breaking news
BEd student
-
నా కోరిక తీరుస్తావా? లేదా.. బీఈడీ కాలేజీలో లెక్చరర్ వేధింపులు
బాలసోర్: తనను లైంగికంగా వేధిస్తున్న లెక్చరర్పై చర్యలు తీసుకోవాలని ఓ విద్యార్థిని కాలేజీ ప్రిన్సిపాల్కు ఫిర్యాదు చేసింది. ఎలాంటి చర్యలూ లేకపోవడంతో మనస్తాపం చెంది శనివారం కళాశాల ఆవరణలోనే ఒంటికి నిప్పంటించుకుంది. దాదాపు 90 శాతం కాలిన గాయాలతో ఆస్పత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉంది. ఈ దారుణం ఒడిశాలోని బాలసోర్లో చోటుచేసుకుంది.వివరాల ప్రకారం.. బాధితురాలు బాలసోర్లోని ఫకిర్ మోహన్ అటానమస్ కాలేజీలో బీఈడీ సెకండ్ ఇయర్ చదువుకుంటోంది. కాలేజీలో తన విభాగం హెచ్వోడీ, లెక్చరర్ లైంగికంగా వేధిస్తున్నారంటూ జూన్ 30వ తేదీన ప్రిన్సిపాల్కు ఫిర్యాదు అందించింది. ఆ లెక్చరర్పై చర్యలు తీసుకోవాలంటూ కాలేజీ క్యాంపస్లో వారం రోజులపాటు నిరసన కూడా కొనసాగించింది. శనివారం ప్రిన్సిపల్ దిలీప్ ఘోష్ను కలిసింది. అనంతరం కాలేజీ ఆవరణలోనే నిప్పంటించుకుంది. మంటలు ఆర్పి, ఆమెను కాపాడేందుకు ప్రయత్నించిన ఓ విద్యార్థి సైతం గాయపడ్డాడు. దాదాపు 90 శాతం కాలిన గాయాలైన బాధితురాలు ప్రస్తుతం భువనేశ్వర్ ఎయిమ్స్లో చికిత్స పొందుతోంది.Had strict action been taken in this case 👇🏼 FM College Authorities would have been more afraid to remain silent for so long. #fakirmohancollege #Balasore pic.twitter.com/e7T48orQOC— Arunabh Mohanty ।। 🇮🇳 ।। (@arunabh_m) July 13, 2025ఈ ఘటన అనంతరం, కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. వేధింపులకు పాల్పడిన లెక్చరర్ను అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా విద్యాశాఖ మంత్రి సూర్యవంశీ స్పందిస్తూ.. సదరు లెక్చరర్, కాలేజీ ప్రిన్సిపాల్లను సస్పెండ్ చేసినట్టు తెలిపారు. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. @grok explainA second-year integrated B.Ed student at Fakir Mohan Autonomous College in Balasore, Odisha, self-immolated today July 12, after alleging repeated sexual harassment by HoD Samir Kumar Sahu, who demanded favors and threatened her grade#Balasore #arrest #odisha #fm pic.twitter.com/kFapuntvWx— Sweettt (@sweett145) July 12, 2025 -
పెళ్లి రద్దయిందని యువతి ఆత్మహత్య
⇒ ప్రేమిస్తున్నానని పెళ్లి చెడగొట్టిన సమీప బంధువు ⇒ భయంతో ఆ యువకుడూ ఆత్మహత్య వైరా రూరల్: వివాహం రద్దయిందనే మనస్తాపంతో బీఈడీ విద్యార్థిని ఉషారాణి(24) బలవన్మరణానికి ఒడిగట్టింది. ప్రేమిస్తున్నానంటూ ఆమె సెల్కు మెసేజ్లు పంపిన ఓ యువకుడు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఖమ్మం జిల్లా వైరా మం డలం సోమవరం గ్రామానికి చెందిన కంటేపూడి ఏసోబు–దేవరాణిల రెండో కుమార్తె ఉషారాణి తని కెళ్లలోని బ్రౌన్సు కళాశాలలో బీఈడీ చదువుతోంది. ఆమెకు గత నెల 5న సత్తుపల్లిలోని ద్వారకనగర్కు చెందిన ఓ యువకుడితో నిశ్చితార్థం జరిగింది. మే లో వివాహం జరగాల్సి ఉంది. అయితే, ఏపీలోని కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం చెవిటికల్లు గ్రా మానికి చెందిన ఉషారాణి సమీప బంధువు పోలగాని నరేంద్ర (26) ప్రేమిస్తున్నానంటూ ఉషారాణి సెల్కు తరచూ మెస్సేజ్లు పంపేవాడు. విషయం తెలిసి కుటుంబ సభ్యులు ఉషారాణికి నిశ్చితార్థం చేశారు. ఈ క్రమంలోనే నరేంద్ర... ఉషారాణితో నిశ్చితార్థం చేసుకున్న యువకుడికి ఫోన్ చేసి ‘‘మేము ప్రేమిం చుకుంటున్నాం.. మా వివాహానికి కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారంటూ’’ చెప్పాడు. దీం తో వివాహం రద్దు అయ్యింది. మనస్తాపం చెందిన ఉషారాణి సోమవారం ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కాగా, ఉషారాణి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసి.. కృష్ణా జిల్లాలో ఉన్న నరేంద్ర మంగళవారం ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రేమించిన అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడాన్ని తట్టుకోలేకే నరేంద్ర చనిపోయినట్లు అతడి బంధువులు చెబుతున్నారు.