-
ఎన్నికల్లో నామినేషన్ కోసం 22 కి.మీ పరిగెత్తాడు.. కారణం ఏంటంటే!
సాధారణంగా ఎన్నికల్లో నామినేషన్ అంటే చుట్టూ జనాలు, పదుల సంఖ్యలో వాహనాలు.. ఓ వేడుకను తలపిస్తుంటుంది. అయితే ఓ వ్యక్తి మాత్రం వీటికి భిన్నంగా 22 కి.మీ పరిగెత్తుకుంటూ వెళ్లి పంచాయతీ ఎన్నికల్లో నామినేషన్ వేశాడు. అయితే తాను ఈ పద్ధతినే ఎంచుకోవడం వెనుక ఓ కారణముందని చెబుతున్నాడు. అదేంటంటే.. వివరాల్లోకి వెళితే.. పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికల 2023 నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. అందుకే 22 కి.మీ పరగు డార్జిలింగ్ జిల్లాలోని సొనాడ గ్రామ పంచాయతీకి చెందిన తుమ్సోంగ్ ఖాస్మహల్ నివాసి అయిన సనారా సుబ్బా ఈ సారి ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలనుకున్నాడు. ఇక డార్జిలింగ్లో కొండ ప్రాంతంలోని గ్రామంలో రోడ్లు కూడా సరిగా ఉండవు, ఇక కమ్యూనికేషన్ వ్యవస్థ గురించి చెప్పక్కర్లేదు. ఈ సమస్యలను అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లాలని ఉద్దేశ్యంతో 22 కిలోమీటర్లు పరిగెత్తుతూ బీడీఓ కార్యాలయానికి చేరుకుని నామినేషన్ దాఖలు చేశాడు. ఎన్నో ఏళ్లుగా తమ గ్రామం అభివృద్ధికి నోచుకోలేదని ఈ విధంగా నిరసన తెలిపాడు. తన గ్రామంలోని రోడ్ల పరిస్థితి ఎంతో అధ్వాన్నంగా ఉందని.. ఎవరైనా అనారోగ్యానికి గురైతే, అతన్ని పర్వత సానువులలో అనేక కిలోమీటర్లు స్ట్రెచర్పై తీసుకెళ్లి అంబులెన్స్లో తీసుకెళ్లాల్సి ఉంటుందని తెలిపాడు. రోడ్లు లేకపోవడంతో విద్యార్థులు కూడా ఇబ్బందులు పడుతున్నారని అతను అభిప్రాయపడ్డాడు. పర్యావరణ కాలుష్యం పర్వతాలను కూడా ప్రభావితం చేసిందని.. దీంతో పాటు ట్రాఫిక్ జామ్ కూడా పెరిగిందని తెలిపాడు.ట్రాఫిక్ జామ్తో కొండవాలు, పర్యాటకులు కూడా నానా అవస్థలు పడుతున్నారని.. అయితే రాజకీయ పార్టీలకు వాటి గురించి ఆలోచించే సమయం లేదని వాపోతున్నాడు. చదవండి: తల్లి, ఐదుగురు చిన్నారులు సజీవదహనం -
63 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజున..
