-
KCR BRS: కిక్కిరిసిన తుగ్లక్ రోడ్డు.. బిజీబిజీగా కేసీఆర్
సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ స్థాయిలో పార్టీ నిర్మాణం, కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా చేయాల్సిన ఉద్యమం, ఉత్తరాది రాష్ట్రాల్లో కలిసొచ్చే పార్టీలు, సంఘాలు, పార్టీ ప్రధాన ఎజెండా తదితర అంశాలపై బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు తీవ్ర కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఉత్తరాదికి చెందిన నేతలు, రైతు సంఘాల నాయకులతో కీలక భేటీలు నిర్వహిస్తున్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లో వ్యవసాయమే ప్రధాన ఆదాయ వనరు, రైతులే కీలకం కావడంతో.. వారి ఎజెండాతోనే ముందుకు పోవాలనే లక్ష్యంతో వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. జాతీయ స్థాయిలో రైతు ఉద్యమ నిర్మాణం, వ్యవసాయ కేంద్రీకృత అంశాలపై విస్తృత చర్చలు జరుపుతున్నారు. ధాన్యం సేకరణ, గోధుమ సాగుపై చర్చలు రైతు ఎజెండానే తమ తొలి ప్రాధాన్యమని చాటేలా బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘంగా భారత్ రాష్ట్ర కిసాన్ సమితి (బీఆర్ఎస్ కిసాన్ సెల్)ని ఏర్పాటు చేయడంతో పాటు దానికి అధ్యక్షునిగా రైతు సంఘం నేత గుర్నామ్ సింగ్ చడూనీని కేసీఆర్ నియమించిన విషయం తెలిసిందే. తన నియామకంపై కృతజ్ఞతలు తెలియజేసేందుకు.. గుర్నామ్ సింగ్తో పాటు పంజాబ్, హరియాణాకు చెందిన రైతులు గురువారం తుగ్లక్ రోడ్డులోని సీఎం అధికారిక నివా సంలో కేసీఆర్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన.. ప్రస్తుత ఖరీఫ్లో వరి ధాన్యం సేకరణ, దానికి అనుసరిస్తున్న విధానాలు, గోధుమల సాగు లో తలెత్తే సమస్యలు, పంట వ్యర్ధాల దహనం, ప్రభుత్వ విధానాలు, తదితర అంశాలపై చర్చించారు.పంటల సేకరణలో జాతీయ విధానం, మద్దతు ధరలు, వ్యవసాయంలో సంప్రదాయ దేశీయ పద్ధతులకు ప్రోత్సాహం వంటి అంశాలపై అభిప్రాయాలు సేకరించారు. సాగు నీటి రంగంలో తెలంగాణ తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులు, విద్యుత్ సంస్కరణలు, వివిధ వృత్తుల వారికి సామాజిక భద్రత వంటి అంశాలపై మాట్లాడినట్లు చెబుతున్నారు. తెలంగాణలో వ్యవసాయ రంగంలో తెచ్చిన విప్లవాత్మక మార్పులనే జాతీయ స్థాయి లో అమలు చేసేలా ఎజెండాను రూపొందిద్దామని కేసీఆర్ స్పష్టం చేసినట్లు తెలిసింది. ఒవైసీ భేటీ.. కుమార్తె వివాహానికి ఆహ్వానం! మరోవైపు ముఖ్యమంత్రి కేసీఆర్తో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ భేటీ అయ్యారు. తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా ఆహ్వానించారు. బీఆర్ఎస్ ఏర్పాటుపై ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జాతీయ స్థాయిలో కలిసి ఉద్యమించే అంశాలు, పార్లమెంట్లో లేవనెత్తాల్సిన విషయాలపై ఇరువురు నేతలు కాసేపు ముచ్చటించుకున్నారు. కిక్కిరిసిన తుగ్లక్ రోడ్డు బీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత రెండోరోజు కూడా కేసీఆర్కు శుభాకాంక్షల వెల్లువ కొనసాగింది. పార్టీ ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులు, ఇతర సందర్శకుల రాకతో ఆయన బిజీబిజీగా గడిపారు. తెలంగాణ నుంచి వేలాదిగా తరలివచ్చిన పార్టీ నేతలు, కార్యకర్తలతో పాటు, ఉత్తరాది నుంచి పెద్దసంఖ్యలో వచ్చిన రైతు సంఘాల నేతలు, ప్రముఖులను పలుకరించిన ముఖ్యమంత్రి వారితో ఫొటోలు దిగారు. సందర్శకుల తాకిడితో తుగ్లక్ రోడ్డు పరిసర ప్రాంతాలు జన సందోహంతో కిక్కిరిశాయి. ఇలావుండగా బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభ కార్యక్రమం ముగించుకుని హైదరాబాద్కు తిరిగి పయనమైన నేతలకు విమాన టికెట్ల ధరలు చుక్కలు చూపించాయి. గరిష్టంగా రూ.50 వేల వరకు పలకడంతో చాలామంది తమ ప్రయాణాలను వాయిదా వేసుకున్నారు. ఉద్యమ కార్యాచరణపై త్వరలో ప్రకటన! రాజస్థాన్కు చెందిన రాష్ట్రీయ్ లోక్తాంత్రిక్ పార్టీ (ఆర్ఎల్పీ) నేషనల్ కన్వీనర్, ఎంపీ హనుమాన్ బేనివాల్, ఒడిశాకు చెందిన రైతు సంఘం నేత అక్షయ్ కుమార్, జహీరాబాద్కు చెందిన రైతు నేత ఢిల్లీ వసంత్లు కూడా కేసీఆర్తో భేటీ అయ్యారు. ఆయా రాష్ట్రాల్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రభుత్వాల విధానాలు, చేయాల్సిన సంస్కరణలు వంటి అంశాలపై లోతుగా చర్చించారు. రైతు సంబంధిత అంశాలపై వివరాలను సేకరించిన కేసీఆర్.. త్వరలోనే పార్టీ తరఫున జాతీయ స్థాయి సమావేశం నిర్వహణ, తదనంతరం ఢిల్లీ వేదికగా చేసే ఉద్యమ కార్యాచరణపై ప్రకటన చేద్దామని చెప్పినట్లు తెలిసింది. ఇదీ చదవండి: స్పీడ్ పెంచిన గులాబీ బాస్.. ఢిల్లీ వేదికగా త్వరలో కీలక సమావేశం! -
తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. బీఆర్ఎస్లపై స్టే యథావిధిగా కొనసాగించాలని ధర్మాసనం నిర్ణయించింది. ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్లపై బుధవారం హైకోర్టు విచారించింది. ఇదే అంశంపై సుప్రీంకోర్టులో పిటిషన్ పెండింగ్లో ఉండడంతో.. అక్కడ ఉత్తర్వులు వెలువడిన తర్వాతే విచారణ చేపడతామని హైకోర్టు స్పష్టం చేసింది. అయితే అప్పటివరకూ అర్జీదారులను ఎలాంటి ఇబ్బందులకు గురిచేయొద్దని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన అర్డర్ కాపీలను సమర్పించాలని ప్రభుత్వాన్ని న్యాయస్థానం కోరింది. ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్లపై ఇప్పటికే మూడు రాష్ట్రాలను సుప్రీంకోర్టు ఇంప్లీడ్ చేసిన విషయం తెలిసిందే. ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్లపై విధివిధానాలు తెలపాలని మూడు రాష్ట్రాలకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయాన్ని హైకోర్టు పరిశీలించింది. సుప్రీంకోర్టు తుది ఆదేశాల తర్వాత ఈ పిటిషన్ను విచారిస్తామని హైకోర్టు తెలిపింది. అప్పటివరకు బీఆర్ఎస్పై స్టే యథావిధిగా కొనసాగుతుందని ప్రకటించింది. ఎల్ఆర్ఎస్పై సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చేంత వరకు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని ప్రభుత్వానికి చెప్పింది. ఎల్ఆర్ఎస్ మీద ప్రభుత్వం తెచ్చిన జీవోపై ఎలాంటి చర్యలు తీసుకోమని కోర్టుకు ప్రభుత్వ తరఫు న్యాయవాది (ఏజీ) సమాధానం ఇచ్చారు. ఏజీ చెప్పిన స్టేట్మెంట్ను హైకోర్టు నమోదు చేసుకుంది. -
టాలీవుడ్ డ్రగ్స్ కేసు: ప్రభుత్వానికి చివరి అవకాశం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కలకలం సృష్టించిన టాలీవుడ్ డ్రగ్స్ కేసు దర్యాప్తును సీబీఐ, ఈడీ, ఎన్సీబీకి అప్పగించాలంటూ మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి వేసిన పిల్పై తెలంగాణ హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది. పిటీషన్ దాఖలు చేసి మూడేళ్లు అవుతున్నా.. తెలంగాణ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయడం లేదని రేవంత్ తరఫు న్యాయవాది రచనా రెడ్డి కోర్టుకు తెలిపారు. ఈ కేసులో కౌంటర్ దాఖలుకు వారం రోజుల పాటు గడువు ఇవ్వాలని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టును కోరారు. ప్రభుత్వానికి చివరి అవకాశం ఇచ్చిన కోర్టు.. తదుపరి విచారణను ఈ నెల 17కి వాయిదా వేసింది. ధరణి పోర్టల్పై నేడు విచారణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ధరణి పోర్టల్ రిజిస్ట్రేషన్లపై దాఖలైన పిటిషన్పై గురువారం హైకోర్టు విచారణ చేపట్టింది. ధరణి పోర్టల్లో వ్యవసయేతర ఆస్తుల నమోదుపై హై కోర్టు గతంలో ఇచ్చిన స్టే ఆర్డర్ని నేటి వరకు పొడిగించింది. ఇక నేటి విచారణలో ధరణికి సంబంధించిన జీవోలపై ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయనుంది. నేడు పిటీషన్ విచారణని కోర్టు మధ్యాహ్న 2.30 గంటలకి వాయిదా వేసింది. (చదవండి: రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు) బీఆర్ఎస్పై ఎందుకు ఇంత జాప్యం బీఆర్ఎస్పై నివేదిక సమర్పించేందుకు మరికొంత సమయం ఇవ్వాల్సిందిగా రాష్ట్రప్రభుత్వం తెలంగాణ హై కోర్టును కోరింది. చివరి అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టును అభ్యర్థించారు. అయితే 2016లో దాఖలైన పిల్లో ఇంతవరకు కౌంటర్ దాఖలు చేయ్యలేదన్న కోర్టు.. ఎందుకు ఇంత జాప్యం చేస్తున్నారని ప్రశ్నించింది. భవానాల క్రమబద్ధీకరణపై తదుపరి విచారణను హై కోర్టు ఈ నెల 24కి వాయిదా వేసింది. -
బీఆర్ఎస్ గుడ్న్యూస్
సాక్షి, సిటీబ్యూరో: బీఆర్ఎస్ (బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీమ్) కింద అక్రమ నిర్మాణాలను క్రమబద్ధీకరించుకునేందుకు దరఖాస్తు చేసుకొని ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వారికి త్వరలోనే శుభవార్త అందనుంది. దాదాపు నాలుగేళ్లుగాఅదిగో.. ఇదిగో.. అంటున్నప్పటికీ ముందుకుసాగని దరఖాస్తుల ప్రాథమిక పరిశీలనను అధికారులు ఎట్టకేలకు పూర్తి చేశారు. ఇందులో భాగంగా దరఖాస్తులను వివిధ కేటగిరీలుగా వర్గీకరించారు. అందిన దరఖాస్తుల్లో 3వేలు ప్రాథమిక పరిశీలనలోనేబీఆర్ఎస్కు అనర్హమైనవని గుర్తించారు. యూఎల్సీ పరిధి, చెరువులు, నాలాలు, వక్ఫ్ ప్రభుత్వ భూములను ఆక్రమించి వీటిని నిర్మించినట్లు తేల్చారు. అనుమతులు లేకుండా భవనాలు, అదనపు అంతస్తులు వేసిన నిర్మించిన వారిలో ఎక్కువ మంది వ్యక్తిగత ఇళ్లవారే ఉండడం నగరంలో స్థలాల డిమాండ్కు అద్దం పడుతోంది. మొత్తం 1.27 లక్షల దరఖాస్తుల్లో దాదాపు 69 శాతంవీరివే ఉన్నాయని తేలింది. దరఖాస్తుల్లో ఇండిపెండెంట్ ఇళ్లవి 70 వేలు, అపార్ట్మెంట్లలోని వ్యక్తిగత ఫ్లాట్లు 18వేలు, బిల్డర్ల అపార్ట్మెంట్లు 13వేలు, బహుళ అంతస్తుల భవనాలవి 11వేలు, వాణిజ్య భవనాలవి7వేలు ఉన్నాయి. ఇవి కాకుండా ఇతరత్రా కూడా మరికొన్ని ఉన్నాయి. అదే విధంగా బీఆర్ఎస్కు దరఖాస్తుతో పాటు ప్రాథమిక ఫీజు రూ.10వేలు చెల్లించాలనే నిబంధన ఉంది. దరఖాస్తుదారుల్లో దాదాపు 14వేల మంది ఈ ఫీజు చెల్లించలేదని అధికారులు తెలిపారు. హైకోర్టు ఆదేశాల మేరకు... దరఖాస్తుల ప్రాథమిక పరిశీలనను పూర్తి చేసిన అధికారులు ఈ జాబితాను హైకోర్టుకు అందజేసి బీఆర్ఎస్కు అనుమతించాల్సిందిగా కోరనున్నారు. ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ఫిర్యాదుతో బీఆర్ఎస్కు బ్రేక్ వేసిన హైకోర్టు... దరఖాస్తుల్ని పరిశీలించవచ్చునని, అయితే తాము అనుమతి ఇచ్చే వరకూ క్రమబద్ధీకరణ మాత్రం చేయరాదని ఆదేశించిన విషయం విదితమే. అధికారులు ఎప్పటి నుంచో దరఖాస్తుల వివరాలను హైకోర్టుకు అందజేసేందుకు ప్రయత్నాలు చేసినప్పటికీ..పరిశీలన పూర్తికాకపోవడంతో సమర్పించలేదు. ప్రస్తుతం జీహెచ్ఎంసీతో పాటు ప్రభుత్వానికి కూడా నిధుల కటకట ఉండటంతో... క్రమబద్ధీకరణ ద్వారా భారీ ఆదాయం సమకూరుతుందనే భావనతో దరఖాస్తులను పరిష్కరించాలని సర్కార్ బల్దియాకు సూచించింది. అందుకనుగుణంగా అధికారులు దరఖాస్తుల పరిశీలన పూర్తి చేశారు. యూఎల్సీ, నాలా, చెరువులు, తదితర ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి జరిపిననిర్మాణాలు బీఆర్ఎస్కు ఎట్టి పరిస్థితుల్లోనూ అర్హమైనవి కావని చీఫ్ సిటీ ప్లానర్ఎస్.దేవేందర్రెడ్డి తెలిపారు. ఈ జాబితాను హైకోర్డుకు నివేదించాక, న్యాయస్థానం ఇచ్చే ఆదేశాలకనుగుణంగా తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. -
అందుబాటులోకి రాని ‘ఆన్లైన్’
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
ముస్లిం రిజర్వేషన్లే రద్దు
మోదీకి బహుమతిగా ఇవ్వాలి
అబద్ధాల పునాదులపై..
బీజేపీకి మరో రూపమే బీఆర్ఎస్
పదేళ్ల అభివృద్ధి ఏది?
● బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిన అమిత్ షా పర్యటన ● కాగజ్నగర్ వికాస్ సంకల్ప్ సభ విజయవంతం ● ఉమ్మడి జిల్లా నుంచి తరలివచ్చిన జనం ● మార్మోగిన జైశ్రీరామ్, భారత్ మాతాకీ జై నినాదాలు
బీఆర్ఎస్, బీజేపీకి బుద్ధి చెప్పాలి
నేడు జేపీ నడ్డా రాక
చిన్నబోయిన చిన్నబొంకూరు
తప్పక చదవండి
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- Prajwal Revanna: 4 రోజులు సిట్ కస్టడీ
- నేడు రాష్ట్రానికి ప్రధాని మోదీ
- పోస్టల్ బ్యాలెట్కు 7, 8 తేదీల్లో మరో అవకాశం
- ఇజ్రాయెల్లో అల్–జజీరా కార్యాలయాల మూసివేత
- నిప్పుతో చెలగాటమా!
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జగన్ మళ్లీ ఎందుకు గెలుస్తారంటే...
- ఇలాగేనా మాట్లాడేది?
Advertisement