breaking news
Brydon Carse
-
ఐదేళ్ల తర్వాత 'స్పెషల్ ఫీట్' సాధించిన వివాదాస్పద బౌలర్
ఇంగ్లండ్ వివాదాస్పద బౌలర్ బ్రైడన్ కార్స్ ఐదేళ్ల తర్వాత ఓ స్పెషల్ ఫీట్ సాధించాడు. తన కౌంటీ జట్టు డర్హమ్ తరఫున ఐదు వికెట్ల ప్రదర్శనతో సత్తా చాటాడు. కార్స్ 2021లో చివరిగా డర్హమ్ తరఫున రెడ్బాల్ క్రికెట్లో ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు.తాజా మ్యాచ్లో కార్స్ 72 పరుగులిచ్చి ఐదు వికెట్లు పడగొట్టాడు. కార్స్ ధాటికి మిడిల్సెక్స్ తొలి ఇన్నింగ్స్లో 203 పరుగులకే ఆలౌటైంది. ఫస్ట్క్లాస్ క్రికెట్లో ఇప్పటివరకు 65 మ్యాచ్లు ఆడిన కార్స్.. మొత్తం ఆరు ఐదు వికెట్ల హాల్స్ సహా 196 వికెట్లు పడగొట్టాడు.నైట్క్లబ్ వివాదంతో ఇంగ్లండ్ జట్టుకు దూరంఇటీవల ఓ నైట్క్లబ్లో జరిగిన ఘటనతో కార్స్ వార్తల్లో నిలిచాడు. సోషల్ మీడియాలో వైరల్ అయిన కొన్ని వీడియోల్లో కార్స్ చేతులకు బేడీలు ఉన్న దృశ్యాలు కనిపించాయి. అతడి వెంట డర్హమ్ సహచరులు మాథ్యూ పాట్స్, బెన్ స్టోక్స్ కూడా ఉన్నట్లు వీడియోల్లో కనిపించింది.ఈ ఘటనపై ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) దర్యాప్తు చేస్తుంది. అనంతరం పాకిస్తాన్తో జరిగే టెస్టు సిరీస్కు ఎంపికైన కార్స్పై చర్యలు తీసుకుని, జట్టు నుంచి తప్పించింది.కార్స్ను తప్పించినప్పటికీ.. స్వదేశంలో పాక్తో జరుగుతున్న టెస్ట్ సిరీస్లో ఇంగ్లండ్ జట్టు అద్భుత ప్రదర్శనలు చేస్తుంది. మూడు మ్యాచ్ల ఈ సిరీస్లోని తొలి రెండు టెస్ట్లను గెలిచి, ఇదివరకే సిరీస్ను కైవసం చేసుకుంది. ప్రస్తుతం ఎడ్జ్బాస్టన్ వేదికగా మూడో టెస్ట్ జరుగుతుంది. ఈ మ్యాచ్లోనూ పాక్ పేలవ ప్రదర్శన చేస్తూ, క్లీన్ స్వీప్ పరాభవం అంచున ఉంది. చదవండి: దుమ్ములేపిన ఇషాన్ కిషన్.. 13 ఏళ్ల తర్వాత మరో టైటిల్ -
పాక్తో చివరి టెస్ట్కు ఇంగ్లండ్ జట్టు ప్రకటన.. యువ ఫాస్ట్ బౌలర్ కొనసాగింపు
సెప్టెంబర్ 9 నుంచి ఎడ్జ్బాస్టన్ వేదికగా పాకిస్తాన్తో జరుగబోయే చివరిదైన, నామమాత్రపు మూడో టెస్ట్ కోసం ఇంగ్లండ్ జట్టును ప్రకటించారు. ఈ జట్టులో యువ పేసర్ సోనీ బేకర్ తన స్థానాన్ని నిలుపుకోగా.. బ్రైడన్ కార్స్ మరోసారి జట్టుకు దూరమయ్యాడు.కార్స్పై గత నెలలో జరిగిన ఘటనపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో వేటు కొనసాగింది. ఆగస్టు 22న డెర్బీలోని ఓ నైట్క్లబ్ వెలుపల జరిగిన ఘటనలో పోలీసులు కార్స్ను కొద్దిసేపు చేతులకు సంకెళ్లు వేసి అదుపులోకి తీసుకున్నారు. 31 ఏళ్ల కార్స్ ప్రస్తుతం ఈ వ్యవహారంపై విచారణను ఎదుర్కొంటున్నాడు.ఈ నేపథ్యంలో లార్డ్స్లో జరిగిన రెండో టెస్టుకు అతడి స్థానంలో సోనీ బేకర్ను జట్టులోకి తీసుకున్నారు. తాజాగా మూడో టెస్టుకు కూడా బేకర్ను కొనసాగిస్తూ ఇంగ్లండ్ తమ నిర్ణయాన్ని స్పష్టం చేసింది. స్క్వాడ్లో మరో మార్పు కూడా జరిగింది. పేసర్ మాథ్యూ ఫిషర్ను జట్టు నుంచి తప్పించారు. ఈ రెండు మార్పులు మినహా ఇంగ్లండ్ జట్టు యధాతథంగా కొనసాగింది.కాగా, పాకిస్తాన్తో స్వదేశంలో జరుగుతున్న మూడు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ను ఇంగ్లండ్ ఇదివరకే 2-0 తేడాతో కైవసం చేసుకుంది. త్వరలో జరుగబోయే మూడో టెస్ట్లోనూ గెలిచి పాక్ను క్లీన్ స్వీప్ చేయాలని ఇంగ్లండ్ పట్టుదలగా ఉంది.పాక్తో మూడో టెస్ట్కు ఇంగ్లండ్ జట్టుజో రూట్ (కెప్టెన్), జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, సోనీ బేకర్, షోయబ్ బషీర్, హ్యారీ బ్రూక్, సామ్ కుక్, జోర్డాన్ కాక్స్, బెన్ డకెట్, ఎమిలియో గే, డాన్ లారెన్స్, ఒల్లీ పోప్, ఒల్లీ రాబిన్సన్, జామీ స్మిత్, జోష్ టంగ్చదవండి: హ్యాట్రిక్ సహా 7 వికెట్లు.. చరిత్ర సృష్టించిన శ్రీలంక కెప్టెన్ -
నైట్క్లబ్ ఘటన ఎఫెక్ట్.. ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్పై వేటు
ఇంగ్లండ్ పేసర్ బ్రైడన్ కార్స్పై ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) వేటు వేసింది. పాకిస్తాన్తో జరగనున్న రెండో టెస్టుకు అతడిని జట్టు నుంచి తప్పించింది. డెర్బీలోని ఓ నైట్క్లబ్ వెలుపల కార్స్ చేతులకు బేడీలు వేసిన దృశ్యాలు కనిపించడంతో ఈ నిర్ణయం తీసుకుంది.ఈ ఘటనపై ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చే వరకు కార్స్ రెండో టెస్టుకు అందుబాటులో ఉండడని ECB ప్రకటించింది. ఈ వ్యవహారంపై క్రికెట్ రెగ్యులేటర్ కూడా దర్యాప్తు చేయనుంది.కార్స్ స్థానంలో పేసర్ సోనీ బేకర్ను జట్టులోకి తీసుకుంది. న్యూజిలాండ్తో జూన్లో జరిగిన సిరీస్లో బేకర్ టెస్టు అరంగేట్రం చేశాడు.ఇటీవల ఇంగ్లండ్ జట్టులో నైట్క్లబ్ ఘటనలు కలకలం రేపుతున్నాయి. ఇలాంటి ఓ ఘటనపై విచారణ జరుగుతున్న సమయంలోనే అప్పటి కెప్టెన్ బెన్ స్టోక్స్, పేసర్ గస్ అట్కిన్సన్ను కూడా జట్టు నుంచి తప్పించారు.కాగా, పాకిస్తాన్తో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 103 పరుగుల తేడాతో విజయం సాధించింది. రెండో టెస్టు ఆగస్టు 27న లార్డ్స్లో ప్రారంభం కానుంది. మూడు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ కోసం పాక్ ఇంగ్లండ్లో పర్యటిస్తుంది. మూడో టెస్ట్ బర్మింగ్హమ్ వేదికగా సెప్టెంబర్ 9న మొదలవుతుంది. చదవండి: పోలీసుల అదుపులో ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్ -
పోలీసుల అదుపులో ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్
ఇంగ్లండ్ క్రికెట్ జట్టును మరోసారి ఆఫ్ఫీల్డ్ వివాదం వెంటాడుతోంది. ఇంగ్లండ్ స్టార్ ఫాస్ట్ బౌలర్ బ్రైడన్ కార్స్ డెర్బీలోని ఓ నైట్క్లబ్ వెలుపల పోలీసుల చేతికి చిక్కిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కార్స్ చేతులకు బేడీలు వేసి పోలీసులు అదుపులోకి తీసుకుంటున్న దృశ్యాలు అందులో కనిపించాయి. అయితే కార్స్ను అరెస్టు చేయలేదని, ఎలాంటి అభియోగాలు నమోదు చేయకుండానే విడుదల చేసినట్లు సమాచారం. ఈ ఘటనపై ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) దర్యాప్తు ప్రారంభించింది.Durham bowler Brydon Carse, who is in England squad for second Test, was released without charge after a nightclub incident while celebrating victory over Derbyshire@willis_macp has the details ⤵️https://t.co/4YXyQWChe5 pic.twitter.com/zFKA3lgPVi— Telegraph Cricket (@TeleCricket) August 23, 2026డర్హామ్ తరఫున కౌంటీ ఛాంపియన్షిప్ మ్యాచ్ ఆడిన అనంతరం జట్టు సభ్యులు విజయాన్ని సెలబ్రేట్ చేసుకునేందుకు డెర్బీలోని నైట్క్లబ్కు వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అయిన స్వల్ప నిడివి వీడియోలో కార్స్ను పలువురు పోలీసులు చుట్టుముట్టి ఉండగా, అతడి చేతులు వెనుకకు ఉంచి బేడీలు వేసినట్లు కనిపించింది. డర్హామ్ సహచరుడు మాథ్యూ పాట్స్ కూడా కార్స్తో మాట్లాడుతున్నట్లు వీడియోలో ఉంది.ఘటనాస్థలంలో బెన్ స్టోక్స్ఈ ఘటన సమయంలో ఇంగ్లండ్ స్టార్ ఆల్రౌండర్ బెన్ స్టోక్స్ కూడా అక్కడే కనిపించడం మరింత చర్చకు దారితీసింది. డర్హామ్ తరఫున అదే మ్యాచ్లో ఆడిన స్టోక్స్.. డెర్బీషైర్పై జట్టు ఘన విజయంలో కీలక పాత్ర పోషించాడు. రెండో ఇన్నింగ్స్లో 17 పరుగులకు ఐదు వికెట్లు తీసి డెర్బీషైర్ను 84 పరుగులకే కుప్పకూల్చడంలో అతడు ప్రధాన పాత్ర పోషించాడు.అయితే నైట్క్లబ్లో జరిగిన ఘటన ఇంగ్లండ్ జట్టు అధికారిక కార్యక్రమంలో భాగం కాదని తెలుస్తోంది. కార్స్ కూడా ఆ సమయంలో ఇంగ్లండ్ జాతీయ జట్టు విధుల్లో లేడు. పాకిస్తాన్తో తొలి టెస్టులో తుది జట్టులో చోటు దక్కకపోవడంతో అతడిని డర్హామ్ తరఫున కౌంటీ మ్యాచ్ ఆడేందుకు విడుదల చేశారు.ఈసీబీ దర్యాప్తుఘటనపై ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు స్పందిస్తూ.. డెర్బీలో జరిగినట్లు సమాచారం అందిన ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపింది. దర్యాప్తు పూర్తయ్యే వరకు కార్స్పై తదుపరి చర్యల విషయమై స్పష్టత వచ్చే అవకాశం లేదు. అతడు ప్రస్తుతం పాకిస్తాన్తో లార్డ్స్లో జరగనున్న రెండో టెస్టు కోసం ఇంగ్లండ్ జట్టులో కొనసాగుతున్నాడు.ఆగస్టు 27 నుంచి లార్డ్స్లో రెండో టెస్టు ప్రారంభం కానుంది. తొలి టెస్టులో ఇంగ్లండ్ భారీ విజయం సాధించినప్పటికీ కార్స్ తుది జట్టులో ఆడలేదు. గత యాషెస్ సిరీస్లో ఇంగ్లండ్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా నిలిచిన అతడికి రెండో టెస్టులో అవకాశం లభిస్తుందనే అంచనాలు ఉన్నాయి. అయితే తాజా ఘటన తర్వాత అతడి ఎంపికపై ఇంగ్లండ్ మేనేజ్మెంట్ నిర్ణయం కీలకం కానుంది.వరుస వివాదాలుకార్స్ ఘటన ఇంగ్లండ్ క్రికెట్లో ఇటీవల చోటుచేసుకున్న ఆఫ్ఫీల్డ్ వివాదాల పరంపరలో మరొకటిగా మారింది. గతంలోనూ నైట్క్లబ్లు, మద్యం, ఆటగాళ్ల ప్రవర్తనకు సంబంధించిన ఘటనలు ఇంగ్లండ్ జట్టుకు ఇబ్బందులు తెచ్చాయి. తాజాగా కార్స్ ఘటన నేపథ్యంలో ఆటగాళ్ల వ్యక్తిగత ప్రవర్తనపై ECB నిబంధనలు మరోసారి చర్చకు వచ్చాయి.కార్స్కు గతంలోనూ క్రమశిక్షణకు సంబంధించిన సమస్య ఎదురైంది. 2017 నుంచి 2019 మధ్య క్రికెట్కు సంబంధించిన బెట్టింగ్ నిబంధనలు ఉల్లంఘించినట్లు అంగీకరించడంతో 2024లో అతడిపై సస్పెన్షన్ విధించారు.ప్రస్తుతం కార్స్పై ఎలాంటి క్రిమినల్ అభియోగాలు లేవు. పోలీసులు అతడిని ఘటనాస్థలంలో తాత్కాలికంగా అదుపులోకి తీసుకుని అనంతరం విడుదల చేసినట్లు రిపోర్టులు పేర్కొంటున్నాయి. చదవండి: జో రూట్ ప్రపంచ రికార్డు -
దంచికొట్టిన రికెల్టన్.. దూసుకెళ్తున్న సన్రైజర్స్
‘ది హండ్రెడ్ మెన్స్ కాంపిటీషన్’-2026 టోర్నీలో సన్రైజర్స్ లీడ్స్ వరుస విజయాలతో దూసుకువెళ్తోంది. తాజాగా బర్మింగ్హామ్ ఫొనిక్స్ జట్టును ఓడించిన సన్రైజర్స్.. సీజన్లో నాలుగో విజయం నమోదు చేసింది. తద్వారా పదహారు పాయింట్లతో పట్టికలో రెండోస్థానానికి దూసుకువచ్చింది.సన్రైజర్స్ లీడ్స్ ప్రయాణం ఇలాది హండ్రెడ్ తాజా ఎడిషన్లో భాగంగా సన్రైజర్స్ తొలి మ్యాచ్లో ఎంఐ లండన్ చేతిలో ఓటమిపాలైంది. అనంతరం సదరన్ బ్రేవ్తో తలపడి ఐదు పరుగుల స్వల్ప తేడాతో గెలిచి.. విజయాల ఖాతా తెరిచింది. ఆ తర్వాత మాంచెస్టర్ సూపర్ జెయింట్స్పై గెలిచిన సన్రైజర్స్కు.. ట్రెంట్ రాకెట్స్ షాకిచ్చింది. దీంతో సీజన్లో రెండో పరాజయం చవిచూసిన సన్రైజర్స్.. లండన్ స్పిరిట్పై గెలిచి మరోసారి గెలుపుబాట పట్టింది.దంచికొట్టిన రికెల్టన్తాజాగా బర్మింగ్హాన్ ఫినిక్స్తో తలపడ్డ సన్రైజర్స్ 45 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. ఎడ్జ్బాస్టన్ వేదికగా టాస్ ఓడిన సన్రైజర్స్ తొలుత బ్యాటింగ్కు దిగింది. ఓపెనర్లలో మిచెల్ మార్ష్ (34) ఫర్వాలేదనిపించగా.. రియాన్ రికెల్టన్ దంచికొట్టాడు. కేవలం 37 బంతుల్లోనే ఆరు ఫోర్లు, మూడు సిక్సర్లు బాది 65 పరుగులు సాధించాడు.Easy picking ft. Rickelton 🙌 pic.twitter.com/HGftI8yMmi— SunRisers Leeds (@sunrisersleeds) August 7, 2026మిగిలిన వారిలో హ్యారీ బ్రూక్ 19, డాన్ లారెన్స్ 14 పరుగులతో ఫర్వాలేదనిపించగా.. కెప్టెన్ జాక్ క్రాలే (3) విఫలమయ్యాడు. ఫలితంగా నిర్ణీత 100 బంతుల్లో సన్రైజర్స్ ఏడు వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. బర్మింగ్హామ్ బౌలర్లలో ఉస్మాన్ తారిఖ్ రెండు వికెట్లు