సాక్షి, న్యూఢిల్లీ : డార్జిలింగ్ టీగా స్థానికంగా పిలిచే ‘మార్గరెట్స్ హోప్ టీ’ ప్రపంచ ప్రసిద్ధి చెందిన బ్రాండుల్లో ఒకటి. దీని యజమాని గుడ్రీక్ గ్రూప్. ఆరు దశాబ్దాల క్రితం అంటే 1955, జూన్ 25వ తేదీన (సరిగ్గా నేటికి 63 ఏళ్లు) కొండల్లో నెలవైన ఈ టీ గార్డెన్లోకి సుత్తీ కొడవలి గుర్తును కలిగిన ఎర్రని జెండాను చేతపట్టుకొని కాలి లింబుని అనే 12 ఏళ్ల బాలిక దూసుకొచ్చింది. అప్పటికే ఆ టీ గార్డెన్ మేనేజర్ భవనానికి 50 మీటర్ల ఇవతల కొన్ని వందల మంది టీ గార్డెన్ కార్మికులు నిలబడి గొంతెత్తి తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. 12 ఏళ్ల లింబుని కూడా వారితో గొంతును కలిపి గట్టిగా నినాదాలు చేయడం అక్కడి కార్మికులకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. ‘నారి సంఘటన్’ సభ్యులుగా ఉన్న అనేక మంది మహిళలు కూడా కార్మికుల ముందు వరుసలో నిలబడి నినాదాలు చేస్తున్నారు. వారిలో లింబుని తల్లి కూడా ఉంది. సమీపంలో ఉన్న దిలారామ్ టీ ఎస్టేట్లో సమ్మె చేస్తున్న కార్మికులను పనుల్లో చేరాల్సిందిగా పోలీసులు బలవంతం చేస్తున్నారన్న వార్త తెలియడంతో అక్కడికి వెళ్లి అక్కడి కార్మికులకు మద్దతు తెలపాలని మార్గరెట్స్ హోప్ టీ కార్మికులు అటువైపు కదంతొక్కారు. మార్గమధ్యంలో వారికి పలుసార్లు తుపాకీ కాల్పులు వినిపించాయి. అయినా వెరవకుండా దిలారామ్ టీ ఎస్టేట్లోకి కార్మికులు పరుగులు తీశారు. వారి వెంట పరుగెత్తికెళ్లిన లింబునికి కళ్ల ముందు ఏదో పేలిన శబ్దం వినిపించింది. కాసేపు ఏదీ కనిపించలేదు. కళ్లు మంటలెత్తుతున్నాయి. చుట్టూ అరుపులు, ఆర్తనాదాలు వినిపిస్తూనే ఉన్నాయి. మరికాసేపటికి కళ్లు నులుముకుంటూ తేరిపార చూస్తే ఇద్దరు మహిళలు సహా ఆరుగురు కార్మికులు రక్తం మడుగుల్లో పడి ఉన్నారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. నేటికీ బతికున్న నాటి 12 ఏళ్ల బాలిక లింబుని నాటి సంఘటన గురించి మీడియాకు చెప్పుకొచ్చారు. టీ గార్డెన్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం భారత కమ్యూనిస్టు పార్టీ, అఖిల భారతీయ గోర్ఖా లీగ్లు ఇచ్చిన పిలుపు మేరకు మార్గరెట్స్ హోప్, దిలారామ్ టీ ఎస్టేట్లతోపాటు ముండా, బాలాసన్, మహారాణి టీ ఎస్టేట్లలో సమ్మె జరిగింది. జూన్ 22వ తేదీనే సమ్మె ప్రారంభంకాగా, 25వ తేదీన అది కాల్పులకు దారితీసింది. ఆ మరుసటి రోజు దాదాపు 20 వేల మంది కార్మికులు డార్జిలింగ్ జిల్లా కార్యాలయాన్ని ముట్టడించారు. పోలీసులను పెద్ద ఎత్తున మొహరించి ఎంతోమంది కార్మిక నాయకులను అరెస్ట్ చేశారు. వారిలో సీపీఐ నాయకులే ఎక్కువ మంది ఉన్నారు. ఆందోళనను మరింత తీవ్రం చేయడంతో టీ ఎస్టేట్ యజమానులు దిగొచ్చారు. రోజుకు కనీస వేతనంగా కార్మికులకు ఇస్తున్న వేతనాన్ని ఆరు అణాల (దాదాపు 38 పైసలు) నుంచి ఎనిమిది అణాలకు (దాదాపు 50 పైసలు) పెంచారు. మొదటిసారి బోనస్ ప్రకటించారు. మహిళలకు ప్రసూతి సమయంలో వేతనంతో కూడిన సెలవు ఇచ్చేందుకు అంగీకరించారు. ఈ డార్జిలింగ్ సంఘటన పశ్చిమ బెంగాల్ చరిత్రలోనే కాదు దేశ చరిత్రలోనూ శాశ్వతంగా నిలిచిపోయింది. 1948, నవంబర్ నెలలోనే భారత ప్రభుత్వం కార్మికులకు కనీస వేతనాల చట్టాన్ని తీసుకొచ్చినా టీ ఎస్టేట్ కార్మికులకు అమలు కాలేదు. కార్మికుల కనీస వేతనాలను పెంచుతూ ఈ చట్టాన్ని 2017లో కూడా సవరించారు. ఈ చట్టం ప్రకారం కేంద్ర కార్మికులకే కనీస వేతనాలను కేంద్రం నిర్ణయిస్తుంది. రాష్ట్రంలోని కార్మికులకు, ఉద్యోగులకు కనీస వేతనాలను నిర్ణయించాల్సింది ఆయా రాష్ట్రాలదే. నాటి పోలీసు కాల్పుల్లో మరణించిన ఆరుగురు కార్మికుల సంస్మరణార్థం డార్జిలింగ్ హిల్స్పై ఓ స్మారక స్థూపాన్ని ఏర్పాటు చేశారు. పాత స్థూపం పాడైపోగా, కొత్త స్థూపాన్ని సీపీఎం నుంచి విడిపోయిన ‘కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ రెవల్యూషనరీ మార్క్సిస్ట్స్’ పార్టీ 2004 నుంచి జూన్ 25వ తేదీన స్మారక కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తోంది. ఈ విషయాన్ని నాటి సమ్మెలో పాల్గొన్న లాక్మోతీ దేవన్ మనవడు సలీమ్ సుబ్బా తెలిపారు. డాక్టర్ అభానిరంజన్ తాలపత్ర స్ఫూర్తి నాటి టీ గార్డెన్స్ కార్మికులు సమ్మెకు సీపీఐకి చెందిన డాక్టర్ అభానిరంజన్ స్ఫూర్తినిచ్చారని నక్సల్బరి ఉద్యమకారుల్లో ఒకరైన చారు మజుందార్ కుమారుడు అభిజిత్ మజుందార్ వివరించారు. ఆయన ‘యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ టీ గార్డెన్ వర్కర్స్’కు జాయింట్ కన్వీనర్గా పనిచేస్తున్నారు. ఆయన కథనం ప్రకారం వంద కిలోమీటర్ల దూరంలో మైదాన ప్రాంతంలో నివసిస్తున్న డాక్టర్ అభానిరంజన్ టీ కార్మికుల వైద్య అవసరాల గురించి తెలుసుకొని తేయాకు కొండలపైకి వచ్చి స్థిర నివాసం ఏర్పరుచుకున్నారు. అప్పట్లో కార్మికుల కాళ్లకు చెప్పులుకానీ బూట్లుగానీ ఉండేవి కావు. పురుగు పుట్ర జొరబడకుండా నిండైన దుస్తులు కూడా ముఖ్యంగా ఆడవాళ్లకు ఉండేవి కావు. ప్రతిరోజు రాత్రి వారిళ్లకు డాక్టర్ వెళ్లి గాయాలకు, ఇన్ఫెక్షన్లకు వైద్యం చేసేవారు. ప్రతిరోజు తేయాకు తోటలో పనికాగానే కార్మికులు చేతులు కడుక్కునేందుకు ఆ డాక్టర్ ఐయోడిన్ సొల్యూషన్ను తయారు చేసి ఇచ్చారు. వారి కష్టసుఖాలను తెలుసుకుంటూ కార్మికులను సమ్మెకు పురిగొల్పారు. తెభాగా ఉద్యమంలో కూడా 1946–47లో జరిగిన తెభాగా ఉద్యమంలో కూడా డాక్టర్ అభానిరంజన్ పాల్గొన్నారని అభిజిత్ మజుందార్ తెలిపారు. పండించిన పంటలో సగం కాకుండా మూడొంతుల పంటను ఇవ్వాలంటూ కౌలు రైతులు చేసిన ఉద్యమం అది. ప్రధానంగా ఆ ఉద్యమమే నక్సల్బరి ఉద్యమానికి నాంది పలకగా, ఆ ఉద్యమ నాయకులకు కూడా టీ గార్డెన్ కార్మికుల సమ్మె స్ఫూర్తినిచ్చిందని మజుందార్ మీడియాకు వివరించారు. మార్గరెట్స్ హోప్ టీ గార్డెన్కు 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న నక్సల్బరిలో 1967లో రైతుల సాయుధ పోరాటం జరిగింది. డార్జిలింగ్ జిల్లా సిలిగురి సబ్డివిజన్లో నక్సల్బరి ప్రాంతం ఉంది. ఈ ఉద్యమానికి నాయకత్వం వహించిన వారిలో చారు మజుందార్ ఒకరు. -
డార్జిలింగ్లో మళ్లీ అల్లర్లు
సాక్షి, కోల్కతా : డార్జిలింగ్ మరోసారి అల్లర్లతో అట్టుడికిపోయింది. గురువారం ఉదయం చెలరేగిన ఘర్షణలో ఓ పోలీస్ అధికారితోపాటు ఓ వ్యక్తి మృతి చెందగా.. పలువురు ఆందోళనకారులకు గాయాలయ్యాయి. గుర్ఖాల్యాండ్ జనముక్తి మోర్చా(జీజేఎం) నేత బిమల్ గురంగ్.. లెప్చా బస్తీలో తలదాచుకున్నాడన్న సమచారం మేరకు ఆయన్ని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు యత్నించారు. ఈ క్రమంలో అడ్డుకున్న బీజేఎం కార్యకర్తలు పోలీసులపై కాల్పులు జరిపారు. ఘటనలో ఓ అధికారి గాయపడగా, చికిత్స పొందుతూ ఆయన మృతి చెందాడు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వ వ్యతిరేక కార్యాకలాపాలకు పాల్పడ్డాడన్న ఆరోపణలపై బెంగాల్ పోలీసులు బిమల్ గురంగ్ పై వారెంట్ జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఆయన అజ్ఞాతంలో ఉండగా.. అరెస్ట్ చేసేందుకు పోలీసులు తీవ్రంగా యత్నిస్తున్నారు. అయితే అక్టోబర్ 30న నిర్వహించబోయే భారీ ర్యాలీకి ఎట్టి పరిస్థితుల్లో తాను హాజరై తీరతానని బిమల్ ఓ ఆడియో సందేశంలో కార్యకర్తలకు తెలిపారు. ఇదిలా ఉంటే గురంగ్ మద్ధతుదారులు భారీ ఎత్తున్న మారణాయుధాలను.. పేలుడు పదార్థాలను దాచారని.. అక్టోబర్ 30న బహిరంగ సభ ద్వారా పెద్ద ఎత్తున్న హింసకు వ్యూహరచన చేశారని పోలీసులు ఆరోపిస్తున్నారు. ఇందుకు సాక్ష్యంగా తాజాగా నిర్వహించిన దాడుల్లో 6 ఏకే-47 రైఫిల్స్ను స్వాధీనం చేసుకున్నట్లు వారు చూపిస్తున్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధనకై జీజేఎం పెద్ద ఎత్తున్న ఉద్యమిస్తున్న విషయం తెలిసిందే. -
డార్జిలింగ్ను విభజించే ప్రసక్తే లేదు
డార్జిలింగ్(పశ్చిమబెంగాల్): డార్జిలింగ్ కొండప్రాంత విభజనకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించే ప్రసక్తి లేదని పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశారు. ఆమె ఆదివారమిక్కడ ఓ ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తూ ఈ విషయాన్ని పునరుద్ఘాటించారు. తమ ప్రభుత్వం డార్జిలింగ్ అభివృద్ధికి కట్టుబడి ఉందని, ప్రత్యేక ప్యాకేజీలతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఇప్పటికే ఐటీఐ, ఇంజనీరింగ్ కళాశాల, విద్యుత్, తాగునీటికి సంబంధించిన వివిధ ప్రాజెక్టుల ఏర్పాటుకు తమ ప్రభుత్వం ఆమోదం తెలిపిందని చెప్పారు. బంద్ పిలుపులపై తృణమూల్ అధినేత్రి మండిపడ్డారు. సమ్మెలకు, వ్యాపార సంస్థలు, హోటళ్లు, షాపుల మూసివేతలకు కొందరు పిలుపులిస్తూ ఈ ప్రాంత అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆమె విమర్శించారు. -
కేంద్రంతో మాత్రమే చర్చిస్తాం: జీజేఎం
డార్జిలింగ్: ప్రత్యేక గూర్ఖాలాండ్ రాష్ట్రం ఏర్పాటు డిమాండ్పై తాము కేంద్ర ప్రభుత్వంతో మాత్రమే చర్చలు జరుపుతామని, పశ్చిమ బెంగాల్ సర్కారుతో ఈ అంశంపై మాట్లాడే ప్రసక్తే లేదని గూర్ఖా జనముక్తి మోర్చా (జీజేఎం) కరాఖండిగా తేల్చి చెప్పింది. జీజేఎం చేపట్టిన నిరవధిక సమ్మెలో భాగంగా డార్జిలింగ్ పర్వతప్రాంతంలో ఆదివారం తొమ్మిది రోజూ బంద్ కొనసాగింది. ‘ప్రత్యేక గూర్ఖాలాండ్ రాష్ట్రం ఏర్పాటు కోసం మా న్యాయమైన డిమాండ్పై కేంద్ర ప్రభుత్వంతో మాత్రమే చర్చలు సాగిస్తాం. ఈ అంశంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంతో మాట్లాడే ప్రసక్తే లేదు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి ఈ అంశంతో ఎలాంటి సంబంధం లేదు’ అని జీజేఎం అధినేత బిమల్ గురుంగ్ ఆదివారం మీడియాతో అన్నారు. డార్జిలింగ్ ప్రాంతానికి కేంద్రపాలిత ప్రాంతం హోదా పొందేందుకు కేంద్రంతో జీజేఎం రహస్య ఒప్పందం కుదుర్చుకుందంటూ వచ్చిన ఆరోపణలను ఆయన ఖండించారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న బంద్కు ఒకరోజు విరామం ప్రకటిస్తున్నామని తెలిపారు. ఆగస్టు 13-14 నుంచి ‘జనతా కర్ఫ్యూ’ ప్రారంభించనున్నామని ప్రకటించారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విధించిన 72 గంటల గడువు ఆమె ఆదేశం కాదని, కోర్టు ఆదేశమని అన్నారు. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించకుండానే ‘జనతా కర్ఫ్యూ’ కొనసాగిస్తామని, ప్రజలంతా ఇళ్లకే పరిమితమవుతారని చెప్పారు. ఒకవైపు డార్జిలింగ్లో నిరవధిక బంద్ కొనసాగుతుండగా, మరోవైపు అరెస్టుల పర్వం కూడా కొనసాగుతోంది. జీజేఎం కోర్ కమిటీ సభ్యుడు శేఖర్ శర్మను శనివారం రాత్రి కుర్సియాంగ్లో పోలీసులు అరెస్టు చేశారు. బంద్లు ఆపకుంటే కఠిన చర్యలు: గొగోయ్ గువాహటి: ప్రత్యేక రాష్ట్రాల డిమాండ్లతో అస్సాంలో బంద్లు కొనసాగిస్తున్న నిరసనకారులు బంద్ ఆపాలని, లేకుంటే కఠిన చర్యలు తప్పవని అస్సాం ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ హెచ్చరించారు. త్రిపురలోనూ ‘ప్రత్యేక’ డిమాండ్: ఈశాన్య రాష్ట్రమైన త్రిపురలోనూ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు డిమాండ్ తెరపైకి వచ్చింది. గిరిజన ప్రాంతాలను కలుపుతూ త్రిపుర గిరిజన ప్రాంతాల స్వయంప్రతిపత్తి జిల్లా మండలిని (టీటీఏఏడీసీ) ఏర్పాటు చేయాలని ఇండిజీనస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర (ఐపీటీఎఫ్) డిమాండ్ చేసింది. అయితే, త్రిపురలోని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఈ డిమాండ్ను వ్యతిరేకిస్తున్నాయి.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
సంజయ్లీలా భన్సాలీ 'హీరామండి' వెబ్ సిరీస్ ఎలా ఉంది..?
నాడు మోదీకి వంట వండిన దీపక్.. ఇప్పుడేం చేస్తున్నారు?
కాన్వాయ్ స్లో చేసి అంబులెన్స్కు దారిచ్చిన సీఎం జగన్ (ఫొటోలు)
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
ఎల్లో శారీలో హీరామండి హీరోయిన్ సంజీదా షేక్ లుక్స్.. ఫోటోలు
ఇంటింటి ఎన్నికల ప్రచారంలో వైఎస్ భారతి (ఫొటోలు)
జగన్ పాటకే భయపడ్డారు!
‘ప్రియాంక గాంధీ కాంగ్రెస్కు రెబల్గా మారనుంది’
భారీ ఆఫర్ను రిజెక్ట్ చేసిన శ్రీలీల.. కారణం ఇదేనట
పవన్ వ్యూహానికి వంగా గీత కౌంటర్ వ్యూహమిదే..!
తప్పక చదవండి
- కెనడాలో మనవడిని చూడ్డానికి వెళ్లి...మనవడితో సహా దుర్మరణం
- Banjara Hills: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం.. నిండు ప్రాణం బలి
- తెలంగాణలో భానుడి భగభగలు..!
- తాతా.. నీకు టాటా..
- రోహిత్ వేముల ఆత్మహత్య కేసు మళ్లీ దర్యాప్తు చేస్తాం
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
- తిరుమలలో వడగళ్ల వర్షం (ఫొటోలు)
- కందికుంట అడ్డంగా దొరికినా..
- నిందితుడిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారు?
- కళ్లు చల్లబడ్డాయా బాబూ!
Advertisement