breaking news
	
		
	
  bc janardan reddy
- 
      
                   
                                                     
                   
            నంద్యాలలో పచ్చమూకల అరాచకం
సాక్షి,నంద్యాల: రాష్ట్రంలో పచ్చమూకల అరాచకాలు కొనసాగుతున్నాయి. తాజాగా, నంద్యాల జిల్లా కలుగోట్లలో మంత్రి బీసీ జనార్ధన్రెడ్డి అనుచరులు రాడ్లతో వైఎస్సార్సీపీ నేతలపై దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపుతోంది. ఈ దాడిలో పలువురు వైఎస్సార్సీపీ నేతలు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని అత్యవసర చికిత్స కోసం కోవలెకుంట్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.రెండురోజుల క్రితం కూడా వైఎస్సార్సీపీ నేత రామసుబ్బారెడ్డిపై అదే వర్గానికి చెందిన వ్యక్తులు దాడి చేసినట్లు సమాచారం. వరుసగా జరుగుతున్న ఈ ఘటనలు నంద్యాల జిల్లాలో భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి.స్థానికంగా ‘పచ్చమూకల అరాచకాలు’అంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శాంతి భద్రతలు కాపాడేందుకు పోలీసులు రంగంలోకి దిగినప్పటికీ.. రాజకీయంగా ప్రేరితమైన ఈ దాడులు ఆగకపోవడం ఆందోళన కలిగిస్తోంది. - 
      
                   
                                                     
                   
            ఏయ్.. నేను ఎవర్నో తెలుసా?.. కానిస్టేబుల్పై కూటమి మంత్రి సోదరుడి దాడి
సాక్షి,నంద్యాల జిల్లా: నంద్యాల జిల్లాలో కూటమి నేతల ఆగడాలు తారాస్థాయికి చేరాయి. పోలీసుల మీద దౌర్జన్యం చేస్తున్నారు. ఏపీ రోడ్లు, భవనాలశాఖ మంత్రి బీసీ జనార్దన్రెడ్డి బంధువు బీసీ మదన భూపాల్రెడ్డి దాడి చేశారు.కొలిమిగండ్ల లక్ష్మీ నరసింహ ఆలయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆలయం లోపలికి పంపించాలంటూ బీసీ మదన భూపాల్ రెడ్డి వాగ్వాదానికి దిగాడు.సెక్యూరిటీ రిత్యా ఆలయంలోకి పంపడం సాధ్యం కాదంటూ స్పెషల్ పార్టీ పోలీసులు మదన భూపాల్రెడ్డి, అతని అనుచరులకు నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు. ఉన్నతాధికారులు చెబితే లోపలికి పంపిస్తానని అన్నారు. అయితే తాను బీసీ జనార్ధన్రెడ్డి సోదరుడినని,నన్నే ఆపుతావా? అంటూ విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్పై చేయిచేసుకున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. కాగా,రాష్ట్రంలో కూటమి నేతల ఆగడాల సంస్కృతి దేవాలయాలకు చేరడంపై భక్తులు విస్మయం వ్యక్తం చేస్తుండగా.. డ్యూటీలో ఉన్న పోలీసులపై అధికార పార్టీకి చెందిన నాయకుడి సోదరుడు నేరుగా దాడికి పాల్పడటం రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై తీవ్ర ఆందోళనలను రేకెత్తిస్తోంది. - 
      
                    
కబలించిన కరెంట్

 బనగానపల్లెటౌన్, న్యూస్లైన్ : జీవనోపాధి కోసం కూలి పనులకు వెళ్లిన ఓ మహిళను పని చేస్తున్నచోటే కరెంట్ కబలించింది. షాక్ తగిలిన మరుక్షణమే ఆమె విగతజీవిగా మారింది. తీగలకు వేలాడుతూ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయింది. ఈ ఘటన బనగానపల్లె 33/11కేవీ విద్యుత్ సబ్స్టేషన్ సమీపంలో టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి బీసీ జనార్ధన్రెడ్డి నిర్మిస్తున్న వాటర్ప్లాంట్ వద్ద సోమవారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. పట్టణ ప్రజలకు శుద్ధ తాగునీటిని అందించేందుకోసం బీసీ జనార్ధన్రెడ్డి సొంత నిధులతో వాటర్ ప్లాంట్ నిర్మాణం తలపెట్టారు.
 
 నిర్మాణ పనులు పూర్తి కావడంతో తెలుగుపేటకు చెందిన వెంకటలక్ష్మమ్మ, రమణమ్మ, బి.లక్ష్మిదేవి సోమవారం సున్నం వేసేందుకు వెళ్లారు. ప్లాంట్పై సున్నం వేస్తుండగా పక్కనే ఉన్న హైటెన్షన్ వైర్లు తగిలి లక్ష్మిదేవి(38) అక్కడికక్కడే మరణించింది. పక్కనే ఉన్న కూలీలు ప్రాణభయంతో పరిగెత్తారు. తీగలకు ప్లాస్టిక్ పైపులు ఏర్పాటు చేసిననప్పటికీ అవి విద్యుత్ తీవ్రతను నిరోధించలేకపోయాయి. ఫలితంగా ఓ మహిళ ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోయాయి. బీసీ జనార్ధన్రెడ్డి, ఆయన సోదరుడు రాజారెడ్డి ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు.
 
 ప్రమాదానికి కారణాలు తెలుసుకుని బాధిత కుటుంబీకులను ఓదార్చారు. తీగలపై ఉన్న మృతదేహాన్ని కిందకు దింపి పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్ఐ మంజునాథ్ తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు. మృతురాలి భర్త శ్రీనివాసులు స్థానిక ఫైర్ స్టేషన్లో పనిచేస్తూ గత ఏడాది ఉద్యోగం పర్మినెంట్ కావడంతో నంద్యాలకు బదిలీ అయ్యాడు. లక్ష్మిదేవి మరణంతో కూతురు మౌనిక, కుమారుడు అశోక్తోపాటు బంధువుల రోదనలు మిన్నంటాయి. 


