-
నిఖార్సుగా కోర్సు..
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా డిగ్రీ, పీజీ కోర్సుల్లో సమూల మార్పులకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) శ్రీకారం చుట్టింది. ఈ మేరకు లెర్నింగ్ ఔట్కమ్స్ బేస్డ్ కరిక్యులమ్ ఫ్రేమ్వర్క్ను (ఎల్వోసీఎఫ్) రూపొందించింది. అందుకు అనుగుణంగా సిద్ధం చేసిన మోడల్ కరిక్యులమ్ను అందుబాటులోకి తెచ్చింది. డిగ్రీ, పీజీలో వివిధ కోర్సుల కాంబినేషన్లలో మార్పులు తీసుకువచ్చింది. విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనే లక్ష్యంగా ఈ కరిక్యులమ్ను సిద్ధం చేసింది. ప్రతి విద్యా సంస్థ సమాజం, పరిశ్రమలతో కచ్చితంగా అనుసంధానమై ఉండేలా ఈ మార్పులకు శ్రీకారం చుట్టింది. దేశంలోని అన్ని యూనివర్సిటీల నుంచి అభిప్రాయాలను స్వీకరించి దీనిని రూపొందించింది. వాస్తవానికి 2019–20 విద్యా సంవత్సరం నుంచే దీనిని అమల్లోకి తేవాలని భావించినా సాధ్యం కాకపోవడంతో వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేసే అవకాశం ఉంది. అయితే ఈ కరిక్యులమ్ను అన్ని రాష్ట్రాలు కచ్చితంగా అమలు చేయాలన్న నిబంధన లేదు. తమ రాష్ట్రాల్లో అందిస్తున్న కోర్సుల ద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు బాగున్నాయనుకుంటే వాటినే కొనసాగించే సదుపాయం ఉంది. ఒకవేళ మార్పులు చేసుకోవాలనుకుంటే ఈ మోడల్ కరిక్యులమ్కు అనుగుణంగా మార్పులు చేసుకోవాలని యూజీసీ స్పష్టం చేసింది. 50% మందికి ఉపాధి లక్ష్యంగా.. దేశంలో 2022 నాటికి డిగ్రీ, పీజీ కోర్సులు చేసే విద్యార్థుల్లో కనీసంగా 50% మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించేలా చేయడమే లక్ష్యంగా ఈ సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ఇందులో ముఖ్యంగా విద్యార్థుల చదువులకు పారిశ్రామిక రం గంతో అనుసంధానం చేసేలా వాటిని రూపొందించింది. తద్వారా చదువుకునే సమయాల్లో మూడింట రెండొంతుల మంది విద్యార్థులు ఉపాధి, స్వయం ఉపాధిని పొందేలా చూసే లక్ష్యంతో కరిక్యులమ్ను రూపొందించింది. విద్యార్థులకు తప్పనిసరిగా అవసరమైన వృత్తిపరమైన నైపుణ్యాలు, టీమ్వర్క్, కమ్యూనికేషన్ స్కిల్స్, లీడర్షిప్ క్వాలిటీస్, టైమ్ మేనేజ్మెంట్ స్కిల్స్ను నేర్పించేలా ఈ మార్పులు తీసుకువచి్చంది. వీటితోపాటు మానవ విలువలు, ప్రొఫెషనల్ ఎథిక్స్ కూడా నేర్చుకోవడాన్ని కోర్సుల్లో భాగం చేసింది. మరోవైపు ఆవిష్కరణలకు ప్రాధాన్యం ఇస్తూ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు దోహదపడేలా కోర్సుల్లో మార్పులు చేసినట్లు వెల్లడించింది. ప్రతి అంశానికీ నిర్ణీత క్రెడిట్స్.. లెరి్నంగ్ ఔట్కమ్స్ బేస్డ్ కరిక్యులమ్ ఫ్రేమ్వర్క్ను డిగ్రీ, పీజీల్లో 16 రకాల కోర్సుల్లో రూపొందించింది. ఫిజిక్స్, ఇంగ్లి‹Ù, మ్యాథమెటిక్స్, బోటనీ, ఆంత్రోపాలజీ, హ్యూమన్ రైట్స్, క్రిమినాలజీ, సైకాలజీ, లైబ్రరీ సైన్స్, ఎల్రక్టానిక్ సైన్స్, హిందీ, స్టాటిస్టిక్స్, ఎన్విరాన్మెంటల్ సైన్స్, మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, బయోకెమిస్ట్రీ సబ్జెక్టుల్లో మార్పులు చేసింది. అలాగే పోస్టు గ్రాడ్యుకేషన్లోనూ ఆయా కోర్సులకు సంబంధించిన కరిక్యులమ్లో మార్పులు చేసింది. ఉదాహరణకు పోస్టు గ్రాడ్యుయేషన్ ఆంత్రోపాలజీలో విద్యార్థులకు పక్కాగా బేసిక్ కాన్సెప్్ట, ప్రొసీజరల్ నాలెడ్జ్, స్పెషలైజ్డ్ స్కిల్స్ కచి్చతంగా ఉండేలా దీనిని రూపొందించింది. వాటితోపాటు ఐడెంటిఫికేషన్ ఆఫ్ అప్రాప్రియేట్ ఇష్యూస్, ప్రాబ్లం సాలి్వంగ్ స్కిల్స్, ఇన్వెస్టిగేషన్ స్కిల్స్, ఐసీటీ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రొఫెషనల్, ఎథికల్ బిహేవియర్, ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ కూడా నేర్చుకునేలా దీనిని రూపొందించింది. అందుకు అనుగుణంగా క్రెడిట్స్ ఇవ్వాలని పేర్కొంది. మొత్తంగా డిగ్రీలో 148 క్రెడిట్స్ ఉండేలా చర్యలు చేపట్టాలని, అందులో ప్రధాన సబ్జెక్టులతోపాటు ప్రతి అంశానికీ నిరీ్ణత క్రెడిట్స్ ఇచ్చేలా కోర్సుల వారీగా పరీక్షల విధానాన్ని పొందుపరిచింది. ఎప్పటికప్పుడు ఖాళీల భర్తీకి సూచన.. ఉన్నత విద్యలో నాణ్యతా ప్రమాణాల పెంపునకు ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని స్పష్టం చేసింది. ఇందులో భాగంగా ప్రతి విద్యా సంస్థలో విద్యార్థులకు బోధించే అధ్యాపకుల ఖాళీలు 10 శాతానికి మించకూడదని స్పష్టం చేసింది. ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేసేలా రాష్ట్రాలు చర్యలు చేపట్టాలని పేర్కొంది. సమాజంలో వస్తున్న మార్పులు, పారిశ్రామిక రంగంలో పురోగతిని అధ్యాపకులు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ విద్యార్థులకు అందించాలని వెల్లడించింది. 2022 నాటికి దేశంలోని ప్రతి విద్యా సంస్థ కనీసం 2.5 స్కోర్తో నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రెడిటేషన్ కౌన్సిల్ గుర్తింపు పొంది ఉండాలని పేర్కొంది. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం... యూజీసీ జారీ చేసిన మోడల్ కరిక్యులమ్ను పరిశీలించాక ఉన్నత స్థాయిలో చర్చించి ముందుకు సాగుతాం. మోడల్ కరిక్యులమ్లో పేర్కొన్న కోర్సులు, మార్పులు, తెలంగాణలో ఉన్న కోర్సులను పరిశీలించి అవసరమైన వాటిని పరిశీలిస్తాం. అవసరం అనుకుంటే తగిన మార్పులు చేసే అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. –-ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్, డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్, తెలంగాణ (దోస్త్) కన్వీనర్ ప్రొఫెసర్ ఆర్. లింబాద్రి -
సివిల్స్కు అనుగుణంగా డిగ్రీ!
* బీఏ సిలబస్లో మార్పులు చేర్పులు * ఆంత్రోపాలజీ కాంబినేషన్లతో కొత్త కోర్సులు * సోషియాలజీ, సోషల్ వర్క్ పాఠ్యాంశాల్లోనూ మార్పులు * బీఏ విద్యార్థులు ఎన్జీవోలతో కలసి పనిచేసేలా ఒప్పందం * చదువు పూర్తికాగానే ఉపాధి అవకాశాలు లభించేలా ఏర్పాట్లు * తె లంగాణ ఉన్నత విద్యా మండలి నిర్ణయాలు సాక్షి, హైదరాబాద్: సివిల్స్ పోటీ పరీక్షలకు అనుగుణంగా డిగ్రీ సిలబస్లో మార్పులు తేవాలని తెలంగాణ ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. సివిల్స్ రాసేవారు ఆంత్రోపాలజీ సబ్జెక్టుకు ఇచ్చే ప్రాధాన్యం అంతాఇంతా కాదు. అందుకే ఆంత్రోపాలజీ కాంబినేషన్తో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్లో (బీఏ) కొత్త కోర్సులు ప్రవేశపెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటివరకు డిగ్రీ స్థాయిలో ఆంత్రోపాలజీ కాంబినేషన్తో కోర్సులు ఉన్నా.. ఇటు ప్రభుత్వ కాలేజీలు, అటు ప్రైవేటు కాలేజీలు ఆ కోర్సులకు అడ్మిషన్లు తీసుకోవడం లేదు. ఇకపై అలా కాకుండా ఆయా కోర్సులను అన్ని కాలేజీలు కచ్చితంగా నిర్వహించేలా చర్యలు చేపట్టాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత కాలేజీల్లో కచ్చితంగా ఈ కోర్సులకు అడ్మిషన్లు చేపట్టాలని భావిస్తోంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి డిగ్రీ సిలబస్ మారనుంది. ఈ మార్పుల్లో భాగంగా ఆంత్రోపాలజీ, సోషియాలజీ, సోషల్ వర్క్ సబ్జెక్టుల సిలబస్ను మార్చాలని నిర్ణయించారు. తెలంగాణ ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి, వైస్ చైర్మన్లు ప్రొఫెసర్ మల్లేశ్, ప్రొఫెసర్ వెంకటాచలం ఆధ్వర్యంలో అన్ని యూనివర్సిటీల విభాగాధిపతులు, బోర్డు ఆఫ్ స్టడీస్ చైర్మన్లు, డీన్లతో సోమవారం సమావేశం జరిగింది. ఇందులో డిగ్రీ సిలబస్లో తీసుకు రావాల్సిన మార్పులపై చర్చించారు. మార్పులు చేర్పుల్లో జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి సిలబస్, యూపీఎస్సీ సిలబస్ను పరిగణనలోకి తీసుకుంటారు. వాటిలోని ప్రధాన అంశాలతో బీఏలో మూడేళ్లపాటు ఆంత్రోపాలజీ కాంబినేషన్తో కోర్సును నిర్వహిస్తారు. తద్వారా సివిల్స్ వంటి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి డిగ్రీ స్థాయి నుంచే పునాది వేయొచ్చని మండలి వైస్ చైర్మన్ మల్లేశ్ పేర్కొన్నారు. దీంతో డిగ్రీ తర్వాత కోచింగ్ సెంటర్లలో ఆంత్రోపాలజీలో శిక్షణ పొందాల్సిన అవసరం ఉండదన్నారు. బీఏలో హిస్టరీ-ఆంత్రోపాలజీ-సోషియాలజీ, ఆంత్రోపాలజీ-పొలిటికల్ సైన్స్-ఫిలాసఫీ, ఆంత్రోపాలజీ-సైకాలజీ-ఇంగ్లిష్ లిటరేటర్ వంటి కాంబినేషన్లతో మార్పులు తెస్తామన్నారు. సోషియాలజీ, సోషల్ వర్క్ సబ్జెక్టుల సిలబస్లోనూ మార్పులు తేనున్నారు. ఈ మార్పులపై మరింత లోతుగా అధ్యయనం చేసి సిలబస్ను మార్చేందుకు బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ సోషియాలజీ డీన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి చైర్మన్గా కమిటీ ఏర్పాటు చేశారు. ఇందులో వివిధ విశ్వ విద్యాలయాల విభాగాధిపతులు, బోర్డు ఆఫ్ స్టడీస్ చైర్మన్లు సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీకి అదనంగా.. డిగ్రీ కాలేజీల్లో బోధించే 10 మంది లెక్చరర్లతో మరో వర్కింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. వీటన్నింటికి సమన్వయకర్తగా ఉస్మానియా విశ్వవిద్యాలయం సోషియాలజీ విభాగం అధిపతి ప్రొఫెసర్ గణేశ్ వ్యవహరిస్తారు. సోషియాలజీలో ముఖ్యంగా ప్రాంతీయ సంస్కృతి అంశంలో తెలంగాణ సంప్రదాయాలు, సంస్కృతికి పెద్దపీట వేస్తారు. సోషియాలజీ, సోషల్ వర్క్ వంటి సబ్జెక్టులతో బీఏ చేసే వారి సిలబస్ను ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మార్చడంపై దృష్టి సారిస్తారు. ఇందులో భాగంగా క్షేత్ర పర్యటనలు, ఇతర ప్రాక్టికల్స్ విషయంలో ఎన్జీవో సంస్థలతో కలసి విద్యార్థులు పని చేసేలా ఒప్పందం కుదుర్చుకుంటారు. దీంతో డిగ్రీ పూర్తయ్యాక విద్యార్థులకు ఎన్జీవో సంస్థల్లో ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని భావిస్తున్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- అబద్ధాల వసంతం.. గ్రూపు రాజకీయాలే ఆసాంతం
- Prajwal Revanna: ఏ గదిలో ఏం జరిగింది?
- మహిళలపై టీడీపీ అభ్యర్థి అనుచిత వ్యాఖ్యలు
- అవన్నీ అపోహలే
- జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
- ఐరాసలో జగన్ విజన్
- బెంగళూరు గెలుపు ‘హ్యాట్రిక్’
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
Advertisement