-
వక్ఫ్బోర్డు విభజనకు కసరత్తు
సాక్షి, హైదరాబాద్: ఎట్టకేలకు రాష్ట్ర వక్ఫ్బోర్డు విభజనకు కేంద్ర ప్రభుత్వం చర్యలు మొదలు పెట్టింది. విభజనకు వెంటనే పూనుకోవాలన్న రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తికి కేంద్రం సానుకూలంగా స్పందించింది. కేంద్రంలోని ముగ్గురు అధికారుల బృందం మంగళవారం రాత్రి హైదరాబాద్కు చేరుకుంది. ఈ బృందంలో కేంద్ర మంత్రిత్వ మైనార్టీ వ్యవహారాల శాఖ కార్యదర్శి అరవింద్ మాయరావ్, సంయుక్త కార్యదర్శి రాకేశ్ మోహన్, కార్యదర్శి పీకే శర్మలు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు-2014లోని 10వ షెడ్యూల్లో ఆంధ్రప్రదేశ్ వక్ఫ్బోర్డును చేర్చారు. షెడ్యూలు-10లోకి వచ్చే ప్రభుత్వ సంస్థలను కేంద్రం విభజించాల్సి ఉంటుంది. రాష్ట్ర విభజన జరిగి ఏడు మాసాలు గడిచినా కేంద్రం నుంచి వక్ఫ్బోర్డు విభజనకు కసరత్తు ప్రారంభం కాలేదు. దీంతో ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ వారంక్రితం ఢిల్లీలో కేంద్ర మైనార్టీ వ్యవహారాల మంత్రి నజ్మా హెప్తుల్లాను కలిసి వక్ఫ్బోర్డు విభజనను త్వరతగతిన పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ నెలాఖరులోగా ప్రక్రియ పూర్తి చేసేందుకు 18న కేంద్రం బృందాన్ని హైదరాబాద్కు పంపిస్తామని కేంద్రమంత్రి హామీ ఇచ్చారు. అందులో భాగాంగానే కేంద్ర బృందం హైదరాబాద్కు చేరుకుంది. బుధవారం సచివాలయంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్యదర్శులు, మైనార్టీ సంక్షేమ శాఖల కార్యదర్శులు, డెరైక్టర్లు,వక్ఫ్బోర్డు ముఖ్య కార్యదర్శి, ఇతర ఉన్నతాధికారులు తదితరులతో సమావేశమై వక్ఫ్బోర్డు విభజన పై చర్చలు జరుపనుంది. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ 58, తెలంగాణ 42 శాతం నిష్పత్తి చొప్పున విభ జన జరగాల్సి ఉంది. 2001 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో 43 లక్షలు, సీమాంధ్రలో 39 లక్షల మంది ఉన్నారు. మొదటి సర్వే కమిషన్ ప్రకారం తెలంగాణలో వక్ఫ్ ఆస్తులు 33, 929, ఆంధ్రప్రదేశ్లో కేవలం 4,600 ఆస్తులు మాత్రమే నమోదై ఉన్నాయి. దీంతో వక్ఫ్బోర్డు విభజన 52:48 ప్రకారం జరగాల్సి ఉంది. రెండు రాష్ట్రాల ఉన్నతాధికారులతో చర్చల అనంతరం కేంద్రానికి నివేదిక అందజేయనుంది. నెలాఖరులోగా బోర్డు విభజనపై నోటిఫికేషన్ విడుదలైతే వచ్చే నెల మొదటి వారంలో విభజన జరిగి కొత్త బోర్డులు ఆవిర్భవించే అవకాశాలు ఉన్నాయి. -
రెండు వారాల్లో ఐఏఎస్ అధికారికి రెండు బదిలీలు
సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ మాయారాంపై మరోసారి బదిలీ వేటు పడింది. రెండు వారాల్లో ఆయనను కేంద్ర ప్రభుత్వం రెండుసార్లు బదిలీ చేసింది. తొలుత ఆర్థిక శాఖ నుంచి పర్యాటక శాఖకు కార్యదర్శిగా ఆయనను బదిలీ చేసిన ప్రభుత్వం, తాజాగా మైనారిటీ వ్యవహారాల శాఖకు పంపింది. ఇది పర్యాటక శాఖ కంటే మరింత తక్కువ స్థాయి పోస్టు అని ఐఏఎస్ అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. 1979 బ్యాచ్కి చెందిన ఐఏఎస్ అధికారి అరవింద్ మాయారాంపై ఎందుకు ఇన్నిసార్లు బదిలీవేటు పడుతోందన్నది మాత్రం ప్రస్తుతానికి అర్థం కాని వ్యవహారంలాగే ఉంది. అయితే.. ఆర్థికశాఖను పూర్తిగా ప్రక్షాళన చేయాలన్న ఉద్దేశంతోనే తొలుత ఈ బదిలీల ప్రక్రియను చేపట్టినట్లు తెలుస్తోంది. -
