breaking news
class one student
-
గుండెపోటుతో ఒకటో తరగతి బాలుడు మృతి
బెంగళూరు: గుండెపోటుతో బాలుడు మృతిచెందిన సంఘటన చిత్రదుర్గ జిల్లా హిరియూరు పట్టణంలో బుధవారం జరిగింది. గుండె నొప్పి వచ్చిందని చెప్పి విలవిలలాడుతుండగా ఆస్పత్రికి తరలించేలోగానే చిన్నారి మరణించాడు. హిరియూరు బీజేపీ తాలూకా అధ్యక్షుడు అభినందన్ కుమారుడు వైష్ణవ్ (4), తనకు గుండెల్లో మంటగా ఉందని చెప్పడంతో తల్లిదండ్రులు సమీప ఆస్పత్రికి తీసికెళ్లారు. పిల్లాడు అల్లాడిపోవడం చూసి వారు భయపడిపోయారు. దారిలోనే బాలుడు తుదిశ్వాస విడిచాడు. ఒకటో తరగతి చిన్నారి ఇక శివమొగ్గ జిల్లాలో సాగర తాలూకా హలసి గ్రామంలో మరో ఘోరం జరిగింది. సాయంత్రం ప్రభుత్వ పాఠశాల వదిలిన తరువాత ఒకటో తరగతి బాలుడు త్రిలోక్ జైన్ (6) ఇంటికి వెళ్లాలని బయట నిలబడి ఉన్నాడు. అయితే కళ్లు తిరిగి కిందపడిపోయాడు. స్థానికులు, ఉపాధ్యాయులు అతని ముఖం మీద నీళ్లు చల్లగా స్పృహలోకి వచ్చాడు. తరువాత నీరు తాగించి కూర్చోబెట్టగా, టాయ్లెట్కు వెళ్తానని పాఠశాలలోని మరుగుదొడ్డికి వెళ్లాడు.ఎంత సేపటికీ బయటకు రాకపోవడంతో తలుపులు తీసి చూడగా బాలుడు చనిపోయి ఉన్నాడు. బాలునికి చిన్నప్పటి నుంచి గుండె సమస్య ఉన్నట్లు తల్లిదండ్రులు గౌతం జైన్, శిల్ప తెలిపారు. ఈ ఘటన గత శనివారం జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పసిపిల్లల గుండెపోటు మరణాలపై ఆందోళన నెలకొంది. -
ఒకటో తరగతి బాలిక పట్ల అసభ్య ప్రవర్తన
విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఓ ఉపాధ్యాయుడు ఏడేళ్ల విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఈ ఘటన హైదరాబాద్లోని మాదన్నపేట పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. సంతోష్నగర్ ప్రాంతానికి చెందిన ఒకటో తరగతి విద్యార్థిని స్థానిక మదర్సాలో రోజూ ఓ గంట అరబిక్ నేర్చుకుంటోంది. మదర్సాలో అరబిక్ బోధించే ఇమ్రాన్ అనే బోధకుడు మూడు రోజుల క్రితం బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. భయంతో వణికిపోయిన చిన్నారి విషయాన్ని ఇంట్లో చెప్పకుండా తనలో తానే కుమిలిపోయింది. అయితే, బాలిక దిగులుగా ఉండడాన్ని స్కూల్లో టీచర్లు గమనించారు. దీంతో శుక్రవారం ఆమె తల్లిదండ్రులను పిలిపించి మాట్లాడడంతో ఇమ్రాన్ చేసిన పనిని చిన్నారి వెల్లడించింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు ఇమ్రాన్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు.


