breaking news
Brydon Carse
-
భారత్తో వన్డేలు.. ఇంగ్లండ్ జట్టులో మరో ఫాస్ట్ బౌలర్
భారత్తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్లో మిగిలిన రెండు మ్యాచ్ల కోసం ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ECB) కీలక మార్పు చేసింది. ఫాస్ట్ బౌలర్ బ్రైడన్ కార్స్ను జట్టులోకి తీసుకున్నట్లు ప్రకటించింది.ఐపీఎల్ 2026 సందర్భంగా చేతికి గాయం కావడంతో కార్స్ కొంతకాలం క్రికెట్కు దూరమయ్యాడు. అనంతరం మోచేతి సమస్య నుంచి కోలుకుని డర్హమ్ తరఫున వైటాలిటీ బ్లాస్ట్లో మూడు మ్యాచ్లు ఆడాడు. ఆ తర్వాత మళ్లీ జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు.ఎడ్జ్బాస్టన్లో జరుగుతున్న తొలి వన్డేలో పేస్ బౌలర్లకు అనుకూల పరిస్థితులు కనిపించడంతో ఇంగ్లండ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తొలి 30 ఓవర్లలో భారత్ బౌలింగ్లో స్పిన్నర్లకు కేవలం మూడు ఓవర్లు మాత్రమే ఇవ్వగా, మిగిలిన 27 ఓవర్లు పేసర్లు వేశారు. ఇంగ్లండ్ కోల్పోయిన ఆరు వికెట్లు కూడా అన్నీ పేసర్ల ఖాతాలోకే వెళ్లాయి.ఈ నేపథ్యంలో జోఫ్రా ఆర్చర్ గాయాల చరిత్రను దృష్టిలో ఉంచుకుని, పేస్ దళాన్ని మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో కార్స్ను జట్టులో చేర్చినట్లు సమాచారం.భారత్తో వన్డే సిరీస్కు ఇంగ్లండ్ తాజా జట్టు: హ్యారీ బ్రూక్ (కెప్టెన్), జోస్ బట్లర్ (వికెట్ కీపర్), జో రూట్, టామ్ బాంటన్, బెన్ డకెట్, జేకబ్ బెథెల్, సామ్ కరన్, విల్ జాక్స్, జేమ్స్ కోల్స్, లియామ్ డాసన్, రెహాన్ అహ్మద్, జోఫ్రా ఆర్చర్, సాకిబ్ మహ్మూద్, జోష్ టంగ్, గస్ అట్కిన్సన్, ఆదిల్ రషీద్, బ్రైడన్ కార్స్.కార్స్ ఇప్పటివరకు ఇంగ్లండ్ తరఫున 30 వన్డేలు ఆడి 34 వికెట్లు పడగొట్టాడు. ఇంగ్లండ్ పరిస్థితుల్లో అతని ప్రదర్శన మెరుగ్గా ఉండటంతో, భారత్తో మిగిలిన రెండు మ్యాచ్ల్లో అతను కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. రెండు, మూడు వన్డేలు జులై 16, 19 తేదీల్లో కార్డిఫ్, లార్డ్స్ వేదికలుగా జరుగనున్నాయి.ఇవాళ జరుగుతున్న తొలి వన్డే విషయానికొస్తే.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్, భారత పేసర్ల ధాటికి 107 పరుగులకే 6 వికెట్లు కోల్పోగా.. రూట్ (56), డాసన్ (65) ఆదుకున్నారు. వీరిద్దరూ ఏడో వికెట్కు అజేయమైన 115 పరుగులు జోడించి ఇన్నింగ్స్లు కొనసాగిస్తున్నారు. 42.5 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్ స్కోర్ 222-6గా ఉంది. భారత బౌలర్లలో ప్రసిద్ద్ కృష్ణ, గుర్నూర్ బ్రార్ తలో 2 వికెట్లు తీయగా.. బుమ్రా, శివమ్ దూబే తలో వికెట్ దక్కించుకున్నారు. -
ఊహించని దెబ్బ.. ఎస్ఆర్హెచ్ కీలక నిర్ణయం
ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్తాన్ రాయల్స్పై గెలిచి రెండో విజయాన్ని నమోదు చేసుకుంది. తాజాగా ఎస్ఆర్హెచ్ బౌలర్ బైడన్ కార్స్ గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. దీంతో ఎస్ఆర్హెచ్ ఫ్రాంచైజీ కీలక నిర్ణయం తీసుకుంది. గాయంతో సీజన్ మొత్తానికి దూరమైన బ్రైడన్ కార్స్ స్థానాన్ని శ్రీలంక పేసర్ దిల్షాన్ మధుషంకతో భర్తీ చేస్తున్నట్లు తెలిపింది. పేస్ అటాక్లో కార్స్ కీలకం అవుతాడని భావించిన మేనేజ్మెంట్కు ఇది ఊహించని దెబ్బ. కానీ ఏమాత్రం ఆలస్యం చేయని ఎస్ఆర్హెచ్ యాజమాన్యం మదుషంక రూపంలో బ్రైడన్ కార్స్కు సరైన ప్రత్యామ్నాయంగా ఎంచుకొంది. కాగా మధుషంకను ఎస్ఆర్హెచ్ రూ. 75 లక్షల బేస్ ప్రైస్కే జాయిన్ అవ్వనున్నాడు. ఈ నేపథ్యంలో దిల్షాన్ మధుషంకను ఎస్ఆర్హెచ్ క్యాంప్లోకి ఆహ్వానిస్తున్నట్లు తమ ఎక్స్లో పేర్కొంది. మధుషంక చేరికతో హైదరాబాద్ బౌలింగ్ దళం మరింత పటిష్టంగా మారిందనే చెప్పాలి. ఒక లెఫ్టార్మ్ పేసర్గా పవర్ప్లేలో బంతిని స్వింగ్ చేస్తూ వికెట్లు తీయగల నైపుణ్యం అతనికి ఉంది.గతంలో అంతర్జాతీయ క్రికెట్తో పాటు పలు లీగ్లలో కూడా తన మార్క్ చూపించిన ఈ లంక బౌలర్ రాకను అభిమానులు స్వాగతిస్తున్నారు. మధుషంక లంక తరఫున 28 వన్డేలు, 19 టీ20, ఒక టెస్టు మ్యాచ్ ఆడాడు. ప్రఫుల్ హింగే, సాకిబ్హుస్సేన్ వంటి యంగ్ బౌలర్లకు తోడుగా మధుషంక జతవ్వడం జట్టుకు అదనపు బలం. మరి మధుషంక చేరికతో ఆరెంజ్ ఆర్మీ బౌలింగ్ బలపడినట్లే.Dilshan Madushanka joins the squad as a replacement for Brydon Carse, who is ruled out due to injury.Welcome, Dilshan 🧡 pic.twitter.com/zJQWtbXVZt— SunRisers Hyderabad (@SunRisers) April 14, 2026 -
ఇంగ్లండ్ జట్టుకు భారీ షాక్..
ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ బ్రైడాన్ కార్స్ ది హాండ్రెడ్ లీగ్-2025 నుంచి గాయం కారణంగా వైదొలిగాడు. ఈ ఏడాది సీజన్లో కార్స్ నార్తర్న్ సూపర్చార్జర్స్ ప్రాతినిథ్యం వహించాల్సి ఉండేది. కానీ అతడు ప్రస్తుతం పాదం, బొటనవేలు గాయంతో బాధపడుతున్నాడు.కార్స్ ఇటీవల భారత్తో జరిగిన టెస్టు సిరీస్లో భాగమయ్యాడు. బంతితో పాటు బ్యాట్తో కూడా ఈ స్పీడ్ స్టార్ రాణించాడు. అయితే గాయం కారణంగా కీలకమైన ఆఖరి టెస్టుకు అతడు దూరమయ్యాడు. ఇప్పుడు వైద్యల సలహా మెరకు హాండ్రెడ్ లీగ్ నుంచి కూడా తప్పుకొన్నాడు. ఈ విషయాన్ని కార్స్ ధ్రువీకరించాడు."భారత్తో జరిగిన సుదీర్ఘ టెస్టు సిరీస్ అనంతరం వైద్య సిబ్బందితో నా గాయం గురించి సంప్రదింపులు జరిపాను. వైద్యుల సూచన మేరకు ఈ ఏడాది ది హండ్రెడ్కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. ఈ టోర్నీకి నేను దూరంగా ఉన్నప్పటికి నార్తర్న్ సూపర్చార్జర్స్ మెరుగైన ప్రదర్శన చేయాలని కోరుకుంటున్నాను.భవిష్యత్తులో ఈ జట్టుకు మళ్లీ ప్రాతినిధ్యం వహించడానికి ఎదురు చూస్తున్నాను" అని ఓ ప్రకటనలో కార్స్ పేర్కొన్నాడు. కాగా ఇంగ్లండ్ జట్టు స్వదేశంలో సెప్టెంబర్లో దక్షిణాఫ్రికాతో వైట్బాల్ సిరీస్లు ఆడనుంది. ఈ సిరీస్లకు కూడా కార్స్ దూరమయ్యే అవకాశముంది. అతడు తిరిగి మళ్లీ యాషెస్ సిరీస్లో ఆడే సూచనలు కన్పిస్తున్నాయి. చదవండి: కరుణ్ నాయర్ కంటే సుదర్శన్ బెటరా? ఇద్దరికి ఎన్ని మార్కులంటే? -
ఇంగ్లండ్ బౌలర్ ఓవరాక్షన్!.. ఇచ్చిపడేసిన జడ్డూ.. మధ్యలోకి స్టోక్స్
లార్డ్స్ టెస్టు సందర్భంగా ఇంగ్లండ్ పేసర్ బ్రైడన్ కార్స్ (Brydon Carse)- టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా (Ravidndra Jadeja) మధ్య గొడవ జరిగింది. కార్స్ చేసిన పనికి జడ్డూ గట్టిగానే ఇచ్చిపడేశాడు. ఈ క్రమంలో ఇరువురి మధ్య వాగ్వాదం తారస్థాయికి చేరగా ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ (Ben Stokes) అడ్డుగోడలా నిలబడి వారిని విడదీయడంతో పరిస్థితి సద్దుమణిగింది.అసలేం జరిగిందంటే.. భారత్- ఇంగ్లండ్ మధ్య లార్డ్స్ మైదానంలో గురువారం మొదలైన మూడో టెస్టు తుది అంకానికి చేరింది. ఆఖరిదైన సోమవారం నాటి ఐదో రోజు ఆటలో విజేత ఎవరన్నది తేలనుంది. ఇంగ్లండ్ విధించిన 193 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 58/4 ఓవర్నైట్ స్కోరుతో ఆట మొదలుపెట్టిన భారత్.. ఆరంభం నుంచే తడబడింది.రిషభ్ పంత్ (9)ను జోఫ్రా ఆర్చర్ అద్భుత డెలివరీతో బౌల్డ్ చేయగా.. కేఎల్ రాహుల్ (39)ను స్టోక్స్ లెగ్ బిఫోర్ వికెట్గా వెనక్కి పంపాడు. ఆ తర్వాత వాషింగ్టన్ సుందర్ (0) ఇలా వచ్చి అలా వెళ్లగా.. నితీశ్ కుమార్రెడ్డి 53 బంతులు ఎదుర్కొని 13 పరుగులు చేసి నిష్క్రమించాడు. ఫలితంగా భోజన విరామ సమయానికి భారత్ 39.3 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 112 పరుగులు చేసింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో జడేజా నిలకడగా ఆడుతూ ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నంలో.. కార్స్ అతడికి అడ్డు తగిలాడు.జడ్డూ మెడ చుట్టూ చేయి వేసిటీమిండియా ఇన్నింగ్స్లో 35వ ఓవర్లో రంగంలోకి దిగిన కార్స్ బౌలింగ్లో.. ఆఖరి బంతికి జడ్డూ నితీశ్ రెడ్డితో కలిసి రెండు పరుగులు పూర్తి చేశాడు. అయితే, సింగిల్కు వెళ్లే క్రమంలో జడ్డూకు కార్స్ అడ్డుగా నిలవగా.. బంతిని చూస్తూ పరుగుకు వెళ్లిన జడ్డూ అతడిని ఢీకొట్టాడు. దీంతో తాను పడిపోకుండా ఉండేందుకు అన్నట్లుగా... జడ్డూ మెడ చుట్టూ చేయి వేసి అతడిని బంధించేందుకు కార్స్ ప్రయత్నం చేయగా.. జడ్డూ విడిపించుకుని పరుగులు పూర్తి చేశాడు.ఇచ్చి పడేసిన జడేజాఅనంతరం కార్స్ దగ్గరికి వచ్చి ఏంటి సంగతి అంటూ అడుగగా.. కార్స్ దురుసుగా ఎదురు సమాధానం ఇచ్చాడు. దీంతో మాటామాటా పెరగగా.. స్టోక్స్ వచ్చి ఇద్దరినీ విడదీశాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.కాగా లార్డ్స్' టెస్టులో ఇలాంటి జగడాలు ఎక్కువయ్యాయి. మూడో రోజు ముగింపు సమయంలో టీమిండియా కెప్టెన్ శుబ్మన్ గిల్.. ఇంగ్లండ్ ఆటగాడు జాక్ క్రాలీ మధ్య కూడా వాగ్వాదం జరిగింది. ఇక ఐదోరోజు రిషభ్ పంత్ను అవుట్ చేసిన తర్వాత జోఫ్రా ఆర్చర్ కూడా అతడిని స్లెడ్జ్ చేశాడు.చదవండి: ఇదేం పద్ధతి?.. ఎవరి కోసం ఇదంతా?!: సునిల్ గావస్కర్ ఫైర్Drama, more drama! 👀#ENGvIND 👉 3rd TEST, DAY 5 | LIVE NOW on JioHotstar 👉 https://t.co/DTsJzJLwUc pic.twitter.com/eiakcyShHV— Star Sports (@StarSportsIndia) July 14, 2025


