Dehadarudhya
-
ప్రశాంతంగా దేహదారుఢ్య పరీక్షలు
ఖమ్మం క్రైం: కానిస్టేబుల్ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో భాగంగా నగరంలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో బుధవారం దేహదారుఢ్య పరీక్షలు ప్రశాంతంగా కొనసాగాయి. ఈ పరీక్షలకు 17వ రోజయిన బుధవారం 1200మందికిగాను 947మంది హాజరయ్యారు. మంగళవారం రాత్రి కురిసిన వర్షం కారణంగా ఈవెంట్ల నిర్వహణ కొంత ఆలస్యమైంది. అభ్యర్థుల 800 మీటర్ల పరుగు పందెం రికార్డులను భద్రాచలం ఏఎస్పీ భాస్కరన్, డీఎస్పీ సాయిశ్రీ నమోదు చేశారు. మైదానంలో ఎస్పీ కలియతిరుగుతూ వీడియోగ్రఫీ, సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ సాయికృష్ణ, డీఎస్పీలు అశోక్కుమార్, రాంరెడ్డి, సురేందర్రావు, వీరేశ్వరారవు, సురేష్కుమార్, సంజీవ్, మాణిక్రాజ్ తదితరులు పాల్గొన్నారు. -
దేహదారుఢ్య పరీక్షలకు ‘వర్షం’ ఎఫెక్ట్
జేఎన్ఎస్లో నిలిచిన ఎంపిక ప్రక్రియ వరంగల్ : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కానిస్టేబుళ్ల భర్తీ కోసం ఎంపిక చేసేందుకు నిర్వహిస్తున్న పోటీలకు వర్షం అడ్డుపడింది. సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షంతో హన్మకొండలోని జేఎన్ఎస్ స్టేడియం మొత్తం బురదమయంగా తయారైంది. దీంతో ఎంపిక ప్రక్రియ బుధవారానికి వాయిదా పడింది. కేయూ మైదానంలో 950 మంది హాజరు వరంగల్ రూరల్ జిల్లా పోలీసు పరిధిలో కానిస్టేబుళ్ల భర్తీ కోసం ఎంపిక చేసేందుకు కాకతీయ యూనివర్సిటీ మైదానంలో మంగళవారం 950 మందికి పరుగు పందెం నిర్వహించారు. సోమవారం రాత్రి వర్షం పడినప్పటికీ రన్నింగ్ ట్రాక్ పొడిగా మారడంతో అధికారులు అభ్యర్థులకు పరుగు పందెం నిర్వహించారు. గడిచిన నాలుగు రోజుల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను రూరల్ ఎస్పీ అంబర్ కిషోర్ఝూ పర్యవేక్షించారు. ఏఆర్ అడిషనల్ ఎస్పీ ప్రవీణ్కుమార్, ములుగు ఏఎస్పీ విశ్వజిత్కంపాటి, డీఎస్పీలు రాజామహేంద్ర నాయక్, సత్యనారాయణరెడ్డి, సుదీంద్ర, రాంచందర్రావు పాల్గొన్నారు.