breaking news
Dabulbedrum House
-
ప్రజలను మోసం చేసిన కేసీఆర్
అల్లాదుర్గం(మెదక్): పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు, దళితుడే తెలంగాణకు మొట్ట మొదటి సీఎం, దళితులు సాగు చేసుకునేందుకు మూడెకరాల భూమి ఇస్తాం అంటూ ప్రజలకు ఎన్నో మోసపూరిత హామీలు సీఎం కేసీఆర్ ఇచ్చారని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మెదక్ జిల్లా అధ్యక్షుడు సంజీవరావు ఆరోపించారు. మంగళవారం అల్లాదుర్గంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేస్తానన్న కేసీఆర్ తన కుటుంబాన్ని మాత్రమే బంగారు కుటుంబంగా మార్చుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లను కట్టిస్తానని చెప్పినా ఏ గ్రామంలో అవి కనిపించక పోగా, నిరుపేదలు పూరిగుడిసెలలో నివసిస్తున్నారని చెప్పారు. దళితులకు మూడేకరాల వ్యవసాయ భూమి ఇస్తానన్న హామీ ఎక్కడ అమలు చేస్తున్నారో తెలియడం లేదన్నారు. పదవి కోసం తెలంగాణ యువతను బలి చేశారని మండిపడ్డారు. ప్రభుత్వ భూమిలో నిర్మించిన రామోజీ ఫిలింసిటీని లక్ష నాగళ్లతో దున్నిస్తానని చెప్పిన కేసీఆర్ ఆయనతో అదే ఫిలింసిటీలో ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు నరేశ్, సామాజిక హక్కుల సంఘం జిల్లా అధ్యక్షుడు ఆశయ్య, పద్మరావ్ పాల్గొన్నారు. -
రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోంది
► హామీలను విస్మరించిన టీఆర్ఎస్ ప్రభుత్వం ► అర్హులందరికీ పథకాలు వర్తింపచేయాలి ► టీడీపీ జిల్లా అధ్యక్షుడు విజయరమణారావు ► వేములవాడకు నిధుల కేటాయింపుపై హర్షం వేములవాడ/ఎలిగేడు : రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని టీడీపీ జిల్లా అధ్యక్షుడు చింతకుంట విజయరమణారావు ధ్వజమెత్తారు. గురువారం ఆయన వేములవాడ, ఎలిగేడులో జరిగిన కార్యక్ర మాల్లో మాట్లాడారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి 22 నెలలు గడిచినా హామీలను నెరవేర్చలేక కాలయాపన చేస్తోందని విమర్శించారు. డబుల్బెడ్రూం ఇళ్లు, రైతులకు రుణమాఫీ, మహారాష్ట్రతో ప్రాజెక్టుల ఒప్పందం వంటి వాటిపై ప్రజలను మభ్యపెడుతోందని విమర్శించారు. దరఖాస్తు చేసుకున్న అర్హులందరికీ డబుల్బెడ్రూం ఇళ్లను ఇవ్వాలని, లేకుంటే టీడీపీ ఆధ్వర్యంలో ఆర్డీవో కార్యాలయాలను ముట్టడించి కనువిప్పుకలిగేలా చేస్తామన్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండి నీటిని అందించేందుకు రూ.40వేల కోట్లతో వాటర్గ్రిడ్ పనులు చేపట్టారని, పక్కనే ఉన్న పెద్దపల్లి నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలోని చెరువులు, కుంటలను నింపిన తరువాతే మెదక్, గజ్వేల్, సిద్దిపేట ప్రాంతాలకు తీసుకవెళ్లాలన్నారు. ఎస్సీ, బీసీ కార్పొరేషన్ల రుణాలను ఎమ్మెల్యే లిస్టు తెప్పించుకుని అధికారపార్టీ కార్యకర్తలకు కేటాయించడం సిగ్గుచేటన్నారు. అభివృద్ధిని తమ పార్టీ స్వాగతిస్తుందన్న ఆయన.. వేములవాడ అభివృద్ధికి రూ.100 కోట్లు కేటాయించడం హర్షణీయమన్నారు. అవినీతికి తావు లేకుండా భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఆయా కార్యక్రమాల్లో టీడీపీ నాయకులు ఎంఏ.నసీర్, దివాకర్రావు, నందిపేట సుదర్శన్యాదవ్, పులి రాంబాబుగౌడ్, తదితరులు పాల్గొన్నారు