breaking news
Deputy Secretary
-
రిచర్డ్ వర్మకు కీలక పదవి
వాషింగ్టన్: అమెరికా విదేశాంగ శాఖ డిప్యూటీ సెక్రెటరీగా భారతీయ అమెరికన్ రిచర్డ్ వర్మకు కీలక పదవి దక్కింది. శాఖకు సంబంధించిన నిర్వహణ, వనరుల వ్యవహారాలను ఆయన చూసుకుంటారు. దీన్ని అత్యంత శక్తిమంతమైన విదేశాంగ శాఖలో కీలకమైన సీఈఓ స్థాయి పోస్టుగా పరిగణిస్తుంటారు. 54 ఏళ్ల వర్మ నియామకాన్ని సెనేట్ 67–26 ఓట్లతో ఆమోదించింది. మాజీ దౌత్యవేత్త అయిన వర్మ ఒబామా హయాంలో విదేశాంగ శాఖ అసిస్టెంట్ సెక్రెటరీ (న్యాయ వ్యవహారాలు)గా కూడా పని చేశారు. 2015 నుంచి రెండేళ్లపాటు భారత్లో అమెరికా రాయబారిగా ఉన్నారు. వర్మ 1968లో అమెరికాలోని భారతీయ కుటుంబంలో జన్మించారు. అమెరికా వైమానిక దళ స్కాలర్షిప్తో కాలేజీ చదువు పూర్తి చేశారు. లాహిగ్ వర్సిటీ నుంచి బీఎస్, జార్జ్టౌన్ వర్సిటీ నుంచి ఎల్ఎల్ఎం, పీహెచ్డీ చేశారు. అనంతరం యూఎస్ ఎయిర్ఫోర్స్లో జడ్జ్ అడ్వొకేట్గా బాధ్యతలు నిర్వర్తించారు. దేశాధ్యక్షుని నిఘా సలహా బోర్డులో, సామూహిక జనహనన ఆయుధాలు, ఉగ్రవాద కమిషన్ సభ్యునిగా చేశారు. ప్రస్తుతం మాస్టర్కార్డ్ చీఫ్ లీగల్ ఆఫీసర్, గ్లోబల్ పబ్లిక్ పాలసీ హెడ్గా ఉన్నారు. ఫోర్డ్ ఫౌండేషన్తో పాటు మరెన్నో ప్రతిష్టాత్మక బోర్డుల్లో సభ్యునిగా, ట్రస్టీగా కొనసాగుతున్నారు. విదేశాంగ శాఖ నుంచి అత్యుత్తమ సేవా మెడల్, వైమానిక దళం నుంచి మెరిటోరియస్ సర్వీస్ మెడల్, కౌన్సిల్ ఆఫ్ ఫారిన్ రిలేషన్స్నుంచి ఇంటర్నేషనల్ అఫైర్స్ ఫెలోషిప్ తదితరాలు దక్కించుకున్నారు. -
భారతీయ అమెరికన్ రిచర్డ్ వర్మకు కీలక పదవి
వాషింగ్టన్: భారతీయ అమెరికన్ రిచర్డ్ వర్మ (54) అమెరికా విదేశాంగ శాఖలో మేనేజ్మెంట్, రీసోర్సెస్ విభాగం డిప్యూటీ సెక్రటరీగా నియమితులు కానున్నారు. అధ్యక్షుడు బైడెన్ ఈ మేరకు ప్రతిపాదించారు. ఇందుకు సెనేట్ ఆమోదం తెలిపితే విదేశాంగ శాఖలో అత్యున్నత పదవి చేపట్టనున్న భారతీయ అమెరికన్ వర్మ అవుతారు. ఆయన 2015–17 మధ్య భారత్లో అమెరికా రాయబారిగా కూడా పనిచేశారు. ఒబామా హయాంలో విదేశాంగ శాఖ అసిస్టెంట్ సెక్రటరీగా ఉన్నారు. ప్రస్తుతం మాస్టర్ కార్డ్ సంస్థ చీఫ్ లీగల్ ఆఫీసర్గా, గ్లోబల్ పబ్లిక్ పాలసీ హెడ్గా పని చేస్తున్నారు. -
చత్తీస్గఢ్ సీఎం డిప్యూటీ సెక్రటరీ అరెస్టు
రాయ్పూర్: చత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ డిప్యూటీ సెక్రటరీ సౌమ్య చౌరాసియాను ఈడి అరెస్టు చేసింది. మనీలాండరింగ్ ఆరోపలపై సౌమ్యను అరెస్టు చేసినట్లు పేర్కొంది. గతేడాది చత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్లో దాడులు నిర్వహించి సుమారు రూ. 100 కోట్లకు పైగా హవాలా రాకెట్ను వెలికితీసినట్లు ఆదాయపు పన్ను శాఖ వెల్లడించింది. అంతేగాక హవాల లావదేవీల కింద అధికారిక బ్యాంకింగ్ వ్యవస్థలోకి ప్రవేశించకుండా నగదు చేతులు మారుతోందని ఈడీ పేర్కొంది. ఫిబ్రవరి 2020లో చౌరాసియా ఇంటిపై కూడా దాడి చేసింది. ఐతే ముఖ్యమంత్రి భూపేష్ కేంద్ర ఏజెన్సీ చేసిన దాడిని రాజకీయ ప్రతీకార దాడి అభివర్ణించారు. పైగా తన ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నంలో భాగంగా ఇలా చేస్తున్నారంటూ ఆరోపణలు చేశారు. (చదవండి: కాంగ్రెస్ను వీడిన ముగ్గురు నాయకులకు...బీజేపీ కీలక భాద్యతలు) -
అరవింద్ కేజ్రీవాల్ కార్యాలయంలోని డిప్యూటీ సెక్రటరీపై వేటు
న్యూఢిల్లీ: ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా అవినీతి ఆరోపణలతో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కార్యాలయంలోని డిప్యూటీ సెక్రటరీ, ఇద్దరు సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ (ఎస్డిఎం)లను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేస్తున్న ప్రకాశ్ చంద్ర ఠాకూర్, డివిజన్ మేజిస్ట్రేట్లు వసంత్ విహార్ హర్షిత్ జైన్, వివేక్ విహార్ దేవేందర్ శర్మలపై వేటు విధించడమే కాకుండా క్రమశిక్షణా చర్యలకు ఆదేశించారు. అలాగే ఆయన ఈడబ్ల్యూఎస్ ఫ్లాట్ల నిర్మాణంలో లోపాలను గుర్తించి ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ (డీడీఏ)కి చెందిన ఇద్దరు అసిస్టెంట్ ఇంజనీర్లను కూడా సస్పెండ్ చేశారు. ఆయన దేశ రాజధానిలో శాంతి భద్రతలు, క్రైమడేటా విశ్లేషణ నివారణ చర్యల్లో ఢిల్లీ పోలీసు విభాగం పనితీరుని సమీక్షించారు. అంతేకాదు పోలీస్ స్టేషన్ స్థాయిలో పిసిఆర్ దర్యాప్తు , శాంతిభద్రతల రక్షణలోనూ, మహిళల భద్రత కోసం చేస్తున్న కార్యక్రమాలు, యువా ద్వారా అందిస్తున్న నైపుణ్య శిక్షణ తదితర విషయాల్లో ఢిల్లీ పోలీసులు తీసుకుంటున్న చర్యలను ప్రశంసించారు. కేసులను సకాలంలో దర్యాప్తు చేయాలని సాక్ష్యాధారాలను సాద్యమైనంత తొందరగా సేకరించాలని నొక్కిచెప్పారు. (చదవండి: ప్లీజ్..కొంచెం సమయం ఇవ్వండి: ఈడీని కోరిన సోనియా) -
కేంద్ర సర్వీసులకు కాటా అమ్రపాలి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కేడర్ ఐఏఎస్ అధికారిణి కాటా అమ్రపాలి కేంద్ర సర్వీసులకు వెళ్లనున్నారు. రాష్ట్ర ప్రభుత్వ సిఫారసుల మేరకు నాలుగేళ్ల పాటు కేంద్ర సర్వీసుల్లో డిప్యుటేషన్పై పని చేసేందుకు అనుమతిస్తూ కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర సర్వీసుల్లో డిప్యూటీ సెక్రటరీగా పనిచేసేందుకు ఆమెను ఎంపిక చేసినట్లు వెల్లడించింది. -
20 లక్షలు ఇస్తానంటే తీసుకోరేమిటి?
ఎయిమ్స్ తీరుపై ఓ వైద్యుడి ఆవేదన న్యూఢిల్లీ: నగరంలోని ప్రతిష్ఠాత్మకమైన అఖిలభారత వైద్యవిజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) పాలక యంత్రాంగం తలతిక్కగా వ్యవహరిస్తోందనడానికి మాజీ చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ (సీవీఓ), ప్రస్తుత ఎయిమ్స్ డిప్యూటీ కార్యదర్శి సంజయ్ చతుర్వేది విషయమే ఉదాహరణ. ఆయన ఉత్తమ వైద్య సేవలను గుర్తించి ఆయనకు రామన్ మెగసెసె అవార్డు వచ్చిన విషయం తెలిసిందే. ఈ అవార్డు కింద తనకు వచ్చిన దాదాపు రూ. 20 లక్షలను పేదల వైద్యం కోసం ఆయన తాను పనిచేస్తున్న ఎయిమ్స్కే విరాళంగా ఇవ్వాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని పాలకవర్గానికి తెలియజేసి, లిఖితపూర్వక అప్పీల్ కూడా చేశారు. ఇప్పటికే ఆయన్ను 12 సార్లు బదిలీచేసి వేధించిన ఉన్నతాధికారులు ఆఖరికి డబ్బులు తీసుకోవడానికి కూడా వేధిస్తున్నారు! నిబద్ధతతో వ్యవహరిస్తూ ముక్కుసూటిగా వ్యవహరిస్తున్నందుకే ఆయనను ఉన్నతాధికారులు చీఫ్ విజిలెన్స్ అధికారి పదవి తొలగించారు. ఆ తర్వాత అంత ప్రాధాన్యత లేని విభాగానికి బదిలీ చేశారు. తనకు మెగసెసె అవార్డు కింద వచ్చిన రూ. 20 లక్షల చెక్కును పేదల వైద్యం నిమిత్తం ఎయిమ్స్ ఖాతాలో జమచేయాల్సిందిగా సెప్టెంబర్ 21వ తేదీన ఎయిమ్స్ డైరెక్టర్ను సంజయ్ చతుర్వేది కోరారు. ఆస్పత్రి పాలక యంత్రాంగం ఏవో కుంటిసాకులు చెబుతూ ఇప్పటివరకు ఆ చెక్కును డిపాజిట్ చేయలేదు. గత రెండు నెలలుగా ఆ చెక్కు అలా వృధాగానే పడి ఉంది. మరో నెలరోజులు గడిస్తే చెక్కు కాలపరిమితి కూడా ముగిసిపోతుంది. ఈ విషయంలో తనకు కూడా విసుగు వచ్చిందని, ఈ మొత్తాన్ని ప్రధానమంత్రి నిధికి డొనేట్ చేయాలని నిర్ణయించుకున్నానని సంజయ్ సోమవారం మీడియాకు తెలిపారు. ప్రైవేటు వ్యక్తులు ఎవరు విరాళాలు ఇచ్చినా వెంటనే ఎయిమ్స్ ఖాతాలో డిపాజిట్చేసే పాలకమండలి ఇదే ఆస్పత్రిలో పని చేస్తున్న తాను ఇచ్చిన చెక్కు విషయంలో ఇలా వ్యవహరిస్తోందని, ఇది కూడా వేధింపులో భాగమేనని భావిస్తున్నానని ఆయన అన్నారు. తాను ఈ పరిస్థితినంతా వివరిస్తూ గత శనివారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఓ లేఖ రాశానని, చెక్కును అందజేయడానికి ఆయన అపాయింట్మెంట్ను కూడా కోరానని తెలిపారు. ఈ విషయమై ఎయిమ్స్ డిప్యూటీ డైరెక్టర్ వి. శ్రీనివాస్ను వివరణ కోరగా, సంజయ్ ప్రతిపాదనను తాము ఆరోగ్య శాఖ పరిశీలనకు పంపించామని, వారు 'రాష్ట్రీయ ఆరోగ్య నిధి' కింద డిపాజిట్ చేయాలని సూచనలు పంపారని, అయితే కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఇప్పటి వరకు చెక్కును డిపాజిట్ చేయలేక పోయామని వివరణ ఇచ్చారు. మళ్లీ ఇదే విషయమై సంజయ్ని మీడియా ప్రశ్నించగా, అర్థం పర్థం లేని సాకులతో డబ్బు డిపాజిట్ను ఆపడమేమిటని, అసలు ఆరోగ్యశాఖ పరిశీలనకు పంపించాల్సిన అవసరం ఎందుకొచ్చిందని ఆయన ప్రశ్నిస్తున్నారు. -
సీఎం సహాయనిధికి మాత్రమే విరాళాలివ్వండి
తుపాను బాధితులకు సహాయం చేయదలిస్తే ముఖ్యమంత్రి సహాయనిధికి మాత్రమే దాతలు తమ విరాళాలను అందచేయాలని కలెక్టర్ సూచించారు. విరాళాలను సీఎం సహాయ నిధికి ఆన్లైన్ ద్వారా ఎస్బీఐ ఖాతా నంబర్ 33913634404 (ఐఎఫ్ఎస్ కోడ్ ఎస్బీఐ 0002724)కు పంపవచ్చన్నారు. చెక్కు ద్వారా పంపేవారు డిప్యూటీ సెక్రటరీ, రెవెన్యూ శాఖ 4వ ప్లోర్, ఎల్ బ్లాక్, సెక్రటేరియట్, హైదరాబాద్ చిరునామాకు పంపించవచ్చన్నారు. కూరగాయలు, పాలు, తదితర నిత్యావసర సరుకులు అందించదలిస్తే వాటిని జిల్లా యంత్రాంగం ద్వారా పంపవచ్చనని వివరించారు. ఏలూరు : ఉత్తరాంధ్ర జిల్లాల్లో తుపాను బాధితులకు జిల్లా నుంచి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బుధవారం మూడో రోజు కూడా ఆహార పొట్లాలు, పాలు, బిస్కెట్లు, ఇతర నిత్యావసర సరుకులను ఆయా ప్రాంతాలకు తరలించారు. వివిధ వర్గాల ప్రజలే కాకుండా జిల్లా యంత్రాంగం కూడా సహాయక చర్యలను వేగవంతం చేసింది. అలాగే బాధితులను ఆదుకునేందుకు పలువురు సీఎం సహాయనిధికి విరివిగా విరాళాలను అందజేస్తుండగా, మరికొందరు నేరుగా ఆహారం తయారుచేసి సొంత వాహనాల్లో బాధిత ప్రాంతాల్లో పంపిణీ చేస్తున్నారు. రూ.1.75 కోట్ల విలువైన ఆహార పదార్థాలు పంపించాం విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాలలో బాధితులకు అందించేందుకు ఇప్పటివరకు రూ.1.75 కోట్ల విలువైన ఆహార పదార్ధాలను జిల్లా నుంచి పంపినట్లు కలెక్టర్ కాటమనేని భాస్కర్ చెప్పారు. కలెక్టరేట్లో బుధవారం ఆన్లైన్ ద్వారా తుఫాన్ బాధితులకు ఏ మేరకు సహాయం అందుతుందో కలెక్టరు పరిశీలించారు. జిల్లా నుండి 3,62,670 ఆహార పొట్లాలను, కోటి మంచినీటి ప్యాకెట్లను, లక్షా 30,732 బిస్కెట్ ప్యాకెట్లను, 52 మెట్రిక్ టన్నుల కూరగాయలను, 75 క్వింటాళ్ల బియ్యాన్ని, 6 వేల బ్రెడ్ ప్యాకెట్లను, 500 చీరలను, 50 వంటపాత్రలను పంపించామని వివరించారు. అలాగే 14 వాటర్ ట్యాంకులు, 10 హెచ్పీ సామర్ధ్యంగల 20 జనరేటర్లను పంపడం జరిగిందన్నారు. విద్యుత్, పంబ్లింగ్ మరమ్మతుల కోసం 316 మంది సిబ్బందిని, పునరావాస కార్యక్రమాల కోసం 370 మందితో కూడిన 10 బృందాలను, 359 మంది శానిటరీ ఇన్స్పెక్టర్లు, ఇతర పారిశుద్ద్య కార్మికులనుపంపించామన్నారు. 3 లక్షల విలువైన పాలు తరలింపు కలెక్టర్ భాస్కర్ ఆదేశాల మేరకు భీమవరం కాస్మొక్లబ్ అధ్యక్షులు గోకరాజు రామరాజు క్లబ్ తరఫున రూ.3 లక్షల విలువైన 7,500 లీటర్ల పాలను మిల్క్ వ్యాన్ భీమడోలు విశాఖ డైరీ నుంచి పంపే ఏర్పాట్లను చేస్తున్నామని డీపీవో ఎ.నాగరాజువర్మ తెలిపారు. నల్లజర్ల మండలం నుంచి జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు 9వేల లీటర్ల పాలను పంపిణీ కోసం ఏర్పాట్లు చేశారన్నారు. రూ.10 లక్షల విరాళం అందజేత ఏలూరు : ఏలూరులోని కార్పొరేటర్లు సేవలు చేయడం అభినందనీయమని సీఎం నారాచంద్రబాబు నాయుడు అన్నారు. విశాఖపట్నంలో సీఎం చంద్రబాబును ఎమ్మెల్యే బడేటి కోటరామారావు(బుజ్జి), నగర మేయర్ షేక్ నూర్జహాన్లు కలిసి కార్పొరేటర్ల నుంచి సేకరించిన రూ.10 లక్షల విరాళాన్ని అందజేశారు. ఆర్ఎన్ఆర్ ఫైనాన్స్ అధినేత, 17 డివిజన్ కార్పొరేటర్ దాకారపు రాజేశ్వరరావు రూ.3 లక్షల విరాళాన్ని సీఎంకు అందజేశారు. అనంతరం విశాఖలోని ఎంవీపీ కాలనీ, బీచ్ రోడ్డు, లాసెన్స్బే కాలనీల్లో ఎమ్మెల్యే, మేయర్, కో- ఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, డెప్యూటీ మేయర్ చోడే వెంకటరత్నం సహాయక చర్యలు చేపట్టారు. పలు కాలనీల్లో బిస్కెట్లు, మంచినీళ్ల ప్యాకెట్లు,కూరగాయలను పంపిణీ చేశారు. కూరగాయలు, పాలు, బియ్యం సేకరించండి తాడేపల్లిగూడెం రూరల్ : తుపాను బాధితులను ఆదుకోవాలని సర్పంచ్, ఎంపీటీసీలను జెడ్పీచైర్మన్ ముళ్లపూడి బాపిరాజు కోరారు. తాడేపల్లిగూడెంలో బుధవారం వీరితో నిర్వహించిన అత్యవసర సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామలలో పాలు, కూరగాయాలు, బియ్యం వంటి విరాళాలు సేకరించాలని సూచించారు. కష్టకాలంలో ఉన్నవారిని మానవతా దృ క్పథంతో ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలని కోరా రు. జెడ్పీటీసీ సభ్యులు కిలపర్తి వెంకట్రావు, ఎంపీపీ పరిమి రవికుమార్, వైస్ ఎంపీపీ కొండపల్లి రాయుడు పాల్గొన్నారు. కొవ్వూరు నుంచి 25,350 పులిహోర పొట్లాలు కొవ్వూరు : డివిజన్లోని 12 మండలాలతోపాటు పురపాలక సంఘాల ద్వారా సేకరించిన బుధవారం 25,350 పులిహోర ప్యాకెట్లను, కూరగాయలను విశాఖపట్నం పంపినట్టు ఆర్డీవో బి.శ్రీనివాసరావు తెలిపారు. పారిశుధ్య నిర్వహణ కోసం డివిజన్ నుంచి 60 టిప్పర్ లారీలను పంపించామని చెప్పారు. తణుకు నుంచి తరలిన జేసీబీలు తణుకు అర్బన్ : విశాఖపట్నంలో సహాయక చర్యలు చేపట్టేం దుకు రవాణా శాఖ ఆధ్వర్యంలో బుధవారం తణుకు నుంచి జేసీబీలను తరలివెళ్లాయి. విశాఖలో రోడ్డు మరమ్మతుల పనుల నిమిత్తం తణుకు నుంచి ఐదు జేసీబీలతోపాటు పాలకొల్లు, ఏలూరు, భీమవరం, జంగారెడ్డిగూడెంల నుంచి మొత్తం 20 జే సీబీలు పంపినట్లు తణుకు ఎంవీఐ పి.సీతాపతిరావు చెప్పారు. జేసీబీలను ప్రత్యేక లారీలలో విశాఖకు తరలించామన్నారు. విశాఖకు టెక్నికల్ టీమ్ నరసాపురం అర్బన్ : నరసాపురం డివిజన్ నుంచి ఎలక్ట్రీయన్లు, ఫ్లంబర్లు, తాపీమేస్త్రిలు, వండ్రంగి పని వారలతో కూడిన టెక్నికల్ టీమ్ను సహాయక చర్యల కోసం విశాఖపట్నం పంపించారు. బుధవారం నరసాపురంలో వీరు ప్రత్యేక వాహనంలో విశాఖపట్నం తరలివెళ్లారు. ఆర్డీవో డి.పుష్పమణి మాట్లాడుతూ తొలి విడతగా 65 మందిని పంపిస్తున్నామని, మరోసారి 40 మందిని రెండో విడతగా పంపిస్తామన్నారు. తుపాన్ బాధితుల సహాయార్థం భీమవరం రెడ్డి అండ్ రెడ్డి షోరూమ్, వాసవి క్లబ్, ఆర్యవైశ్యసంఘం, కిరాణా మర్చంట్స్ అసోసియేషన్, ఆకివీడు రైస్మిల్లర్స్ అసోసియేన్ తదితరుల నుంచి రూ.5.50 లక్షలు విరాళాలు అందాయని చెప్పారు. తాళ్లపూడి నుంచి రూ.1.75 లక్షల సరుకులు తాళ్లపూడి : తాళ్లపూడి మండలం నుంచి రూ.1.75 లక్షలు విలువ చేసే సరుకులను విశాఖపట్నం బుధవారం పంపించారు. అల్లూరి విక్రమాదిత్య 6 వేల పాల ప్యాకెట్లు, 15 వేల వాటర్ ప్యాకెట్లు, 5 వేల బిస్కెట్ ప్యాకెట్లు, రొట్టెల ప్యాకెట్లు, నిత్యావసర సరుకులు సమకూర్చారు. మండల రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నుంచి పాల ప్యాకెట్లు, వాటర్ ప్యాకెట్లు, బిస్కెట్లు, కూరగాయలు, నిత్యావసర సరుకులు పంపించినట్టు అధ్యక్షుడు సింహాద్రి జనార్దనరావు తెలిపారు. పాలకొల్లు కౌన్సిలర్ల వితరణ పాలకొల్లు : పాలకొల్లులో టీడీపీ మునిసిపల్ కౌన్సిలర్లు తుపాను బాధతుల సహాయార్థం రూ.లక్ష విరాళం ప్రకటించారు. బుధవారం చైర్పర్సన్ ఛాంబర్ కార్యాలయంలో సమావేశమైన కౌన్సిలర్లు ఈ సహాయాన్ని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, ప్రభుత్వ విప్ అంగర రామమోహన్ చేతుల మీదుగా ప్రభుత్వ సహాయ నిధికి పంపించాలని నిర్ణయించారు. మునిసిపల్ కోఆప్షన్ సభ్యుడు మహ్మద్ మహబూబ్ ఆలీఖాన్, షేక్ సిలార్ మైనార్టీ విభాగం నుంచి రూ.10వేలు విరాళం ఇస్తామని ప్రకటించారు. పాల ఉత్పత్తిదారుల సంఘం రూ.లక్ష విరాళం భీమడోలు : ఉత్తరాంధ్ర బాధితుల సహాయార్థం సీఎం సహాయనిధికి జిల్లా పాల ఉత్పత్తిదారుల సంక్షేమ సంఘం రూ.లక్ష విరాళాన్ని ప్రకటించింది. సంఘం జిల్లా అధ్యక్షుడు గంటా నాగేశ్వరరావు ఆధ్వర్యంలో సంఘం నాయకులు ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులును బుధవారం భీమడోలులో కలిసి రూ.లక్ష చెక్కును అందజేశారు. విజయ పాలడైయిరీ డీడీ వి.మల్లికార్జునరావు, పాల కేంద్రం మేనేజర్ సూర్యప్రకాశరావు, ఏడీ శశాంక్ పాల్గొన్నారు. జర్నలిస్టుల సహాయం ఏలూరు (ఫైర్ేస్టేషన్ సెంటర్) : తుపాను బాధితుల సహాయార్థం ది ఎడిటర్స్ అండ్ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రూ.10వేల విలువైన బిస్కెట్ ప్యాకెట్లను ఎమ్మెల్యే బడేటి బుజ్జికి బుధవారం అందజేశారు. అసోసియేషన్ అధ్యక్షులు కంది వెంకట ఉమామహేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి ఎ.శివశ్రీ, కార్యదర్శి కొల్లు శ్రీనివాసరావు, కోశాధికారి బి.వెంకట రామారావు, బాలశౌరి, ఎం.విజయకుమారి, బి.భవానీ శంకర్, ఎ.రవికుమార్, దుర్గాప్రసాద్ పాల్గొన్నారు. ఏలూరు నుంచి తరలిన సామగ్రి ఏలూరు రూరల్ : శ్రీకాకుళంలో తుపాను బాధితులకు బుధవారం పలువురు దాతలు అందించిన 13 వేల బిస్కెట్ ప్యాకెట్లు, ఏలూరు గంగానమ్మ ఆలయం కమిటీ అందించిన 500 చీరలు, వెయ్యి రొట్టెలు, 50 సెట్ల వంటసామగ్రి, 1,800 దుప్పట్లను వ్యాన్లోకి తరలించినట్టు ఆర్డీవో నంబూరు తేజ్భరత్ చెప్పారు. అలాగే సాయంత్రం చందనా బ్రదర్స్ యాజమాన్యం పది వేల మంచినీటి ప్యాకెట్లు, 10 వేల బిస్కెట్ ప్యాకెట్లు అందించిందన్నారు. ఏర్పాట్లను తహసిల్దార్ జీవీ సుబ్బారావు, డీటీ నరసింహమూర్తి పర్యవేక్షించారు.