-
జీ వాటాదారులు ఏకంకావాలి
న్యూఢిల్లీ: కొద్ది రోజులుగా జీ ఎంటర్టైన్మెంట్(జీల్) యాజమాన్య మార్పిడికి డిమాండ్ చేస్తున్న ఇన్వెస్కో తాజాగా కంపెనీ వాటాదారులకు లేఖ రాసింది. సోనీ గ్రూప్తో జీల్ కుదుర్చుకున్న ఒప్పందంపై ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రమోటరేతర వాటాదారులంతా ఏకంకావాలంటూ అభ్యరి్థంచింది. ఈ డీల్ ద్వారా వాటాదారులను నష్టపరుస్తూ సుభాష్ చంద్ర కుటుంబం లబ్ది పొందే వీలున్నట్లు లేఖలో ఆరోపించింది. జీల్లో 7.74 శాతం వాటా ను కలిగిన ఇన్వెస్కో ఓపెన్ లెటర్ ద్వారా మరోసారి జీల్ బోర్డును పునర్వ్యవస్థీకరించాలం టూ డిమాండ్ చేసింది. ఇందుకు వీలుగా అత్యవసర వాటాదారుల సమావేశాన్ని నిర్వహించాలని పేర్కొంది. జీల్ సీఈవో పునీత్ గోయెంకాసహా ఇద్దరు ఇతర డైరెక్టర్లను తొలగించమంటూ ఇన్వెస్కో పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. డీల్ ఇలా..: గత నెలలో సోనీ గ్రూప్నకు చెందిన దేశీ విభాగం జీ కొనుగోలుకి తప్పనిసరికాని ఒప్పందాన్ని కుదుర్చుకుంది. దీనిలో భాగంగా రెండు సంస్థల విలీనాన్ని చేపట్టనుంది. తద్వారా విలీన సంస్థలో సోనీ ఇండియా వాటాదారులకు 53 శాతం వాటా లభించనుండగా.. మిగిలిన భాగం జీ వాటాదారులకు చెందనుంది. డీల్ ప్రకారం పోటీపడకుండా ఉండే క్లాజుతో చంద్ర కుటుంబానికి 2 శాతం అదనపు వాటాను బహుమతిగా ఇవ్వడాన్ని ఇన్వెస్కో లేఖ ద్వారా తప్పుపట్టింది. అంతేకాకుండా వీరి వాటాను 4 శాతం నుంచి 20 శాతానికి పెరిగేందుకు వీలు కలి్పంచడాన్ని అక్రమ చర్యగా పేర్కొంది. జీల్లో ఓఎఫ్ఐ గ్లోబల్ చైనా ఫండ్ ఎల్ఎల్సీతో కలసి ఇన్వెస్కో 17.88 శాతం వాటాను కలిగి ఉంది. కాగా.. కంపెనీ టేకోవర్కు ఆసక్తి ఉంటే 75 శాతం వాటా కొనుగోలుకి ఓపెన్ ఆఫర్ను ప్రకటించమంటూ గత వారం సుభాష్ చంద్ర సవాల్ విసిరిన నేపథ్యంలో ఇన్వెస్కో తాజా లేఖకు ప్రాధాన్యత ఏర్పడింది. ఇన్వెస్కో చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్నట్లు సుభాష్ చంద్ర పేర్కొన్నారు. -
యునెటైడ్ స్పిరిట్స్ చైర్మన్గా నేనే ఉంటా..
వాటాదారులు మాత్రమే నన్ను తొలగించగలరు... కంపెనీ బోర్డుకు మాల్యా స్పష్టీకరణ న్యూఢిల్లీ: యునెటైట్ స్పిరిట్స్(యూఎస్ఎల్) చైర్మన్ పదవిలోనే కొనసాగుతానని.. బోర్డు నుంచి తనను కంపెనీ షేర్హోల్డర్లు మాత్రమే తొలగించగలరని విజయ్ మాల్యా స్పష్టం చేశారు.కంపెనీ నిధులను మాల్యా అక్రమంగా ఇతర అనుబంధ సంస్థలకు మళ్లించారని, అకౌంట్లలో అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ.. బోర్డు నుంచి తప్పుకోవాల్సిందిగా శనివారంనాటి బోర్డు సమావేశంలో డియాజియో సంస్థ సూచించిన సంగతి తెలిసిందే. ఒకవేళ తప్పుకోకపోతే ఈ అంశాన్ని షేర్హోల్డర్ల ముందు పెడతామని కూడా పేర్కొంది. అయితే, అవకతవకలకు సంబంధించి కంపెనీ డెరైక్టర్ల బోర్డు చేసిన ఆరోపణలను మాల్యా తోసిపుచ్చారు. ప్రపంచ లిక్కర్ దిగ్గజం డియాజియో.. యూఎస్ఎల్లో మెజారిటీ వాటా కొనుగోలు చేయడంతో నియంత్రణ అంతా ప్రస్తుతం ఆ కంపెనీ చేతుల్లోనే ఉంది. అయితే, బోర్డులో డెరైక్టర్ పదవితోపాటు చైర్మన్గా తాను కొనసాగే విషయంలో డియాజియోతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నానని.. అందువల్ల వైదొలగే ప్రసక్తేలేదని మాల్యా ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ అంశాన్ని డియాజియో చర్చించనున్నట్లు కూడా చెప్పారు. 2013-14 ఆర్థిక సంవత్సరంలో రూ. 4,489 కోట్ల భారీ నికర నష్టాన్ని మూటగట్టుకోవడంతో.. యూబీ గ్రూప్ కంపెనీలకు ఇచ్చిన రుణాలు ఇతరత్రా అంశాలపై యునెటైడ్ స్పిరిట్స్ విచారణకు ఆదేశించింది.సెబీ కన్ను...: డియాజియో తాజా ఆరోపణల నేపథ్యంలో యూఎస్ఎల్ అకౌంట్లలో అవకతవకలు, నిధుల మళ్లింపు, ఇతరత్రా అంశాలను నిగ్గుతేల్చేందుకు సెబీతో పాటు ఇతర ఏజెన్సీలు కూడా రంగంలోకి దిగనున్నాయి. యూఎస్ఎల్, ఇతర యూబీ గ్రూప్ కంపెనీల్లో నిబంధనల ఉల్లంఘన ఆరోపణలపై దృష్టిపెట్టినట్లు సెబీ వర్గాలు చెప్పాయి.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వారి వల్లే మా ఎంగేజ్మెంట్ జరిగింది: అదితిరావు హైదరీ
పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ నటి (ఫోటోలు)
రాణించిన హెడ్, కమ్మిన్స్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'దీదీ గిరి' అంగీకరించను: పశ్చిమ బెంగాల్ గవర్నర్
బాబే కాదు ప్రధాని మోదీ కూడా యూటర్న్ తీసుకున్నారు: అమర్నాథ్
త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనున్న టాలీవుడ్ హీరోయిన్.. భర్తపై అలాంటి పోస్ట్!
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి నగదు
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
కాంగ్రెస్కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement