breaking news
C-Voter survey
-
బిహార్ సీఎం అభ్యర్థిగా అతడే బెస్ట్!
బిహార్లో అసెంబ్లీ ఎన్నికలకు దాదాపు నెల రోజుల సమయం మాత్రమే ఉండడంతో ప్రధాన రాజకీయ పార్టీలు కసరత్తు ముమ్మరం చేశాయి. గెలుపే లక్ష్యంగా వ్యూహ ప్రతివ్యుహాల్లో మునిగి తేలుతున్నాయి. బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ, కాంగ్రెస్ నేతృత్వంలోని మహాఘఠ్బంధన్ మధ్య ప్రధాన పోరు ఉంటుందని సర్వేలు వెల్లడిస్తున్నాయి. ప్రశాంత్ కిశోర్ కొత్త పార్టీ జన సురాజ్ ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చని సర్వే ఫలితాలు చెబుతున్నాయి. ఇక సీఎం అభ్యర్థిగా ఆర్జేడీ యువనేత తేజస్వీ యాదవ్ అగ్రస్థానంలో ఉన్నట్టు సీ- ఓటర్ సర్వే (C-Voter survey) వెల్లడించింది. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఆశ్చర్యకరంగా మూడో స్థానానికి పరిమితం కాగా, ప్రశాంత్ కిశోర్ రెండో స్థానంలో నిలిచారు.ఫిబ్రవరి నుంచి సెప్టెంబర్ వరకు సేకరించిన డేటా ఆధారంగా సర్వే ఫలితాలను సీ- ఓటర్ ప్రకటించింది. సెప్టెంబర్ ఫలితాలను తీసుకుంటే.. 35.5 శాతం మంది తేజస్వి యాదవ్ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా కోరుకున్నారు. ప్రశాంత్ కిశోర్ కావాలని 23.1 శాతం మంది ఆకాంక్షించారు. నితీశ్ కుమార్ను కేవలం 16 శాతం మంది మాత్రమే కోరుకున్నారు. ఎల్జేపీ నేత చిరాగ్ పాశ్వాన్కు 9.5, బీజేపీ నాయకుడు సామ్రాట్ చౌదరి (samrat choudhary) 6.8 శాతం మంది మద్దతు ప్రకటించారు.అయితే ఫిబ్రవరి నుంచి చూసుకుంటే తేజస్వి, నితీశ్ కుమార్లకు మద్దతు తగ్గుతూ వస్తోంది. ఫిబ్రవరిలో తేజస్వికి 40.6 శాతం మంది, నితీశ్కు 18.4 శాతం మంది మద్దతు దక్కింది. మరోవైపు సీఎం అభ్యర్థిగా ప్రశాంత్ కిశోర్కు ఆదరణ పెరుగుతోంది. ఫిబ్రవరిలో ఆయనకు మద్దతు ఇచ్చిన వారు 14.9 శాతం మాత్రమే. 8 నెలల్లో ఆయనకు ఆదరణ 8.2 శాతం వరకు పెరిగినట్టు సీ ఓటర్ డేటా వెల్లడించింది. కాగా, మహాఘఠ్బంధన్ సీఎం అభ్యర్థి తానేనని తేజస్వీ యాదవ్ (Tejashwi Yadav) ఇప్పటికే ప్రకటించుకున్నారు. దీనిపై కాంగ్రెస్ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.ఎన్డీఏతో 'మహా' పోటీ బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ, మహాఘఠ్బంధన్ మధ్య హోరాహోరీ పోరు తప్పదని సర్వే ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. సెప్టెంబర్లో నిర్వహించిన స్టేట్ వైబ్ సర్వే ప్రకారం.. మహాఘఠ్బంధన్ కూటమికి 34.9 శాతం, ఎన్డీఏ 34.8 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉంది. నిరుద్యోగం, వలసలు గురించి బిహార్ ప్రజలు ఎక్కువగా ఆందోళన చెందుతున్నారని సర్వే వెల్లడించింది. ముస్లింలలో మూడింట ఒక వంతు (38.4%) ఓటు చోరీపై ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల జాబితాల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కు వ్యతిరేకంగా కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ చేసిన ప్రచారం ఓటర్లపై కొంతమేర ప్రభావం చూపించినట్టుగా కనబడుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) తల్లిపై ఏఐ- వీడియో వివాదాన్ని ఓటర్లు పెద్దగా పట్టించుకోలేదు. దాదాపు సగం మంది ఓటర్లు (49.8%) దీన్ని ఎన్నికల ప్రచారంలో భాగంగానే పరిగణించారు.తేజస్వీ యాత్రతో జోష్తేజస్వీ చేపట్టిన యాత్రతో ఆర్జేడీ కార్యకర్తలను ఉత్తేజపరిచిందని 43.8 శాతం మంది అభిప్రాయపడ్డారు. యాదవుల నుంచి మంచి స్పందన వస్తోందని 76.7 శాతం మంది సర్వేలో పేర్కొన్నారు. లాలూ ప్రసాద్ యాదవ్ (lalu prasad yadav) కుటుంబంలోని అంతర్గత వివాదాలు ఎన్నికల ఫలితాలపై ఎటువంటి ప్రభావం చూపబోవని 45.8 శాతం మంది అభిప్రాయపడ్డారు. లాలూ కుటుంబ కలహాలు పార్టీపై ఎటువంటి వ్యతిరేక ప్రభావాన్ని కలిగించబోవని యాదవుల్లో 70.6 శాతం మంది విశ్వాసం వ్యక్తం చేశారు. అగ్రవర్ణ హిందువులలో 46.6% మంది ప్రతికూల ప్రభావం ఉంటుందని పేర్కొన్నారు.చదవండి: మహాఘఠ్బంధన్లో లుకలుకలు..!ఎవరికి ఓటు వేయాలో ఇప్పటికే నిర్ణయించుకున్నామని 56.3 శాతం మంది సర్వేలో చెప్పారు. ఇంకా నిర్ణయం తీసుకోలేదని 43.7% మంది తెలిపారు. తమ ఓటు ఎవరికి వేయాలనే విషయంలో గ్రామీణ ఓటర్ల కంటే (51.8%) పట్టణ ఓటర్లు (66.9%) ఇప్పటికే నిర్ణయానికి వచ్చినట్టు సర్వే వెల్లడించింది.నవంబర్లో ఎన్నికలుఈ ఏడాది నవంబర్లో బిహార్ శాసనసభ ఎన్నికలు (Bihar Assembly Election) జరగనున్నాయి. ప్రస్తుత అసెంబ్లీ గడువు నవంబర్ 22తో ముగియనుంది. ఈ నేపథ్యంలో త్వరలోనే ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశముందని భావిస్తున్నారు. -
యూపీలో మళ్లీ యోగి.. పంజాబ్లో ‘ఆప్’
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది కీలకమైన ఐదు రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల ఫలితాల ఆధారంగా రాబోయే లోక్సభ సాధారణ ఎన్నికల ఫలితాలను అంచనా వేయవచ్చని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. వీటిలో ఢిల్లీకి దగ్గరి దారి అని భావించే ఉత్తరప్రదేశ్ కూడా ఉండడం విశేషం. 2022లో ఎన్నికలు జరుగనున్న ఉత్తరప్రదేశ్, పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్, మణిపూర్లో ఓటర్ల నాడిని తెలుసుకొనేందుకు ‘ఏబీపీ న్యూస్’ సంస్థ తాజాగా సి వోటర్తో కలిసి సర్వే నిర్వహించింది. తదుపరి సీఎంగా ఎవరైతే బాగుంటుందన్న దానిపై జనాభిప్రాయాన్ని సేకరించింది. ఫలితాలను రాష్ట్రాల వారీగా చూద్దాం.. ఉత్తరప్రదేశ్: హిందుత్వ రాజకీయాలకు కేంద్ర స్థానమైన ఉత్తరప్రదేశ్లో అధికార బీజేపీకే మళ్లీ విజయావకాశాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పట్ల 40 శాతం మంది సానుకూలంగా స్పందించారు. ఇక సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ) నేత, మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ పట్ల 27 శాతం మంది సానుకూలత వ్యక్తం చేశారు. అదృష్టం కలిసొస్తే ప్రధానమంత్రి పదవి దక్కించుకోవాలని ఆశ పడుతున్న బహుజన సమాజ్ పార్టీ(బీఎస్పీ) అధినేత, మాజీ సీఎం మాయావతికి ఆదరణ మరింత పడిపోయింది. ఆమె ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి కావాలని కేవలం 15 మంది కోరుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఆశాకిరణం అని భావిస్తున్న ప్రియాంకాగాంధీ వాద్రా తమ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని3 శాతం మందే ఆశించారు. రాష్ట్రీయ లోక్దళ్(ఆర్ఎల్డీ) నేత జయంత్ చౌదరి పట్ల 2 శాతం మంది మొగ్గు చూపడం విశేషం. 2017 నాటి ఎన్నికలతో పోలిస్తే బీజేపీ ఈసారి తన ఓట్లను 0.4 శాతం పెంచుకోనుంది. సమాజ్వాదీ పార్టీ ఓట్లు 6.6 శాతం పెరుగుతాయి. బీఎస్పీ 6.5 శాతం ఓట్లను, కాంగ్రెస్ 1.2 శాతం ఓట్లను కోల్పోతాయి. గత ఎన్నికల కంటే ఈదఫా బీజేపీ 62 సీట్లను కోల్పోనుంది. సమాజ్వాదీ పార్టీ సీట్లు మరో 65 పెరుగుతుండగా, బీఎïస్పీ 5, కాంగ్రెస్ 2 స్థానాలను కోల్పోనున్నట్లు తేలింది. యూపీ అసెంబ్లీలో మొత్తం 403 సీట్లున్నాయి. 2022 ఎన్నికల్లో బీజేపీ 259 నుంచి 276, సమాజ్వాదీ పార్టీ 109 నుంచి 117, బీఎస్పీ 12 నుంచి 16, కాంగ్రెస్ 3 నుంచి 7, ఇతరులు 6 నుంచి 10 సీట్లను దక్కించుకొనే అవకాశం ఉంది. పంజాబ్: పంజాబ్లో ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉంది. అమరీందర్ సింగ్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) గెలిచే సూచనలు కనిపిస్తున్నాయి. అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్ సీఎం అయితే బాగుంటుందని 22 శాతం మంది అభిప్రాయపడ్డారు. తదుపరి సీఎంగా శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్బీర్సింగ్ బాదల్ను 19 శాతం మంది కోరుకున్నారు. సీఎం అమరీందర్ పట్ల 18 శాతం మందే మొగ్గు చూపారు. ఆప్ ఎంపీ భగవంత్ మన్కు 16 శాతం, పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూకు 15 శాతం మంది మద్దతు లభించింది. గోవా: బీజేపీ నాయకుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ పట్ల జనం సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ ఆయనే ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నట్లు 33 శాతం మంది చెప్పారు. గోవాలో అధికారం కోసం అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ కూడా గట్టిగా పోరాడుతోంది. ఆ పార్టీ అభ్యర్థి తదుపరి సీఎం కావాలని 14 శాతం మంది ఆశించారు. ఉత్తరాఖండ్: ఉత్తరాఖండ్ తదుపరి ముఖ్యమంత్రిగా కాం్రగెస్ నేత హరీష్ రావత్ను 31 శాతం మంది ఓటర్లు కోరుకున్నారు. ఇటీవలే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన బీజేపీ నేత పుష్కర్సింగ్ దామీకి 23 శాతం మంది మద్దతు పలికారు. మణిపూర్: మణిపూర్లో ప్రస్తుతం బీజేపీ అధికారంలో కొనసాగుతోంది. బీజేపీకి 40.5 శాతం మంది, కాంగ్రెస్కు 34.5 శాతం మంది ఓటర్లు అండగా నిలిచారు. -
బెస్ట్ సీఎం వైఎస్ జగన్
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలోని అత్యుత్తమ ముఖ్య మంత్రుల్లో ఒకరుగా ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిలిచారు. ప్రముఖ జాతీయ వార్తా చానెల్ ‘ఏబీపీ న్యూస్’ చేసిన ‘దేశ్ కా మూడ్’ సర్వేలో బెస్ట్ సీఎంలలో మూడో స్థానాన్ని వైఎస్ జగన్ సాధించారు. తొలి రెండు స్థానాల్లో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఉన్నారు. అత్యుత్తమ పాలన సామర్థ్యంతో, అన్ని వర్గాల ప్రజలకు ఆసరాగా నిలిచే సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్న ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ఈ ఘనత సాధించారు. ఈ ఏబీపీ న్యూస్ సర్వేలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని ముఖ్యమంత్రుల్లో మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ 8వ స్థానంలో, గోవా సీఎం ప్రమోద్ సావంత్ 9వ స్థానంలో, గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ 10వ స్థానంలో నిలిచారు. ఏబీపీ–సీఓటర్ సంస్థ దేశ్ కా మూడ్ పేరుతో దేశవ్యాప్తంగా 543 లోక్సభ స్థానాల్లో గత 12 వారాల్లో 30 వేలకు పైగా ప్రజలను అడిగిన వివిధ ప్రశ్నల ఆధారంగా సర్వేను రూపొందించింది. ► కేంద్రం పనితీరుతో 66 శాతం మంది ప్రజలు సంతోషంగా ఉన్నారని, 30 శాతం మంది సంతోషంగా లేమని సమాధానం ఇచ్చారు. అయితే నాలుగు శాతం మంది సమాధానం ఇవ్వలేదు. ► ఈ రోజు లోక్సభ ఎన్నికలు జరిగితే 58 శాతం మంది ప్రజలు ఎన్డీఏకు మద్దతు ఇవ్వగా, 28 శాతం మంది మాత్రం యూపీఏ గెలుస్తుందని సమాధానం ఇచ్చారు. ► 55 శాతం మంది ప్రధాని పదవికి మోదీని ఎంచుకోగా, రాహుల్ను 11 శాతం మంది, మమతను 1శాతం, కేజ్రీవాల్ను 5, మాయావతి 1 శాతం, ప్రియాంకాను 1 శాతం మంది ఎంచుకున్నారు. వేరే నేతలను ఎంచుకుంటామని 12 శాతం మంది చెప్పారు. బెస్ట్ సీఎంలు వీరే 1) నవీన్ పట్నాయక్ – ఒడిశా 2) అరవింద్ కేజ్రీవాల్ – ఢిల్లీ 3) వైఎస్ జగన్మోహన్ రెడ్డి – ఆంధ్రప్రదేశ్ 4) పినరయి విజయన్ – కేరళ 5) ఉద్ధవ్ ఠాక్రే – మహారాష్ట్ర 6) భూపేశ్ బఘేల్ – ఛత్తీస్గఢ్ 7) మమతా బెనర్జీ – పశ్చిమబెంగాల్ 8) శివరాజ్ సింగ్ చౌహాన్ – మధ్య ప్రదేశ్ 9) ప్రమోద్ సావంత్ – గోవా 10) విజయ్ రూపానీ – గుజరాత్ -
ములాయం కన్నా అఖిలేశే మిన్న!
సీ-వోటర్ సర్వే లక్నో: సమాజ్వాదీ పార్టీలో, యాదవ్ కుటుంబంలో నెలకొన్న సంక్షోభం ద్వారా ఉత్తరప్రదేశ్ సీఎం అఖిలేశ్ కుమార్ యాదవ్కు మేలు జరుగుతోందని.. తాజా సీ-వోటర్ సర్వేలో వెల్లడైంది. అఖిలేశ్ సీఎం కావాలనుకునే వారి సంఖ్యనెలరోజుల్లోనే గణనీయంగా పెరిగిందని తెలిపింది. సర్వేలో తండ్రి ములాయం కన్నా అఖిలేశ్కే ఎక్కువమంది మద్దతు తెలిపారు. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో సీ-వోటర్ సంస్థ రెండు వేర్వేరు సర్వేలు నిర్వహించింది. పార్టీలో, కుటుంబంలో అఖిలేశ్ను ఒంటరి చేస్తున్నారనే అభిప్రాయం ప్రజల్లో నెలకొంది. 403 నియోజకవర్గాల్లో 12,211 మందితో ఈ సర్వే చేయగా.. 75.7 శాతం మంది ములాయం కంటే అఖిలేశే సరైన సీఎం అభ్యర్థని అభిప్రాయపడ్డారు. ఎస్పీలో ఉన్న గుండారాజ్ను పక్కనపెట్టేందుకు అఖిలేశ్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని 68 శాతం మంది అభిప్రాయపడ్డారు.