తీయగా.. క్రిస్ వుడ్, టామ్ హెల్మ్, జోర్డాన్ థాంప్సన్ తలా ఒక వికెట్ దక్కించుకున్నారు.124 పరుగులకే పరిమితంఅనంతరం లక్ష్య ఛేదనకు దిగిన బర్మింగ్హామ్ జట్టు నిర్ణీత 100 బంతుల్లో ఎనిమిది వికెట్లు నష్టపోయి 124 పరుగులకే పరిమితమైంది. దీంతో సన్రైజర్స్ 45 పరుగుల తేడాతో గెలిచింది. బర్మింగ్హామ్ బ్యాటర్లలో వికెట్ కీపర్ బ్యాటర్ జో క్లార్క్ 25, సీన్ డెక్సాన్ 34, జోర్డాన్ థాంప్సన్ 25 (నాటౌట్) ఓ మోస్తరుగా రాణించగా.. మిగతా వాళ్లంతా విఫలమయ్యారు.రెండోస్థానానికిసన్రైజర్స్ బౌలర్లలో బ్రైడన్ కార్స్, మాథ్యూ పాట్స్ చెరో మూడు వికెట్లతో చెలరేగగా.. నాథన్ ఎల్లిస్, అబ్రార్ అహ్మద్ తలా ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. ఇక ఈ సీజన్లో సన్రైజర్స్కు ఆరింట ఇది నాలుగో విజయం. ఎంఐ లండన్తో పాయింట్ల పరంగా (16) సమానంగా ఉన్నప్పటికీ.. నెట్రన్రేటు పరంగా మెరుగైన స్థితిలో ఉన్న సన్రైజర్స్ (+0.674) పట్టికలో రెండోస్థానానికి చేరుకుంది. మరోవైపు.. బర్మింగ్హామ్ జట్టు ఎలిమినేట్ అయింది.చదవండి: IND vs SL: కేఎల్ రాహుల్ అలా.. పడిక్కల్ ఇలా -
భారత్తో వన్డేలు.. ఇంగ్లండ్ జట్టులో మరో ఫాస్ట్ బౌలర్
భారత్తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్లో మిగిలిన రెండు మ్యాచ్ల కోసం ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ECB) కీలక మార్పు చేసింది. ఫాస్ట్ బౌలర్ బ్రైడన్ కార్స్ను జట్టులోకి తీసుకున్నట్లు ప్రకటించింది.ఐపీఎల్ 2026 సందర్భంగా చేతికి గాయం కావడంతో కార్స్ కొంతకాలం క్రికెట్కు దూరమయ్యాడు. అనంతరం మోచేతి సమస్య నుంచి కోలుకుని డర్హమ్ తరఫున వైటాలిటీ బ్లాస్ట్లో మూడు మ్యాచ్లు ఆడాడు. ఆ తర్వాత మళ్లీ జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు.ఎడ్జ్బాస్టన్లో జరుగుతున్న తొలి వన్డేలో పేస్ బౌలర్లకు అనుకూల పరిస్థితులు కనిపించడంతో ఇంగ్లండ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తొలి 30 ఓవర్లలో భారత్ బౌలింగ్లో స్పిన్నర్లకు కేవలం మూడు ఓవర్లు మాత్రమే ఇవ్వగా, మిగిలిన 27 ఓవర్లు పేసర్లు వేశారు. ఇంగ్లండ్ కోల్పోయిన ఆరు వికెట్లు కూడా అన్నీ పేసర్ల ఖాతాలోకే వెళ్లాయి.ఈ నేపథ్యంలో జోఫ్రా ఆర్చర్ గాయాల చరిత్రను దృష్టిలో ఉంచుకుని, పేస్ దళాన్ని మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో కార్స్ను జట్టులో చేర్చినట్లు సమాచారం.భారత్తో వన్డే సిరీస్కు ఇంగ్లండ్ తాజా జట్టు: హ్యారీ బ్రూక్ (కెప్టెన్), జోస్ బట్లర్ (వికెట్ కీపర్), జో రూట్, టామ్ బాంటన్, బెన్ డకెట్, జేకబ్ బెథెల్, సామ్ కరన్, విల్ జాక్స్, జేమ్స్ కోల్స్, లియామ్ డాసన్, రెహాన్ అహ్మద్, జోఫ్రా ఆర్చర్, సాకిబ్ మహ్మూద్, జోష్ టంగ్, గస్ అట్కిన్సన్, ఆదిల్ రషీద్, బ్రైడన్ కార్స్.