breaking news
dam water
-
సిక్కింలో భారీ ప్రాణనష్టం.. డ్యామ్ నిర్మాణంపై సీఎం సంచలన కామెంట్స్
గ్యాంగ్టక్: ఈశాన్య రాష్ట్రం సిక్కింలో సంభవించిన ఆకస్మిక వరదల్లో మృతుల సంఖ్య 40కి చేరుకోగా.. వారిలో 22 మంది మృతదేహాలు లభ్యమయ్యాయి. అదేవిధంగా, 22 మంది ఆర్మీ అధికారులు సహా గల్లంతైన వారి సంఖ్య 98కు పెరిగింది. ఈ నేపథ్యంలో వరదలపై సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నాసి రకం నిర్మాణం కారణంగా సిక్కింలోని చుంగుతాంగ్ డ్యామ్ కొట్టుకుపోయిందన్నారు. కాగా, సిక్కిం సీఎం ప్రేమ్ సింగ్ తమాంగ్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. డ్యామ్ నిర్మాణం సరైన పద్ధతిలో జరగలేదు. ఫలితంగా ఇది కొట్టుకుపోయింది. రాష్ట్రం ఉత్తరభాగంతో మిగిలిన ప్రాంతాలకు సంబంధాలు తెగిపోయాయి. క్లౌడ్ బర్ట్సింగ్ కారణంగా భారీ వర్షాల నేపథ్యంలో డ్యామ్ పూర్తిగా దెబ్బతిన్నట్టు తెలిపారు. 1200 మెగావాట్ల జలవిద్యుత్ ప్రాజెక్ట్ కూడా వరదల కారణంగా కొట్టుకుపోయినట్టు స్పష్టం చేశారు. ఇది సిక్కిం రాష్ట్రానికి భారీ నష్టాన్ని కలిగించిందని చెప్పుకొచ్చారు. రోడ్లు కొట్టుకుపోయాయి, వంతెనలు ధ్వంసమయ్యాయి. తీస్తాపై 13 వంతెనలు కొట్టుకుపోయాయని తమాంగ్ వివరించారు. #SikkimFlashFloods | Sikkim CM #PremSinghTamang said that the previous Sikkim Democratic Front government should be blamed for the tragedy of their sub-standard workhttps://t.co/bhUCNypX0B — Mint (@livemint) October 6, 2023 ఇదిలా ఉండగా.. ఉత్తర సిక్కింలోని లోనాక్ సరస్సు సైజు గత 30 ఏళ్లలో మూడు రెట్లు పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. తాజాగా చుంగుతాంగ్ డ్యామ్కు గండి పడిన సమయంలో లోనాక్ సరస్సు నుంచి పూర్తి నీరు డ్యామ్లోకి చేరలేదు. ఈ సరస్సులో ఇంకా నీరు ఉన్నట్లు శాటిలైట్ ఫొటోలు వివరిస్తున్నారు. ఈ నీరు కూడా డ్యామ్లోకి చేరితే పెనువిపత్తు చోటు చేసుకునేదని నిపుణులు చెబుతున్నారు. సిక్కింలో ఇలాంటి సరస్సులు మొత్తం 14 వరకు ఉన్నాయి. వీటిల్లో కుంభవృష్టిలు, భారీ మంచు పెళ్లలు విరిగిపడినా.. ఇవి గట్లు తెంచుకొని ఊళ్లపై పడతాయి. లోనాక్ సరస్సు ప్రదేశం సెస్మిక్ జోన్లో ఉండటంతో భూకంపాల కారణంగా ఇది లీకయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. VIDEO | "There have been damages worth Rs 1,000 crore. We cannot give exact details about damages, it will be revealed once a committee is formed and it completes its analysis. Our first priority is to save those who are stranded and provide them immediate relief," Sikkim CM… pic.twitter.com/cUcgjHdChO — Press Trust of India (@PTI_News) October 6, 2023 మరోవైపు.. ఆకస్మిక వరదలతో చుంగ్థంగ్ డ్యామ్ ధ్వంసం కావడం.. విద్యుత్ మౌలిక వ్యవస్థలు దారుణంగా దెబ్బతినడంతోపాటు నాలుగు జిల్లాల్లోని పలు గ్రామాలు, పట్టణాలు జల దిగ్బంధంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. మంగన్ జిల్లాలోని 8 వంతెనలు సహా మొత్తం 11 బ్రిడ్జీలు వరదల్లో కొట్టుకుపోయాయి. రాష్ట్రానికి గుండెకాయ వంటి పదో నంబర్ రహదారి పలుచోట్ల ధ్వంసమైంది. చుంగ్థంగ్ పట్టణం తీవ్రంగా దెబ్బతింది. తీస్తా నదికి వరద ఉధృతి మరింత పెరిగే అవకాశాలున్నందున, పరీవాహక ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రదేశాలకు చేరుకోవాలని ఎస్ఎస్డీఎంఏ కోరింది. సిక్కింలోని వేర్వేరు ప్రాంతాల్లో వరదల్లో చిక్కుకుపోయిన వేల మంది పర్యాటకుల్లో విదేశీయులూ ఉన్నారు. Tista Dam near Chungthang , North sikkim. Dam at loc was swept away, which cauSes 50 feet hike in tista river. Massive water force has swept away everything in his route. Massive destruction in area reported. Urgent help needed #sikkimfloods #ANI #Aajtak #Ndtv #PMO pic.twitter.com/R2PkruFf9p — Anand Mishra (@Anand55587175) October 6, 2023 -
సరదాకు చేసిన ఫీట్ ప్రాణాల మీదకు తెచ్చింది.. వీడియో వైరల్
సరదాకు చేసిన ఓ ఫీట్ యువకుడిని ఆసుపత్రిపాలు చేసి ప్రాణాల మీదకు తెచ్చింది. పోలీసులు హెచ్చరించినా వినిపించుకోకపోవడంతో అతడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన కర్నాటకలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. ఇటీవల కర్నాటకలో భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. భారీ వర్షాల కారణంగా నదులు, వాగులు పొర్లిపొంగాయి. ఈ క్రమంలో చిక్కబళ్లాపూర్లోని శ్రీనివాస సాగర డ్యామ్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో డ్యామ్ వద్ద ఉన్న గోడపై నుంచి డ్యామ్ నీళ్లు కిందకు వస్తున్నాయి. వేసవిలో దీన్ని చూసేందుకు స్థానికులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకుని ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ యువకుడు(20) పై నుంచి నీళ్లు వస్తున్న సమయంలో సరదాకు ట్రెక్కింగ్ చేయబోయాడు. అతడు దాదాపు 25 అడుగుల ఎత్తుకు చేరుకున్న తర్వాత పట్టుజారి పోవడంతో కింద పడిపోయాడు. కాగా, ఆనకట్ట దాదాపు 50 అడుగుల ఎత్తు వరకు ఉంటుంది. ఈ ప్రమాదంలో గాయపడిన యువకుడిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఇదిలా ఉండగా.. ప్రమాదకర ఫీట్ చేయవద్దని జిల్లా యంత్రాంగం హెచ్చరించినా పట్టించుకోకుండా యువకుడి ఇలా చేయడంతో పోలీసులు అతడిపై కేసు నమోదు చేసినట్టు తెలిపారు. ఇక, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. A man fell down the wall of Srinivasa Sagara Dam in #Chikkaballapur and got injured while he was attempting to scale the wall. Reports @dpkBopanna pic.twitter.com/KUpU1NRgyR — Sanjay Jha (@JhaSanjay07) May 23, 2022 ఇది కూడా చదవండి: మోదీని సర్ప్రైజ్ చేసిన బాలుడు.. ఆశ్యర్యపోయిన ప్రధాని -
నిండుకుండలైన జలాశయాలు
-
వచ్చిన నీటిని వదిలేస్తే రాయలసీమకు ఎలా?
కడప: పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు నీరు ఇస్తామనే ధైర్యం లేకనే శ్రీశైలం నీటిని కిందికి వదులుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అవినాష్ రెడ్డి అన్నారు. వచ్చిన నీటిని వచ్చినట్లు కిందికి వదిలేస్తే రాయలసీమ పరిస్థితి ఏమికావాలని ఆయన ప్రశ్నించారు. శ్రీశైలంలో 854 అడుగుల నీటి మట్టాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. లేదంటే ప్రాజెక్టు వద్ద కిందికి వదులుతున్న నీటిని అడ్డుకోవడానికి సిద్ధంగా ఉన్నామని అవినాష్ రెడ్డి స్పష్టం చేశారు.