-
216 మార్కెట్ కమిటీలకు నోటిఫికేషన్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీల ఏర్పాటుకు ప్రభుత్వం శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అధికారులు ఇటీవల మార్కెట్ కమిటీల పునర్వ్యస్థీకరణను పూర్తి చేశారు. ప్రతి నియోజకవర్గంలో తప్పనిసరిగా ఒక మార్కెట్ కమిటీ ఉండాలనే సూచనల మేరకు.. మార్కెట్ కమిటీలు లేని 25 నియోజకవర్గాలకు మార్కెట్ కమిటీలు ఏర్పాటు చేశారు. దీంతో మొత్తం కమిటీల సంఖ్య 191 నుంచి 216కు పెరిగింది. వీటిన్నింటికీ ఈ నెలాఖరులోపు కమిటీలు ఏర్పాటు చేయాలని మార్కెటింగ్, సహకారశాఖ ప్రత్యేక కార్యదర్శి మధుసూదనరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రాథమికంగా జారీ చేసిన ఈ నోటిఫికేషన్పై ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే వారం రోజుల్లో గుంటూరులోని మార్కెటింగ్శాఖ స్పెషల్ కమిషనర్కు తెలియ చేయాలని కోరారు. 216 కమిటీల్లో 50 శాతం మహిళలకు, మిగిలిన 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు వచ్చే విధంగా రిజర్వేషన్లు పాటించాలని సూచించారు. ఈ మేరకు మొత్తం 216 కమిటీల్లో 108 కమిటీలకు మహిళలు చైర్పర్సన్లుగా నియమితులు కానున్నారు. 50 శాతం నామినేటెడ్ పోస్టులను మహిళలకు రిజర్వు చేస్తానన్న ముఖ్యమంత్రి హామీ ఈ ఉత్తర్వుల ద్వారా ఆచరణలోకి రానుంది. ఒక్కో మార్కెట్ కమిటీలో 20 మంది సభ్యులుంటారు. వీరిలో ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే గౌరవ అధ్యకుడిగానూ, నలుగురు అధికారులు, ముగ్గురు వ్యాపారులు, 12 మంది రైతులు సభ్యులుగానూ ఉంటారు. వీరిలో రైతులు, వ్యాపారులకు ఓటు హక్కు ఉంటుంది. వీరే కమిటీని ఏర్పాటు చేసుకుంటారు. నిబంధనల ప్రకారం కమిటీ ఏర్పాటయితే ప్రభుత్వం ఆమోదిస్తుంది. ఈ ప్రక్రియ అంతా ఈ నెలాఖరులోపు పూర్తవుతుందని మార్కెటింగ్, మత్స్య, పశుసంవర్థకశాఖ మంత్రి మోపిదేవి వెంకట రమణారావు తెలిపారు. -
‘సాగు నీటి’లో ఎన్నికల వేడి
సాగునీటి సంఘాల ఎన్నికలకు కసరత్తు 25లోగా ఓటర్ల జాబితా తయారీకి ఆదేశాలు ప్రజాస్వామ్యయుతంగా నిర్వహించాలంటున్న రైతు సంఘాలు మండపేట : సాగునీటి సంఘాల ఎన్నికలకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది. గ్రామ స్థాయిలో ఓటర్ల జాబితాలను సిద్ధం చేసేందుకు ఆదేశాలిచ్చింది. అధికార పార్టీ నేతల కనుసన్నల్లో గత నీటి సంఘాల ఎన్నికలు ఏకపక్షంగా సాగాయని, ఈసారైనా ప్రజాస్వామ్యయుతంగా నిర్వహించాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. నీటి సంఘాల రెండేళ్ల పదవీకాలం దగ్గరపడుతుండటంతో ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. జిల్లాలోని మేజర్, మీడియం, మైనర్ ప్రాజెక్టులకు సంబంధించి గోదావరి తూర్పు డెల్టా పరిధిలో 74 నీటి సంఘాలుండగా, గోదావరి మధ్య డెల్టా పరిధిలో 104, పెద్దాపురం డివిజ¯ŒS పరిధిలో 168, రంపచోడవరం పరిధిలో 55 కలిపి మొత్తం 401 నీటి సంఘాలున్నాయి. వాటి పరిధిలో 30 డిస్ట్రిబ్యూటరీ కమిటీలుండగా, ఐదు ప్రాజెక్టు కమిటీలున్నాయి. ఆయా సంఘాలకు సంబం ధించిన ఓటర్ల జాబితాలను ఈ నెల 25వ తేదీలోగా తయారు చేయాలని తాజాగా ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఆయకట్టు