగళం పేరుతో ఎన్నికల ప్రచారానికి టీడీపీ అధినేత చంద్రబాబు శనివారం రాత్రి సత్తెనపల్లి వచ్చారు. దీంతో ఆ పార్టీకి చెందిన కొందరు రౌడీ మూకలు ఈద్గా స్థలంలోకి చొరబడి మద్యం సేవించి, పొగతాగుతూ మూత్ర విసర్జన చేశారు. ఈద్గా స్థలానికి తాళం వేసి ఉండటంతో ప్రహరీ పగులగొట్టి టీడీపీ మూకలు లోపలికి ప్రవేశించాయి. అక్కడే ఆహారం వండుకుని, మద్యం సేవించి ఖాళీ సీసాలు, సిగరెట్ పెట్టెలు పడేశారు. ఆ ప్రాంతంలోనే మూత్ర విసర్జన కూడా చేశారు. ఈద్గా ప్రాంతాన్ని ఆదివారం ముస్లింలు, మత పెద్దలు పరిశీలించి తమ మనోభావాలను దెబ్బ తీశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మునిసిపల్ వైస్ చైర్మన్ షేక్ నాగుర్మీరా మాట్లాడుతూ.. రంజాన్ రోజున 10 వేల మంది ముస్లింలు సామూహిక నమాజులకు హాజరయ్యే ఈద్గా స్థలంలో మద్యం సేవించి, మూత్ర విసర్జన చేయడం బాధాకరమన్నారు. టీడీపీ ఇలాంటి అనైతిక చర్యలకు పాల్పడటం దారుణమన్నారు. ఈద్గా ప్రాంతమంతా పరిశీలించి అక్కడ పడేసిన ఖాళీ మద్యం సీసాలను, సిగరెట్ పెట్టెలను తొలగించారు. ఈద్గాలోని నమాజ్ చేసే ప్రాంతాన్ని వాటర్ ట్యాంకర్తో నీటిని రప్పించి కడిగి శుభ్రం చేశారు. ఈద్గా స్థలాన్ని అపవిత్రం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షుడు షేక్ మౌలాలి, మైనార్టీ సెల్ పట్టణ అధ్యక్షుడు షేక్ నాగుల్బాషా, నాయకులు సయ్యద్ సలీం, షేక్ మహమ్మద్ గని, షేక్ జానీ, షేక్ ముక్త్యార్, హుస్సేన్, మత పెద్దలు సుభానీఖాన్, ఖలీల్, సయ్యద్ హుస్సేన్, మహీబుల్లా, చిన్నమాబు, యూసఫ్, రెహమాన్, షేక్ కరీం, ఖాజా పాల్గొన్నారు. -
‘పవిత్ర గ్రంథాలను ఇలా వాడతారా?
పంజాబ్, ఫిరోజ్పూర్ : పవిత్ర గ్రంథాన్ని అనుచిత పనుల కోసం వాడి.. దాన్ని అపవిత్రం చేశారనే నేపంతో గురుద్వారా పూజారిని, అతని భార్యను పోలీసులు అరెస్ట్ చేశారు. వివారాల ప్రకారం.. ఫిరోజ్పూర్ గురుద్వారాలో పూజారిగా పని చేస్తోన్న ఓ వ్యక్తి భార్య పవిత్ర గ్రంథంలోని పేజీలను చింపి.. వాటిలో చపాతీలను చుట్టి పిల్లలకు ఇచ్చి పాఠశాలకు పంపింది. ఇది గమనించిన మిగతా విద్యార్ధులు ఈ విషయాన్ని తొలుత సిక్కు స్టూడెంట్స్ ఫెడరేషన్కి తెలియజేశారు. దాంతో వారు సదరు పూజారి ఇంటికి వెళ్లి తనిఖీ చేయగా వారి వంట గదిలో మరికొన్ని పదార్ధాలను కూడా పవిత్ర గ్రంథంలోని పేపర్లలో చుట్టి పెట్టారు. ఈ విషయం గురించి యూనియన్ అధ్యక్షుడు ‘మేము పవిత్ర గ్రంథాన్నే మా దైవంగా పూజిస్తాం. అలాంటిది ఆ గ్రంథాన్ని చింపడమే కాక ఆ పేజీలను ఇలాంటి పనుల కోసం వినియోగించడం దారుణ. నిజంగా ఇది చాలా అపవిత్రమైన పని. భవిష్యత్తులో మరోకరు ఇలాంటి పనికి పాల్పడకూడదనే ఉద్దేశంతో సదరు పూజారి, అతని భార్య మీద పోలీసులకు ఫిర్యాదు చేశామ’ని తెలిపాడు. ప్రస్తుతం పోలీసులు సదరు పూజారిని, అతని భార్యను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
అపవిత్రం చేసిన అధికారి సస్పెన్షన్
పవిత్రమైన శ్రీకాళహస్తిలో పని చేస్తున్న ఉద్యోగే ఆలయం ప్రాంగణాన్ని అపవిత్రం చేశారు. త్రినేత్ర గెస్ట్ హౌస్ మేనేజర్ గణపతిరాజు విధి నిర్వహణలో ఉన్నపుడే మద్యం సేవించడమే కాకుండా అక్కడికి వచ్చిన భక్తులతో అమర్యాదగా ప్రవర్తించారు. దీంతో అధికారులు అతన్ని సస్పెండ్ చేశారు.