-
అభిమాని పెళ్లికి హాజరైన సూర్య..
-
నేనూ.. కాస్టింగ్ కౌచ్ బాధితురాలినే
చెన్నై : 'అవును నేనూ అలాంటి ఘటనలు ఎదుర్కొన్నాను' అని నటి వాణిబోజన్ పేర్కొన్నారు. తాను కాస్టింగ్ కౌచ్ బాధితురాలినేననంటూ బుల్లితెర నుంచి వెండి తెరకు ప్రమోట్ అయిన నటి వాణిబోజన్ తెలిపారు.'ఓ మై కడవులే' చిత్రంతో సినిమాల్లో ఎంటరయిన ఈ భామ తొలి చిత్రంతోనే సక్సెస్ను అందుకుంది. ప్రస్తుతం వైభవ్తో జతకట్టిన లాకప్ చిత్రం షూటింగ్ను పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఈ మధ్యన వాణిబోజన్ తరచూ వార్తల్లో ఉంటోంది. గ్లామర్ విషయంలోనూ కాస్త ఫాస్ట్గా ఉన్న ఈ బ్యూటీ తన గ్లామరస్ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేస్తూ ప్రచారం పొందే ప్రయత్నాలు చేస్తోంది. ఇటీవల ఒక భేటీలో తన అనుభవాలను పంచుకుంది. ఈ సందర్భంగా కాస్టింగ్ కౌచ్ గురించి అడిగిన ప్రశ్నకు తానూ అలాంటి సంఘటనలను ఎదుర్కొన్నానని, ఒక నిర్మాత అవకాశం కోసం పడక గదికి రమ్మన్నాడని చెప్పింది. అలాంటి అవకాశం తనకు వద్దని చెప్పినట్లు పేర్కొంది. ప్రసుత్తం వాణిబోజన్ చెప్పిన విషయం కోలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది. (దసరాకు రాకీ భాయ్ వస్తున్నాడు) మాయ అనే టీవీ సీరియల్ ద్వారా వాణిబోజన్ నటిగా పరిచయమయ్యారు.అయితే ఈ అమ్మడిని పాపులర్ చేసింది మాత్రం దైవమగళ్ అనే సీరియల్. ఈ సీరియల్తో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకున్న వాణిబోజన్ సాధారణంగా తన మేనేజర్తోనే నిర్మాతలు సంప్రదిస్తారని చెప్పింది. అలా పలువురు నిర్మాతలు అవకాశాల కోసం తనను పడక గదికి పిలిచినట్లు మేనేజర్ చెప్పారని అంది. కాస్టింగ్ కౌచ్ అన్నది ఇప్పుడు కొత్తగా వచ్చిన సమస్య కాదు. ఇంతకు ముందే పలువురు నటీమణులు మీటూ బాధలను వ్యక్తం చేశారు. పోలీసులకు ఫిర్యాదు వరకూ వెళ్లారు. ఈ వ్యవహారం రోజురోజుకూ అధికమవుతోంది. హీరోయిన్లు, కాస్త నాగరీకంగా దుస్తులు ధరించి, సంప్రదాయబద్ధంగా నడుచుకుంటే ఇలాంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉండదనే వాదన వినిపిస్తోంది. నటి వరలక్ష్మీ శరత్కుమార్ లాంటి వారు కాస్టింగ్ కౌచ్ వంటి సంఘటనలు ఎదురైనప్పుడు ధైర్యంగా ఎదుర్కొనాలని, జరిగిపోయిన తర్వాత చెబితే ప్రయోజనం ఉండదని అంటున్నారు. (అవి నా కుటుంబాన్ని బాధిస్తున్నాయి) -
సీనియర్ దర్శకుడు మహేంద్రన్కు అస్వస్థత
సాక్షి, చెన్నై: సీనియర్ దర్శకుడు మహేంద్రన్ అస్వస్థతకు గురయారు. ఆయన్ని వైద్య చికిత్స కోసం చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. ఉరుదిపూక్కల్, ముల్లుం మలరుం వంటి పలు విజయవంతమైన తమిళ చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు మహేంద్రన్. రజనీకాంత్, కమలహాసన్లతో పలు చిత్రాలను చేసిన మహేంద్రన్ ఈ మధ్య నటుడు విజయ్ నటించిన తెరి చిత్రం ద్వారా నటుడిగా పరిచయం అయిన విషయం తెలిసిందే. ఆ చిత్రంలో ప్రతినాయకుడిగా పాత్రను రక్తిగట్టించిన మహేంద్రన్కు వరుసగా అవకాశాలు రావడం మొదలెట్టాయి. తాజాగా ప్రియదర్శన్ దర్శకత్వంలో ఉదయనిధి స్టాలిన్ హీరోగా నటించిన నిమిర్ చిత్రంలో ప్రతి నాయకుడిగా నటించారు. ఈ నెల 26న మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఇలాంటి పరిస్థితిలో మహేంద్రన్ అకస్మాత్తు ఆనారోగ్యానికి గురికావడంతో ఆయనను హాస్పిటల్కు తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని కుటుంబ సభ్యులు వెల్లడించారు. -
రకుల్ ఛాన్స్.. నయనతార కొట్టేసిందా.?