కార్స్ ఇప్పటివరకు ఇంగ్లండ్ తరఫున 30 వన్డేలు ఆడి 34 వికెట్లు పడగొట్టాడు. ఇంగ్లండ్ పరిస్థితుల్లో అతని ప్రదర్శన మెరుగ్గా ఉండటంతో, భారత్తో మిగిలిన రెండు మ్యాచ్ల్లో అతను కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. రెండు, మూడు వన్డేలు జులై 16, 19 తేదీల్లో కార్డిఫ్, లార్డ్స్ వేదికలుగా జరుగనున్నాయి.ఇవాళ జరుగుతున్న తొలి వన్డే విషయానికొస్తే.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్, భారత పేసర్ల ధాటికి 107 పరుగులకే 6 వికెట్లు కోల్పోగా.. రూట్ (56), డాసన్ (65) ఆదుకున్నారు. వీరిద్దరూ ఏడో వికెట్కు అజేయమైన 115 పరుగులు జోడించి ఇన్నింగ్స్లు కొనసాగిస్తున్నారు. 42.5 ఓవర్ల తర్వాత ఇంగ్లండ్ స్కోర్ 222-6గా ఉంది. భారత బౌలర్లలో ప్రసిద్ద్ కృష్ణ, గుర్నూర్ బ్రార్ తలో 2 వికెట్లు తీయగా.. బుమ్రా, శివమ్ దూబే తలో వికెట్ దక్కించుకున్నారు. -
ఊహించని దెబ్బ.. ఎస్ఆర్హెచ్ కీలక నిర్ణయం
ఐపీఎల్ 2026 సీజన్లో రాజస్తాన్ రాయల్స్పై గెలిచి రెండో విజయాన్ని నమోదు చేసుకుంది. తాజాగా ఎస్ఆర్హెచ్ బౌలర్ బైడన్ కార్స్ గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. దీంతో ఎస్ఆర్హెచ్ ఫ్రాంచైజీ కీలక నిర్ణయం తీసుకుంది. గాయంతో సీజన్ మొత్తానికి దూరమైన బ్రైడన్ కార్స్ స్థానాన్ని శ్రీలంక పేసర్ దిల్షాన్ మధుషంకతో భర్తీ చేస్తున్నట్లు తెలిపింది. పేస్ అటాక్లో కార్స్ కీలకం అవుతాడని భావించిన మేనేజ్మెంట్కు ఇది ఊహించని దెబ్బ. కానీ ఏమాత్రం ఆలస్యం చేయని ఎస్ఆర్హెచ్ యాజమాన్యం మదుషంక రూపంలో బ్రైడన్ కార్స్కు సరైన ప్రత్యామ్నాయంగా ఎంచుకొంది. కాగా మధుషంకను ఎస్ఆర్హెచ్ రూ. 75 లక్షల బేస్ ప్రైస్కే జాయిన్ అవ్వనున్నాడు. ఈ నేపథ్యంలో దిల్షాన్ మధుషంకను ఎస్ఆర్హెచ్ క్యాంప్లోకి ఆహ్వానిస్తున్నట్లు తమ ఎక్స్లో పేర్కొంది. మధుషంక చేరికతో హైదరాబాద్ బౌలింగ్ దళం మరింత పటిష్టంగా మారిందనే చెప్పాలి. ఒక లెఫ్టార్మ్ పేసర్గా పవర్ప్లేలో బంతిని స్వింగ్ చేస్తూ వికెట్లు తీయగల నైపుణ్యం అతనికి ఉంది.గతంలో అంతర్జాతీయ క్రికెట్తో పాటు పలు లీగ్లలో కూడా తన మార్క్ చూపించిన ఈ లంక బౌలర్ రాకను అభిమానులు స్వాగతిస్తున్నారు. మధుషంక లంక తరఫున 28 వన్డేలు, 19 టీ20, ఒక టెస్టు మ్యాచ్ ఆడాడు. ప్రఫుల్ హింగే, సాకిబ్హుస్సేన్ వంటి యంగ్ బౌలర్లకు తోడుగా మధుషంక జతవ్వడం జట్టుకు అదనపు బలం. మరి మధుషంక చేరికతో ఆరెంజ్ ఆర్మీ బౌలింగ్ బలపడినట్లే.Dilshan Madushanka joins the squad as a replacement for Brydon Carse, who is ruled out due to injury.Welcome, Dilshan 🧡 pic.twitter.com/zJQWtbXVZt— SunRisers Hyderabad (@SunRisers) April 14, 2026 -
ఇంగ్లండ్ జట్టుకు భారీ షాక్..
ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ బ్రైడాన్ కార్స్ ది హాండ్రెడ్ లీగ్-2025 నుంచి గాయం కారణంగా వైదొలిగాడు. ఈ ఏడాది సీజన్లో కార్స్ నార్తర్న్ సూపర్చార్జర్స్ ప్రాతినిథ్యం వహించాల్సి ఉండేది. కానీ అతడు ప్రస్తుతం పాదం, బొటనవేలు గాయంతో బాధపడుతున్నాడు.కార్స్ ఇటీవల భారత్తో జరిగిన టెస్టు సిరీస్లో భాగమయ్యాడు. బంతితో పాటు బ్యాట్తో కూడా ఈ స్పీడ్ స్టార్ రాణించాడు. అయితే గాయం కారణంగా కీలకమైన ఆఖరి టెస్టుకు అతడు దూరమయ్యాడు. ఇప్పుడు వైద్యల సలహా మెరకు హాండ్రెడ్ లీగ్ నుంచి కూడా తప్పుకొన్నాడు. ఈ విషయాన్ని కార్స్ ధ్రువీకరించాడు."భారత్తో జరిగిన సుదీర్ఘ టెస్టు సిరీస్ అనంతరం వైద్య సిబ్బందితో నా గాయం గురించి సంప్రదింపులు జరిపాను. వైద్యుల సూచన మేరకు ఈ ఏడాది ది హండ్రెడ్కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. ఈ టోర్నీకి నేను దూరంగా ఉన్నప్పటికి నార్తర్న్ సూపర్చార్జర్స్ మెరుగైన ప్రదర్శన చేయాలని కోరుకుంటున్నాను.భవిష్యత్తులో ఈ జట్టుకు మళ్లీ ప్రాతినిధ్యం వహించడానికి ఎదురు చూస్తున్నాను" అని ఓ ప్రకటనలో కార్స్ పేర్కొన్నాడు. కాగా ఇంగ్లండ్ జట్టు స్వదేశంలో సెప్టెంబర్లో దక్షిణాఫ్రికాతో వైట్బాల్ సిరీస్లు ఆడనుంది. ఈ సిరీస్లకు కూడా కార్స్ దూరమయ్యే అవకాశముంది. అతడు తిరిగి మళ్లీ యాషెస్ సిరీస్లో ఆడే సూచనలు కన్పిస్తున్నాయి. చదవండి: కరుణ్ నాయర్ కంటే సుదర్శన్ బెటరా? ఇద్దరికి ఎన్ని మార్కులంటే? -
ఇంగ్లండ్ బౌలర్ ఓవరాక్షన్!.. ఇచ్చిపడేసిన జడ్డూ.. మధ్యలోకి స్టోక్స్
లార్డ్స్ టెస్టు సందర్భంగా ఇంగ్లండ్ పేసర్ బ్రైడన్ కార్స్ (Brydon Carse)- టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా (Ravidndra Jadeja) మధ్య గొడవ జరిగింది. కార్స్ చేసిన పనికి జడ్డూ గట్టిగానే ఇచ్చిపడేశాడు. ఈ క్రమంలో ఇరువురి మధ్య వాగ్వాదం తారస్థాయికి చేరగా ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ (Ben Stokes) అడ్డుగోడలా నిలబడి వారిని విడదీయడంతో పరిస్థితి సద్దుమణిగింది.అసలేం జరిగిందంటే.. భారత్- ఇంగ్లండ్ మధ్య లార్డ్స్ మైదానంలో గురువారం మొదలైన మూడో టెస్టు తుది అంకానికి చేరింది. ఆఖరిదైన సోమవారం నాటి ఐదో రోజు ఆటలో విజేత ఎవరన్నది తేలనుంది. ఇంగ్లండ్ విధించిన 193 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 58/4 ఓవర్నైట్ స్కోరుతో ఆట మొదలుపెట్టిన భారత్.. ఆరంభం నుంచే తడబడింది.రిషభ్ పంత్ (9)ను జోఫ్రా ఆర్చర్ అద్భుత డెలివరీతో బౌల్డ్ చేయగా.. కేఎల్ రాహుల్ (39)ను స్టోక్స్ లెగ్ బిఫోర్ వికెట్గా వెనక్కి పంపాడు. ఆ తర్వాత వాషింగ్టన్ సుందర్ (0) ఇలా వచ్చి అలా వెళ్లగా.. నితీశ్ కుమార్రెడ్డి 53 బంతులు ఎదుర్కొని 13 పరుగులు చేసి నిష్క్రమించాడు. ఫలితంగా భోజన విరామ సమయానికి భారత్ 39.3 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 112 పరుగులు చేసింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో జడేజా నిలకడగా ఆడుతూ ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నంలో.. కార్స్ అతడికి అడ్డు తగిలాడు.జడ్డూ మెడ చుట్టూ చేయి వేసిటీమిండియా ఇన్నింగ్స్లో 35వ ఓవర్లో రంగంలోకి దిగిన కార్స్ బౌలింగ్లో.. ఆఖరి బంతికి జడ్డూ నితీశ్ రెడ్డితో కలిసి రెండు పరుగులు పూర్తి చేశాడు. అయితే, సింగిల్కు వెళ్లే క్రమంలో జడ్డూకు కార్స్ అడ్డుగా నిలవగా.. బంతిని చూస్తూ పరుగుకు వెళ్లిన జడ్డూ అతడిని ఢీకొట్టాడు. దీంతో తాను పడిపోకుండా ఉండేందుకు అన్నట్లుగా... జడ్డూ మెడ చుట్టూ చేయి వేసి అతడిని బంధించేందుకు కార్స్ ప్రయత్నం చేయగా.. జడ్డూ విడిపించుకుని పరుగులు పూర్తి చేశాడు.ఇచ్చి పడేసిన జడేజాఅనంతరం కార్స్ దగ్గరికి వచ్చి ఏంటి సంగతి అంటూ అడుగగా.. కార్స్ దురుసుగా ఎదురు సమాధానం ఇచ్చాడు. దీంతో మాటామాటా పెరగగా.. స్టోక్స్ వచ్చి ఇద్దరినీ విడదీశాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.కాగా లార్డ్స్' టెస్టులో ఇలాంటి జగడాలు ఎక్కువయ్యాయి. మూడో రోజు ముగింపు సమయంలో టీమిండియా కెప్టెన్ శుబ్మన్ గిల్.. ఇంగ్లండ్ ఆటగాడు జాక్ క్రాలీ మధ్య కూడా వాగ్వాదం జరిగింది. ఇక ఐదోరోజు రిషభ్ పంత్ను అవుట్ చేసిన తర్వాత జోఫ్రా ఆర్చర్ కూడా అతడిని స్లెడ్జ్ చేశాడు.చదవండి: ఇదేం పద్ధతి?.. ఎవరి కోసం ఇదంతా?!: సునిల్ గావస్కర్ ఫైర్Drama, more drama! 👀#ENGvIND 👉 3rd TEST, DAY 5 | LIVE NOW on JioHotstar 👉 https://t.co/DTsJzJLwUc pic.twitter.com/eiakcyShHV— Star Sports (@StarSportsIndia) July 14, 2025


