breaking news
chitra magimairajan
-
చిత్రకు కాంస్యం
డాగాపిల్స్ (లాత్వియా): ప్రపంచ స్నూకర్ చాంపియన్షిప్లో భారత క్రీడాకారిణి చిత్ర మగిమైరాజన్ కాంస్య పతకాన్ని సాధించింది. భారత కాలమానం ప్రకారం శనివారం అర్ధరాత్రి దాటాక ముగిసిన సెమీఫైనల్లో చిత్ర 1-4 (75-29, 60-66, 23-65, 0-74, 33-66) ఫ్రేమ్ల తేడాతో వెండీ జాన్స్ (బెల్జియం) చేతిలో ఓడిపోయింది. ఈ పోటీలో సెమీఫైనల్లో ఓడిపోయిన వారికి కాంస్య పతకాలు ఇస్తారు. వెండీ జాన్స్తో జరిగిన మ్యాచ్లో చిత్ర తొలి ఫ్రేమ్ను గెల్చుకున్నా ఆ తర్వాత అదేస్థాయి ఆటతీరును కనబర్చలేకపోయింది. వచ్చే ఏడాది ఈ మెగా ఈవెంట్కు బెంగళూరు ఆతిథ్యం ఇవ్వనుంది. -
సెమీస్లో చిత్ర
దౌగాపిల్స్ (లాట్వియా): ప్రపంచ స్నూకర్ చాంపియన్షిప్లో భారత్కు చెందిన చిత్ర మగిమైరాజన్ సత్తా చాటుకుంది. క్వార్టర్ ఫైనల్లో భారత్కే చెందిన వర్ష సంజీవ్తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో చిత్ర 4-0 (59-47, 71-42, 61-26, 61-27) తేడాతో విజయం సాధించింది. ఇప్పటికే రెండు బిలియర్డ్స్ టైటిళ్లు, ఆస్ట్రేలియా ఓపెన్ గెలుచుకున్న చిత్ర సెమీస్ బెర్తుతో కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకుంది. అంతకుముందు జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్స్లో చిత్ర 4-2 (79-40, 85-16, 33-59, 43-46, 74-56, 61-52)తో సహచరిణి విద్యా పిళ్లైపై... వర్ష 4-1 (68-26, 37-64, 54-19, 68-4, 59-33)తో అరంటా సాంచిస్పై విజయం సాధించారు. మరోవైపు పురుషుల విభాగంలో మనన్ చంద్ర, షాబాజ్ ఆదిల్ ఖాన్ తమ ప్రిక్వార్టర్స్ మ్యాచ్ల్లో ఓడారు. చంద్ర 0-5 (54-75, 0-120, 25-65, 49-74, 20-77)తో ఇంగ్లండ్ ఆటగాడు జెఫ్ కండీ చేతిలో ఘోరంగా ఓడిపోగా... షాబాజ్ 1-5 (46-83, 18-72, 40-67, 31-61, 85-0, 55-68)తో చైనాకు చెందిన జావో గ్జింటోంగ్ చేతిలో ఓడాడు.