రైతులను గుర్తించి వారిని ఓటర్లుగా చేరుస్తూ నిర్ణీత గడువులోగా అధికారులు జాబితాలను రూపొందించాల్సి ఉంది. ఎన్నిక తీరు ఇలా... నీటి సంఘాల పరిధిలో ఆరుగురు సభ్యులుంటారు. ఆయా సంఘాల అధ్యక్షులు డిస్ట్రిబ్యూటరీ కమిటీ అధ్యక్షులను ఎన్నుకుంటారు. డీసీ అధ్యక్షులు ప్రాజెక్టు కమిటీ అధ్యక్షులను ఎన్నుకుంటారు. ఈ నెల 25వ తేదీ నాటికి ఓటర్ల జాబితాలను సిద్ధం చేయాల్సి ఉంది. అయితే ఓటర్ల జాబితాలు నిష్పక్షపాతంగా తయారు చేయాలని రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఏకాభిప్రాయం కాదు.. అంతా ఏకపక్షమే సాగునీటి సంఘాల ఎన్నికలు తప్పనిసరి చేయాలంటూ రెండేళ్ల కిందట సుప్రీంకోర్టు ఆదేశాలు నేపథ్యంలో 2015 సెప్టెంబరులో ఎన్నికల నిర్వహణకు చంద్రబాబు సర్కారు హడావిడిగా ఏర్పాట్లు చేసింది. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ, ఎన్నికల ప్రక్రియను ఎగతాళి చేస్తూ అంతా ఏకపక్షంగా సాగించింది. ఎన్నికలను తమకు అనుకూలంగా మలుచుకునేందుకు ఏపీ ఫార్మర్స్ మేనేజ్మెంట్ ఆఫ్ ఇరిగేష¯ŒS సిస్టమ్స్ యాక్టు –1997కు సవరణ చేసి ఏకాభిప్రాయం పేరిట చంద్రబాబు సర్కారు చీకటి జీవోను విడుదల చేసింది. రైతుల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోతే అప్పుడు ఏమి చేయాలనే విషయమై జీవోలో స్పష్టత ఇవ్వకపోవడాన్ని అధికారపార్టీ నేతలు ఆసరాగా చేసుకున్నారు. ఏకాభిప్రాయం ముసుగులో తమ అనుయాయులకు పదవులు కట్టబెట్టుకున్నారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తినా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అడ్డగించినా ఎన్నికలు జరిపించేశారు. అప్పట్లో జిల్లాలోని మండపేట మండలం పాలతోడు, రాయవరం మండలం చెల్లూరు, పసలపూడి, ఏలేశ్వరం, జగ్గంపేట, కిర్లంపూడి మండలంలోని పలు గ్రామాల్లోను, ఏలేరు ఆయకట్టు పరిధిలోను, కరప మండలం యండమూరు, కాజులూరు మండలం పల్లిపాలెం, అల్లవరం మండలం తాడికోన, దేవగుప్తం, బిక్కవోలు మండలం బలభద్రపురం, అయినవిల్లి మండలం నేదునూరు తదితర గ్రామాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గట్టిగా ప్రతిఘటించడంతో ఉన్నతాధికారులకు నివేదిస్తామంటూ అక్కడి నుంచి అధికారులు వెనుతిరిగారు. అయితే తర్వాత చాలాచోట్ల అధికారులు టీడీపీ నేతల ప్యానెల్కే పట్టం కట్టడం అధికార పార్టీ పచ్చపాతానికి పరాకాష్టగా నిలిచింది. ప్రభుత్వ తీరుపై అప్పట్లో రైతుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది.పలువురు ఎన్నికలను సవాల్ చేస్తూ కోర్టులను ఆశ్రయించారు. నిష్పక్షపాతంగా జాబితాలు తయారు చేయాలి ఇప్పటికైనా ప్రజాస్వామ్య పద్ధతిలో పాత ఏపీఎఫ్ఐఎంఎస్ యాక్టు ప్రకారం ఎన్నికలు జరపాలి. ఓటర్ల జాబితాలను పారదర్శకంగా తయారుచేయాలి. – కొవ్వూరి త్రినాధరెడ్డి, వైఎస్సార్ సీపీ రైతు, విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక ప్రధాన కార్యదర్శి ఓటర్ల జాబితాలు సిద్ధం చేస్తున్నాం నీటి సంఘాలకు సంబంధించి ఓటర్ల జాబితాను సిద్ధ చేయాలని ఉన్నతస్థాయి నుంచి ఆదేశాలందాయి. ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నాం. – రాంబాబు, ఇరిగేష¯ŒS సర్కిల్ ఎస్ఈ. -
‘జన్మభూమి’ పాపం.. కార్యదర్శులకు శాపం
దెందులూరు: తెలుగుదేశం పార్టీ పాలనలో మృతులకు పింఛన్లు ఇస్తున్నారు. దెందులూరు నియోజకవర్గంలోని కొందరు మృతులకు పింఛన్ మంజూరు చేయడంతో పాటు పంపిణీ చేసి ప్రభుత్వ నిధులను పక్కదారి పట్టించారు. రూ.1.79 లక్షలు అవకతవకలు జరిగినట్టు సోషల్ ఆడిట్లో అధికారులు గుర్తించారు. పెదవేగి మండలంలో రూ.1.15 లక్షలు, దెందులూరు మండలంలో రూ.39 వేలు, ఏలూరు మండలంలో రూ.22 వేలు, పెదపాడు మండలంలో రూ.3 వేలు దుర్వినియోగమైనట్టు నిర్దారించారు. గ్రామాల్లో ప్రభుత్వ పథకాలు, పింఛన్లు జన్మభూమి కమిటీలు సిఫార్సు చేసిన వారికే గుడ్డిగా అందిస్తుండటంతో ముగ్గురు కార్యదర్శులు బలయ్యారు. దెందులూరు మండలంలోని దోసపాడు, కేఎన్ పురం, గాలాయిగూడెం గ్రామ కార్యదర్శులు శరత్, ప్రసాద్, అవినాష్ను సస్పెండ్ చేస్తూ జిల్లా పంచాయతీ అధికారి సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. పల్లచింతలపూడి గ్రామ కార్యదర్శిపై చర్యలకు పంచాయతీరాజ్ కమిషనర్కు నివేదించారు. పై నాలుగు మండలాల్లో జన్మభూమి కమిటీ సభ్యుల సమక్షంలో నిధులు దుర్వి నియోగం జరిగినా దెందులూరు మండలంలో ముగ్గురిపై మాత్రమే వేటు వేసి ఉన్నతాధికారులు చేతులు దులుపుకున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. జన్మభూమి కమిటీల ఒత్తిడి మేరకే గ్రామ కార్యదర్శులు మృ తులకు పింఛన్లు మంజూరు చేశారనే విమర్శలూ ఉన్నా యి. ఏలూరు, పెదపాడు, పెదవేగి మండలాల్లో నిధులు దుర్వినియోగానికి కారకులైన గ్రామ కార్యదర్శులు, బిల్ కలెక్టర్లపై చర్యలకు అధికారులు ఆదేశించినట్టు తెలిసిం ది. దుర్వినియోగమైన మొత్తంలో 90 శాతం నగదును రాబట్టి ట్రెజరీకి జమచేశామని ఎంపీడీఓలు చెబుతున్నారు. ప్రతి పైసా రికవరీ చేస్తాం గ్రామ పంచాయతీల్లో మృతులకు పెన్షన్ సొమ్ము మంజూరు చేసి దుర్వినియోగం చేసిన వ్యవహారంలో ప్రతిపైసా ప్రభుత్వ ఖాతాకు జమయ్యేలా రికవరీ చేస్తాం. బాధ్యులైన ప్రతి ఒక్కరిపై ప్రభుత్వపరంగా త్వరలోనే చర్యలు తీసుకుంటాం. –శ్రీనివాసులు, డీఆర్డీఏ పీడీ, ఏలూరు చర్యలు ప్రారంభించాం దెందులూరు నియోజకవర్గంలో దెందులూరు, పెదపాడు, పెదవేగి, ఏలూరు రూరల్ మండలాల్లో మృతులకు పెన్షన్లు మంజూరు చేసి నిధులు దుర్వినియోగం చేశారని సోషల్ ఆడిట్ అధికారులు ధ్రువీకరించారు. దెందులూరు మండలంలో ఇప్పటికే ముగ్గురు గ్రామ కార్యదర్శులను సస్పెండ్ చేశాం. ఓ కార్యదర్శికి పెనాల్టీ విధించి చర్యల నిమిత్తం పంచాయతీరాజ్ కమిషనర్కు సమాచారం అందించాం. మిగతా మూడు మండలాల్లో నిధుల దుర్వినియోగానికి సంబంధించి బాధ్యులందరిపై చర్యలు తీసుకుంటాం. – సుధాకర్, జిల్లా పంచాయతీ అధికారి
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
విరాట్ కోహ్లి బుల్లెట్ త్రో.. గుజరాత్ బ్యాటర్ ఫ్యూజ్లు ఔట్! వీడియో
ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)
వారికి వాడుకుని వదిలేసే అలవాటు: కాంగ్రెస్పై మండిపడ్డ జ్యోతిరాదిత్య సింధియా
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
శుబ్మన్ గిల్కు ఏమైంది.. ఇలా అయితే కష్టమే! వీడియో వైరల్
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement