-
‘300 సార్లు చర్చలు; మాట తప్పిన ఈటల’
సాక్షి, హైదరాబాద్: పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్తో 300 సార్లు చర్చించినా తమ సమస్యల పరిష్కారం దిశగా ఒక్క అడుగు కూడా పడలేదని రేషన్ డీలర్ల సంఘం అధ్యక్షుడు నాయికోటి రాజు ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. నాలుగు సంవత్సరాలుగా రేషన్ డీలర్ల సమస్యలు సరిష్కారిస్తానని హామినిస్తూ వచ్చిన ఈటల రాజేందర్ తమను మోసం చేశాడని మండిపడ్డారు. జాతీయ ఆహార భద్రత హామీ చట్టం అమలుకు కృషి చేయాల్సిన మంత్రి వైఖరి సరిగా లేదని విమర్శించారు. 2017లో సమ్మె చేయగా.. 10 రోజుల్లో సీఎంతో మాట్లాడించి సమస్యలు పరిష్కారమయ్యేలా చూస్తానని ఇచ్చిన హామీ ఏమైందని ఈటలను ప్రశ్నించారు. రేషన్ డీలర్ల సంక్షేమానికి మంత్రి స్పష్టమైన హామినిచ్చినందునే ఈ-పాస్ మిషన్లను స్వాగతించామని అన్నారు. వాటి సాయంతో పౌర సరఫరాల వ్యవస్థలో అక్రమాలు తగ్గి ప్రభుత్వానికి కోట్ల రూపాయలు ఆదా అవుతున్నా తమ బతుకుల్లో మాత్రం ఏ వెలుగూ లేదని వాపోయారు. ఇప్పటికైనా డీలర్ల సమస్యల పరిష్కారం దిశగా మంత్రి చొరవ తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చేవరకు సమ్మె విరమించేది లేదనీ, డీడీలు కట్టే ప్రసక్తే లేదని వెల్లడించారు. -
హక్కుల వినియోగంతోనే మోసాలకు చెక్
- వినియోగదారుల సంఘాల పటిష్టతకు చర్యలు - పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత పిలుపు - కర్నూలులో జాతీయ వినియోగదారుల రాష్ట్రస్థాయి వేడుకలు కర్నూలు(అగ్రికల్చర్) : గ్రామస్థాయి నుంచి రాజధాని వరకు వినియోగదారుల సంఘాలను పటిష్టం చేసి వినియోగదారుల సంక్షేమానికి మరింతగా కృషి చేస్తామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత తెలిపారు. గురువారం కర్నూలులో జాతీయ వినియోగదారుల దినోత్సవం రాష్ట్రస్థాయి వేడుకలు కనులపండువగా జరిగాయి. జాయింట్ కలెక్టర్ హరికిరణ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. వినియోగదారులు ఎక్కడెక్కడ ఏ విధంగా మోసపోతున్నారు, కార్బైడ్తో మాగించిన, సహజసిద్ధంగా మాగిన పండ్ల తేడాలు, మందుల్లో నకిలీలను గుర్తించే విధానం, తూకాలు, కొలతల్లో అక్రమాలు, కల్తీ విత్తనాలు, ఎరువులను గుర్తించడం తదితర వాటికి సంబంధించి అవగాహన కోసం సంబంధిత శాఖల అధికారులు ఏర్పాటు చేసిన స్టాళ్లు ఆకట్టుకున్నాయి. వీటిని అన్ని వర్గాల ప్రజలు ప్రత్యేకంగా పరిశీలించారు. రాష్ట్ర మంత్రి పరిటాల సునీతతోపాటు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, అధికారులు, ఇతర ప్రముఖులు స్టాళ్లను పరిశీలించారు. అంతకుముందు కర్నూలులో జూట్ బ్యాగుల తయారీ కేంద్రాలను మంత్రి, అధికారులు పరిశీలించారు. కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి వేడుకల్లో సునీత మాట్లాడుతూ వినియోగదారులు ఏ రూపంలోనూ మోసపోకుండా ఉండాలంటే ముందుగా అందుకు సంబంధించి చట్టాలు, హక్కులపై అవగాహన పెంచుకోవాలన్నారు. ఎలాంటి వస్తువును కొనుగోలు చేసినా విధిగా బిల్లు తీసుకోవాలన్నారు. నాణ్యత లేకపోతే వినియోగదారుల ఫోరం ద్వారా నష్టపరిహారాన్ని పొందవచ్చని వివరించారు. గ్యాస్ పంపిణీలో మోసపోకుండా వినియోగదారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. హక్కుల పరిరక్షణకు కృషి .. రాష్ట్ర వినియోగదారుల ఫోరం జడ్జి జస్టిస్ నౌషద్ అలీ మాట్లాడుతూ వినియోగదారుల హక్కులను పరిరక్షించేందుకు ఫోరం ప్రత్యేక కృషి చేస్తున్నట్లు తెలిపారు. పెండింగ్లో ఉన్న వినియోగదారుల కేసుల సత్వర పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. పౌర సరఫరాల శాఖ డైరెక్టర్ రవిబాబు మాట్లాడుతూ జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని ఈ ఏడాది కర్నూలులో నిర్వహించడం సంతోషదాయకమన్నారు. రాష్ట్రంలో 1.34 కోట్ల మంది కార్డుదారులున్నారని, వీరందరూ ప్రభుత్వ వినియోగదారులని తెలిపారు. వీరికి ఇచ్చే సరుకుల్లో ఎక్కడా దగాకు తావు లేకుండా ఈ-పాస్ మిషన్లు ఏర్పాటు చేసి బయోమెట్రిక్ ద్వారా సరుకులు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. అమరావతిలో స్టేట్ ఇన్ఫర్మేషన్ సెల్ను ఏర్పాటు చేస్తామని వివరించారు. వినియోగదారుల్లో ప్రశ్నించేతత్వం రావాలని తెలిపారు. వినియోగదారుల హక్కుల పరిరక్షణ ప్రభుత్వ బాధ్యత సామాన్య కూలీ మొదలు రాష్ట్రపతి, ప్రధానమంత్రి వరకు ప్రతి ఒక్కరూ వినియోగదారులేనని, వీరి హక్కులను పరిరక్షించడం ప్రభుత్వ బాధ్యత అని రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ చైర్మన్ లింగారెడ్డి అన్నారు. వీరితో పాటు జంతువులు, పక్షులు కూడా వినియోగదారుల కిందికే వస్తాయని, గాలి, వాతావరణం కలుషితం అవుతుండటం వల్ల ఇవి కూడా దెబ్బతింట్నునాయని తెలిపారు. ఇందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. కల్తీపై చర్యలు తీసుకునేందుకు స్థానిక సంస్థలకు సర్వాధికారాలున్నాయని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. జెడ్పీ చైర్మన్ మల్లెల రాజశేఖర్, ఎమ్మెల్యే ఎస్వీ మోహన్రెడ్డి, ఎమ్మెల్సీ సుధాకర్ బాబు, రాష్ట్ర వినియోగదారుల సమాఖ్య అధ్యక్షుడు నాగేశ్వరరావు, జాయింట్ కలెక్టర్ హరికిరణ్ తదితరులు ప్రసంగించారు. కేవీఆర్ కళాశాల విద్యార్థులు ప్రదర్శించిన 'వినియోగదారుడా... మేలుకో' నాటకం ఆకట్టుకుంది. వివిధ పాఠశాలల విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో పౌరసరఫరాల శాఖ డైరెక్టర్ రవిబాబు, రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ ఎండీ రామ్మోహన్, డీఎస్ఓ శశిదేవి, జిల్లా పౌర సరఫరాల సంస్థ మేనేజర్ కృష్ణారెడ్డి, జిల్లా వినియోగదారుల సేవా కేంద్రం ఇన్చార్జి నదీం హుసేన్, జిల్లా వినియోగదారుల రక్షణమండలి అధ్యక్ష, కార్యదర్శులు మద్దిలేటి, శివమోహన్రెడ్డి, జేడీఏ ఉమామహేశ్వరమ్మ, డీటీసీ ప్రమీల తదితరులు పాల్గొన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వారి వల్లే మా ఎంగేజ్మెంట్ జరిగింది: అదితిరావు హైదరీ
పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ నటి (ఫోటోలు)
రాణించిన హెడ్, కమ్మిన్స్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'దీదీ గిరి' అంగీకరించను: పశ్చిమ బెంగాల్ గవర్నర్
బాబే కాదు ప్రధాని మోదీ కూడా యూటర్న్ తీసుకున్నారు: అమర్నాథ్
త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనున్న టాలీవుడ్ హీరోయిన్.. భర్తపై అలాంటి పోస్ట్!
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి నగదు
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
కాంగ్రెస్కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement