breaking news
burns home
-
ప్రియుడిపై అనుమానం.. ఫుల్గా తాగి ఇంటినే తగలెట్టేసింది
బ్యాంకాక్: ఓ బంధమైనా నమ్మకం, విధేయత ఉంటే కలకలం కొనసాగుతుంది. చిన్న అనుమానమనే నిప్పు రవ్వ పడితే క్షణాల్లో మాడిపోతుంది. ఓ మహిళ తన ప్రియుడు తనను మోసం చేస్తున్నాడనే అనుమానంతో క్షణికావేశంలో దారుణానికి ఒడిగట్టింది. మరో ఆలోచన లేకుండా బాయ్ఫ్రెండ్ గదినే తగలెట్టేసింది. ఈ సంఘటన థాయ్లాండ్లో వెలుగుచూసింది. పట్టాయా ప్రాంతానికి చెందిన డొన్లాయా నాలీ అనే మహిళ.. తన బాయ్ఫ్రెండ్ మోసం చేస్తున్నాడని అనుమానం పెంచుకుంది. అదే ఆలోచనతో రగిలిపోయింది. అది నిజమేనా, కాదా? అనే ఆలోచన కూడా చేయలేదు. ఫూటుగా మద్యం తాగి మత్తులో తన ప్రియుడి ఇంటికి వెళ్లి అతడు ఉండే గదికి నిప్పంటించింది. ఈ సంఘటన నవంబర్ 26న జరిగింది. అర్ధరాత్రి 1.30 గంటల ప్రాంతంలో పోలీసులకు సమాచారం అందింది. అగ్నిమాపక సిబ్బంది వచ్చే లోపే గది మొత్తం కాలిపోయింది. ఇతర రూముల్లోకి మంటలు వ్యాపించకుండా అదుపు చేశారు. ఈ క్రమంలో నిందితురాలిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయంపై మాట్లాడిన బాధితుడు ‘మరో మహిళతో సంబంధం ఉందనే కోపంతోనే ఇలా చేసింది. నిప్పంటించే ముందే నాపై దాడి చేసింది.’ అని తెలిపాడు. అయితే, తనపై వచ్చిన ఆరోపణలు నిజమా, కాదా? అనేది తెలపలేదు. ఇదీ చదవండి: శత్రు డ్రోన్లకు చెక్ పెట్టేలా గద్దలకు శిక్షణ.. కంటపడితే అంతే..! -
భర్త సెకండ్ హనీమూన్ కు వెళ్లాడని..
భర్త సెకండ్ హనీమూన్ కు వెళ్లాడన్న కోపంతో భార్య ఇల్లు తగులబెట్టిన ఘటన సౌదీ అరేబియాలో చోటు చేసుకుంది. రెండో భార్యతో కలిసి భర్త విదేశాలకు రెండో హనీమూన్ కు వెళ్లాడని తెలుసుకున్న మొదటి భార్య ఆగ్రహంతో ఇల్లు తగుల బెట్టిందని గల్ఫ్ న్యూస్ వెల్లడించింది. 10 ఏళ్ల క్రితం పెళ్లెన ఆమెకు సెల్ ఫోన్ లో వచ్చిన మెసేజ్ చూసి షాక్ తింది. రెండో భార్యతో కలిసి అతడు విదేశాలకు హనీమూన్ కు వెళ్లాడని ఆ మెసేజ్ లో ఉంది. దీంతో ఆమె ఆగ్రహంతో ఊగిపోయింది. విచక్షణ కోల్పోయి జాజన్ పోర్ట్ సిటీలోని తన ఇంటికి నిప్పు పెట్టింది. అయితే తగలబడి పోతున్న ఇంటిని చూసి మంటలు ఆర్పేందుకు సహాయం చేయాలని పొరుగింటి వారిని కోరడం గమనార్హం. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో ఐదేళ్ల బాలుడికి స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.