సాక్షి చెన్నై: సినిమానే కాదు ఏ రంగంలోనైనా సక్సెసే కొలమానం అన్నది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అపజయాలతో నెట్టుకు రావడం కష్టమే. ఇకపోతే నటి రకుల్ప్రీత్సింగ్కు కోలీవుడ్ అచ్చిరానట్టుంది. ఎందుకంటే మొదట ఈ అమ్మడు ఇక్కడనే నటిగా కెరీర్ను ప్రారంభించింది. పుత్తకం, ఎన్నమో ఏదో, తడయారతాక్క లాంటి చిత్రాలు చేసినా కోలీవుడ్ వర్గాలు పట్టించుకోలేదు. కారణం ఆ చిత్రాలు ప్రేక్షకాదరణను నోచుకోకపోవడం బలమైన కారణం కావచ్చు. అయితే టాలీవుడ్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుని కాలం కలిసి రావడంతో అనూహ్యంగా విజయాలు తద్వారా అవకాశాలు రకుల్ప్రీత్సింగ్ను ఆనందంతో ఉక్కిరిబిక్కిరి చేశాయి. అదే ఊపుతో కోలీవుడ్లో పాగా వేయాలని ఆశిస్తున్న రకుల్కు రీఎంట్రీలోనే స్పైడర్ దెబ్బ కొట్టింది. స్పైడర్ చిత్రం దర్శకుడు ఏఆర్.మురుగదాస్నే కోలీవుడ్లో బంపర్ ఆఫర్ ఇచ్చారని, ఇళయదళపతితో డ్యూయెట్లు పాడే అవకాశాన్నిచ్చారనే ప్రచారం ఈ మధ్య వైరల్ అయ్యింది. తాజా పరిణామాలు ఆ దర్శకుడి నిర్ణయాన్ని మార్చుకునేలా చేశాయా? ఈ విషయం గురించి స్పష్టమైన సమాచారం లేదు గానీ, తాజాగా మెర్శల్తో కలకలాన్ని, అరమ్తో సంచలనాన్ని కలిగిస్తున్న స్టార్ నటుడు విజయ్, లేడీసూపర్స్టార్గా మంచి క్రేజ్లో ఉన్న నటి నయనతార జత కట్టనున్నారనే ప్రచారం హల్చల్ చేస్తోంది. విజయ్ 62వ చిత్ర ఫ్రీ ప్రొడక్షన్స్ కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి. ఏఆర్.మురుగదాస్ దర్శకత్వం వహించనున్న ఇందులోనే నయనతార నటించనున్నారనే ప్రచారం జోరందుకుంది. అయితే ఇందులో నిజం ఎంత?మరి రకుల్ప్రీత్సింగ్ ఈ చిత్రంలో ఉన్నట్టా? హ్యండ్ ఇచ్చినట్టా? లేక ఈ అమ్మడి అవకాశాన్ని నయనతార తన్నుకుపోయిందా? లేక ఇద్దరు ముద్దుగుమ్మలు చిత్రంలో ఉంటారా? అన్నది తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే. కాగా విజయ్తో ఆయన 62 చిత్రంలో నయనతార నటించడం నిజమే అయితే ఇది ఆయనతో నటిస్తున్న మూడో చిత్రం అవుతుంది. ఇంతకు ముందు శివకాశి చిత్రంలో విజయ్తో కలిసి గెస్ట్ అపిరెన్స్ ఇచ్చిన నయనతార 2009లో వచ్చిన విల్లు చిత్రంలో కథానాయకిగా నటించింది. మళ్లీ ఎనిమిదేళ్ల తరువాత విజయ్తో కలిసి నటించనుందన్న మాట. అదే విధంగా నటి రకుల్ ప్రీత్సింగ్ కోలీవుడ్ భవిష్యత్ శుక్రవారం విడుదల కానున్న కార్తీతో నటించిన ధీరన్ అధికారం ఒండ్రు చిత్రంతో ఆధారపడి ఉందని చెప్పవచ్చు. -
షూటింగ్లకు రండి.. రాయితీలు ఇస్తాం
చెన్నై: మారిషస్ వచ్చి మూవీ షూటింగ్స్ జరిపితే భారతీయ సినిమాలకు భారీ రాయితీలు కల్పిస్తామని మారిషస్ ఫిలిం డెవలప్ మెంట్ అధికారులు ఆహ్వానించారు. మారిషస్ దేశం ఫిలిం డెవలప్మెంట్ అధికారులు చెన్నైకి వచ్చి తమిళ నిర్మాతల మండలి నిర్వాహకులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో తమిళ నిర్మాతల మండలి కోశాధికారి ఎస్ఆర్ ప్రభు, ప్రధాన కార్యదర్శి జ్ఞానవేల్రాజా మారిషస్ దేశ ఫిలిం డెవలప్మెంట్ అధికారులతో పలు అంశాలపై చర్చించారు. తమ దేశంలో షూటింగ్లు చేసుకోవడానికి రావాలని, ఆ మూవీలకు 45 శాతం రాయితీ కల్పిస్తామని మారిషస్ దేశ ఫిలిం డెవలప్మెంట్ అధికారులు చెప్పారు. సానుకూలంగా స్పందించిన తమిళ నిర్మాతల మండలి నిర్వాహకులు తమ నిర్మాతల అందరితో సంప్రదించి సరైన నిర్ణయాన్ని తీసుకుంటామన్నారు. రాయితీల విషయాన్ని నిర్మాతలకు వివరిస్తామని పేర్కొన్నారు. మారిషస్ లోని గ్రాండ్ బే బీచ్ (ఫైల్)
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement