breaking news
car raceing
-
ఫార్ములా ఈ-కార్ రేస్ కేసులో కేసీఆర్ కు నోటీసులు
-
నా రేస్ కోరిక.. నాన్న ఇచ్చిన సలహా : అజిత్
స్టార్ కథానాయకుడిగా రాణిస్తున్న నటుడు అజిత్ జీవన విధానమే ప్రత్యేకం. తనూ, తన కుటుంబం, నటన, తన కారు పందేలు ఇవే ఆయన లోకం. ఇతర విషయాల గురించి పట్టించుకోరు. ముఖ్యంగా చిత్ర పరిశ్రమలో జరిగే సంఘటనలపై అస్సలు జోక్యం చేసుకోరు. మొదట్లో తరచూ పత్రికల వారిని కలుసుకునే అజిత్ ఆ తర్వాత పూర్తిగా మీడియాకు దూరంగా ఉంటున్నారు. సినిమా రంగానికి ఇలా చేసిన సేవలుగాను ఇటీవల రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతుల మీదుగా పద్మభూషణ్ అవార్డు అందుకున్న విషయం తెలిసింది. అలాగే కార్ రేస్లో అంతర్జాతీయ స్థాయిలో పతకాలు గెలుచుకున్నారు. ఈ సందర్భంగా అజిత్ ఇటీవల ఎక్కువగా మీడియాతో ముచ్చటిస్తుండటం విశేషం. అలా ఒక భేటీలో తన కార్ రేస్ పై ఆసక్తి గురించి పేర్కొంటూ తనకు చిన్నతనం నుంచి కారు రేసులంటే చాలా ఆసక్తి అని చెప్పారు. తన తల్లిదండ్రులు కూడా చాలా ప్రోత్సహించారన్నారు. ఆ విధంగా తాను చాలా అదృష్టవంతుడిని పేర్కొన్నారు. అయితే అప్పట్లో ఆర్థిక పరిస్థితుల కారణంగా తన తండ్రి చాలా నిజాయితీగా ఒక సలహా ఇచ్చారన్నారు. కార్ రేస్ అనే క్రీడా చాలా ఖర్చుతో కూడిందని, అందువల్ల తాము నీకు తగిన సపోర్టును ఇవ్వలేకపోవచ్చని చెప్పారన్నారు. అయితే నువ్వు స్పాన్సర్స్ను కనుగొని నీ లక్ష్య సాధనలో ముందుకు సాగాలని చెప్పారన్నారు. అలాగే తాను పాఠశాల నుంచి బయటకు వచ్చిన తర్వాత తన తల్లిదండ్రులు ఒక విషయంలో మాత్రం చాలా స్పష్టమైన అభిప్రాయంతో ఉన్నారన్నారు. నువ్వు చదువు పూర్తి చేసి పట్టా అందుకోవాలన్నారు. లేదా ఏదైనా ఉద్యోగం చేయాలన్నారు. అంతేకానీ సమయాన్ని మాత్రం వృథా చేయకూడదని సలహా ఇచ్చారన్నారు. అప్పుడే తాను ఉద్యోగం చేయాలని నిర్ణయించుకున్నానని నటుడు అజిత్ చెప్పారు. -
సినిమాలు, రేసింగ్.. హీరో అజిత్ కీలక నిర్ణయం!
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్(Ajith)కి రేసింగ్ అంటే ఎంత ఇష్టం అందరికి తెలిసిందే. రేజింగ్లో పాల్గొని ఇప్పటికే పలుమార్లు ప్రమాదానికి గురైనా కూడా ఆయన దాన్ని వదలడం లేదు. సినిమాల కంటే రేసింగే ఎక్కువ ఇష్టమని గతంలో చాలా సార్లు చెప్పారు. అంతేకాదు తాను యాక్సిడెంటల్ హీరో అని కూడా చెప్పుకుంటారు. ఒకనొక దశలో సినిమాలకు గుడ్బై చెప్పి పూర్తిస్థాయిలో రేసింగ్పై ఫోకస్ పెట్టబోతున్నట్లు వార్తలు కూడా వినిపించాయి. తాజాగా దీనిపై అజిత్ క్లారిటీ ఇచ్చాడు. సినిమాలు చేస్తూనే రేసింగ్లో పాల్గొంటానని, ఒకటి చేసేటప్పుడు మరోకదానికి బ్రేక్ ఇస్తానని చెప్పుకొచ్చాడు.‘రేసింగ్ అంటే నాకు చాలా ఇష్టం. ఇందులో పాల్గొనాలంటే చాలా ఫిట్గా ఉండాలి. సినిమాలు చేస్తూ రేసింగ్లో పాల్గొనడం చాలా కష్టమైన పని. కార్ల రేస్పై దృష్టిపెట్టినప్పుడు ముందు శారీరకంగా మారాలి. అందుకే సైక్లింగ్, స్విమ్మింగ్తో పాటు డైట్ ఫాలో అవుతా. గత ఎనిమిది నెలల్లో దాదాపు 42 కిలోల బరువు తగ్గాను. ఇలాంటి సమయంలో మళ్లీ సినిమాలు చేస్తే దానికి పూర్తి న్యాయం చేయలేకపోతున్నాను. అందుకే ఓ నిర్ణయం తీసుకున్నాను. ఇకపై రేసింగ్ సీజన్ ఉన్నప్పుడు సినిమాలకు కాస్త దూరంగా ఉంటా’అని ఆయన అన్నారు. ఇక రేసింగ్ సమయంలో ఆయనకు జరిగిన ప్రమాదాల గురించి మాట్లాడుతూ.. ‘సినిమాల్లో స్టంట్స్ చేసేటప్పుడు నాకు చాలా దెబ్బలు తగిలాయి.ఎన్నో సర్జరీలు జరిగాయి. అలా అని యాక్షన్ సినిమాలు వదిలేయలేం కదా? అదే విధంగా ప్రమాదాలు జరిగాయని రేసింగ్కు దూరం కాలేను. నా దృష్టిలో రెండు ఒక్కటే’ అన్నారు.ఇక సినిమాల విషయాలకొస్తే.. ఇటీవల గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు అజిత్. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం రూ.200 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.త్వరలోనే తన 64వ సినిమా ప్రారంభం కాబోతుంది. దర్శకుడు ఎవరనేది ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించలేదు. కానీ ధనుష్ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది నవంబర్లో షూటింగ్ ప్రారంభం కానుంది. -
అజిత్కు తృటిలో తప్పిన ప్రమాదం.. వీడియో వైరల్
కోలీవుడ్ హీరో అజిత్ కారు రెండు పల్టీలు కొట్టింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. స్పెయిన్లో జరుగుతున్న కారు రేసింగ్లో అజిత్ పాల్గొన్నారు. రేసింగ్లో భాగంగా మరో కారును తప్పించే క్రమంలో అజిత్ కారు ప్రమాదానికి గురైంది. ఆ సమయంలో ఒక్కసారిగా ఆయన కారు ట్రాక్ తప్పింది. అయితే, సిబ్బంది వెంటనే అలర్ట్ కావడంతో ఆయన సురక్షితంగా బయటకొచ్చారు. ఇదే విషయాన్ని ఆయన యూనిట్ సభ్యులు ప్రకటించారు. ఈ ప్రమాదంలో అజిత్ తప్పులేదని వారు తెలిపారు. రేసులో ఉన్న ఇతర కార్ల వల్లే ఈ ఘటన జరిగిందన్నారు. అయితే, మళ్లీ అజిత్ రేసులో పాల్గొనడం విశేషం.అజిత్ కారు రేసింగ్లో భాగంగా ఇప్పటి వరకు మూడు సార్లు ప్రమాదానికి గురయ్యారు. అజిత్ ఇటీవల దుబాయ్లో జరిగిన అంతర్జాతీయ కారు రేస్ క్రీడా పోటీల్లో పాల్గొని తృతీయ పతకాన్ని గెలుచుకున్న విషయం తెలిసిందే. ఆప్పుడు కూడా ఆయన ప్రమాదానికి గురికావడం జరిగింది. స్పెయిన్ రేసులో పాల్గొనేందుకు ఆయన శిక్షణ తీసుకుంటున్న సమయంలో కూడా ప్రమాదం జరిగింది. అయితే, ఆయన అన్నిసార్లు కూడా ఎలాంటి గాయాలు లేకుండా సురక్షితంగా బయటపడ్డారు. దీంతో ఆయన అభిమానులు ఆందోళ చెందుతూ జాగ్రత్తగా ఉండాలని అజిత్ను సూచిస్తున్నారు.అజిత్ కుమార్ హీరోగా నటించిన స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ ఏప్రిల్ 10న విడుదల కానుంది. త్రిష హీరోయిన్ . ‘మార్క్ ఆంటోని’ ఫేమ్ అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో మైత్రీమూవీమేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవి శంకర్ నిర్మించారు. ఇండియన్ మూవీ చరిత్రలోనే ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ ఓ మైలురాయిగా నిలుస్తుందని చిత్ర యూనిట్ ఆశిస్తుంది. ఈ సినిమాకు జీవీ ప్రకాష్కుమార్ సంగీతం అందించారు. View this post on Instagram A post shared by Ajith Kumar Racing Team (@ajithkumarracing) -
ది డెటోనా 500 మోటార్ కార్ రేసులో ట్రంప్ బీస్ట్ (ఫొటోలు)
-
మరోసారి ప్రాణాపాయం నుంచి బయటపడ్డ అజిత్
అజిత్ కథానాయకుడిగానే కాకుండా , కారు రేస్, రైఫిల్ షూటింగ్ క్రీడా రంగాల్లోనూ తన ప్రతిభను నిరూపించుకుంటున్న విషయం తెలిసిందే. కాగా తాజాగా ఈయన కథానాయకుడిగా నటించిన విడాముయర్చి (పట్టుదల) చిత్రం ఇటీవల విడుదలై థియేటర్లలో సందడి చేస్తున్న విషయం తెలిసిందే. అదే విధంగా అజిత్ కథానాయకుడిగా నటించిన మరో చిత్రం గుడ్ బాడ్ అగ్లీ. ఈ చిత్ర షూటింగ్ డబ్బింగును పూర్తి చేసిన అజిత్ ఇటీవల దుబాయ్లో జరిగిన అంతర్జాతీయ కారు రేస్ క్రీడా పోటీల్లో పాల్గొని తృతీయ పతకాన్ని గెలుచుకున్న విషయం తెలిసిందే. అయితే అంతకుముందు దుబాయ్లో జరిగిన కారు రేస్ శిక్షణలో పాల్గొని ప్రమాదానికి గురై తృటిలో ప్రాణాప్రాయం నుంచి తప్పించుకున్నారు. అదేవిధంగా మరోసారి ఈయన కార్ రేస్ శిక్షణలో ఘోర ప్రమాదానికి గురై ఎలాంటి గాయాలు లేకుండా సురక్షితంగా బయటపడ్డారు. అజిత్ ప్రస్తుతం పోర్చుగల్లో జరగనున్న కారు రేస్ పోటీలకు సిద్ధమవుతున్నారు. అందులో భాగంగా అక్కడ శనివారం కారు రేస్ శిక్షణలో పాల్గొంటున్నారు. అయితే ఆయన నడుపుతున్న కారు అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. అదృష్టవశాత్తూ అజిత్కు ఎలాంటి ప్రాణాపాయం జరగలేదు. దీంతో ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. -
కేటీఆర్ కు మూడు ఆప్షన్స్!
-
Formula E Car Race: తెలంగాణ హైకోర్టులో కేటీఆర్కు ఊరట
-
సీఎం రేవంత్ రెడ్డి కావాలనే కేసు పెట్టించారు: KTR
-
ఈ స్టార్ హీరో ఓ సాహసి.. స్పెయిన్ బార్సిలోనా ఎఫ్ 1 రేసులో అజిత్ కుమార్ (ఫొటోస్)
-
హైదరాబాద్: ముగిసిన ఇండియన్ రేసింగ్ లీగ్ ( ఫొటోలు)
-
ఇన్ఫోసిస్ సాప్ట్వేర్ ఇంజినీర్ దుర్మరణం
*భర్త పరిస్థితి విషమం, కుమారుడికి గాయాలు *మూడు కార్లు ధ్వంసం *'మత్తు'లో కారు రేసింగ్తోనే ప్రమాదం హైదరాబాద్: తప్ప తాగి... స్నేహితులతో కలిసి కారు రేసింగ్ చేస్తూ ఓ వ్యక్తి సిగ్నల్ వద్ద నిలిపి ఉన్న బైక్ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో బైక్పై ప్రయాణిస్తున్న సాప్ట్వేర్ ఇంజినీర్ దుర్మరణం చెందగా... ఆమె భర్త, కుమారుడికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో మూడు కార్లు ధ్వంసమయ్యాయి. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. ఎస్ఐ చింతకాయల వెంకటేశ్ కథనం ప్రకారం... మధ్యప్రదేశ్ భోపాల్ పరిధిలోని సాగర్ గ్రామానికి చెందిన సోనీరాం చందానీ(36), హరీష్ ప్రసాద్(40) ప్రేమవివాహం చేసుకున్నారు. సోనీ ఇన్ఫోసిస్లో సాప్ట్వేర్ ఇంజినీర్ కాగా.. హరీష్ వ్యాపారం చేస్తున్నాడు. వీరు మాదాపూర్లోని విఠల్రావునగర్లో ఉంటున్నారు. గురువారం రాత్రి 8.50కి బైక్పై హరీష్ ప్రసాద్, సోనీ, కొడుకు మోక్ష్(4) నానక్రాంగూడ నుంచి ఔటర్పై గచ్చిబౌలి వైపు వస్తున్నారు. గచ్చిబౌలి జంక్షన్లో రెడ్ సిగ్నల్ పడటంతో బైక్ ఆపాడు. ఔటర్పై వెనుక నుంచి వచ్చిన స్కోడా కారు (టీఎస్09 ఈసీ9599) బైక్ను ఢీకొట్టింది. అంతటితో ఆగకుండా ముందున్న హోండా సిటీ, ఇన్నోవా కార్లను ఢీకొట్టింది. దీంతో బైక్పై ఉన్న ముగ్గురికి తీవ్రగాయాలు కావడంతో సమీపంలోని హిమగిరి ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ కొద్ది సేపటికే సోనీ మృతి చెందింది. పరిస్థితి విషమంగా ఉండటంతో హరీష్ ప్రసాద్ను కాంటినెంటల్ ఆస్పత్రికి తరలించారు. మోక్ష్కు తీవ్రగాయాలయ్యాయని పోలీసులు తెలిపారు. హోండా సిటీ కారులో ఉన్న ఓ మహిళ, వ్యక్తికి స్వల్పగాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో హోండా సిటీ, ఇన్నోవా కార్లు ధ్వంసమయ్యాయి. రేసింగ్ వల్లే ప్రమాదం... డెలాయిట్ కంపెనీలో హెచ్ఆర్ మేనేజర్గా పనిచేసే శ్వేతాబ్కుమార్ తోటి ఉద్యోగులు ఐదుగురిని తీసుకొని రేసింగ్కు బయలుదేరాడు. శంషాబాద్ నుంచి మితిమీరిన వేగంతో వస్తూ బైక్, కార్లను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. పోలీసులు కారులో ఉన్న బీరు సీసాలు, సిగరెట్లు స్వాధీనం చేసుకున్నారు. స్కోడా కారులో ఉన్న శ్వేతాబ్ కుమార్తో పాటు వినోద్, రిషాబ్, శ్రీవాత్సవలకు గాయాలయ్యాయని పోలీసులు చెప్పారు. శ్వేతాబ్ కుమార్ కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్సపొంది పారిపోయాడన్నారు. పరారైనట్లు ఎస్ఐ వెంకటేశ్ తెలిపారు.