ఎఫ్డీఐ, ఎఫ్ఐఐ నిర్వచనాలకు కేంద్రం ఓకే
10% మించిన పెట్టుబడులన్నీ ఇక ఎఫ్డీఐలే న్యూఢిల్లీ: లిస్టెడ్ కంపెనీల్లో 10 శాతానికి మించిన విదేశీ పెట్టుబడులన్నిటినీ ఇక ఎఫ్డీఐగా పరిగణించనున్నారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐ), విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్ఐఐ) నిర్వచనాల హేతుబద్దీకరణపై ఆర్థిక కార్యదర్శి అరవింద్ మాయారామ్ సారథ్యంలోని కమిటీ రూపొందించిన నివేదికను ప్రభుత్వం ఆమోదించింది. ఓ కంపెనీలో 10 శాతం కంటే తక్కువగా ఉన్న పెట్టుబడులను కూడా ఎఫ్డీఐగా పరిగణిస్తారు గానీ, తొలి కొనుగోలు చేసిన ఏడాదిలోగా వాటాను 10 శాతానికిపైగా పెంచుకోవాల్సి ఉంటుంది. ఏడాది తర్వాత కూడా వాటా 10 శాతానికి తక్కువగా ఉంటే దాన్ని పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్గా పరిగణిస్తారని కేంద్ర ఆర్థిక శాఖ శనివారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. అన్లిస్టెడ్ కంపెనీల్లో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడి ఎంత ఉన్నా దాన్ని ఎఫ్డీఐగా పరిగణించాలని కూడా కమిటీ సిఫార్సు చేసింది. -
10 శాతం మించిన ...
న్యూఢిల్లీ: భారత్లో విదేశీ పెట్టుబడులకు సంబంధించిన నిబంధనల్లో స్పష్టతనిచ్చేలా ప్రభుత్వ కమిటీ కీలక సూచనలను చేసింది. ఏదైనా లిస్టెడ్ కంపెనీలో 10 శాతానికి మించి ఉన్న విదేశీ పెట్టుబడులను విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి(ఎఫ్డీఐ)గా పరిగణించాలని... అదేవిధంగా ప్రవాసీయుల పెట్టుబడులను(రాబడులను విదేశాలకు తరలించని ప్రాతిపదికన) దేశీ ఇన్వెస్ట్మెంట్గా వ్యవహరించాలని సిఫార్సు చేసింది. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు(ఎఫ్ఐఐ), ఎఫ్డీఐల విషయంలో గందరగోళం లేకుండా వాటి నిర్వచనాలను హేతుబద్దీకరించేందుకు ఆర్థిక శాఖ కార్యదర్శి అరవింద్ మాయారామ్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిటీ ఈ సిఫార్సులు చేసింది. కాగా, అన్లిస్టెడ్ కంపెనీల్లో విదేశీ పెట్టుబడులన్నింటినీ ఎఫ్డీఐగానే పరిగణించాలని ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో పేర్కొంది. 10 శాతం లోపు చేసే పెట్టుబడులను కూడా ఎఫ్డీఐగా అనుమతించొచ్చని, అయితే తొలి పెట్టుబడి నుంచి ఏడాది వ్యవధిలోగా తమ వాటాను 10 శాతం లేదా అంతకుపైగా పెంచుకోవాలన్న షరతు విధించాలని అభిప్రాయపడింది. కాగా, ఈ ఎఫ్డీఐలన్నీ ఆయా రంగాల్లోని పరిమితులకు అనుగుణంగానే ఉండాలని స్పష్టం చేసింది. -
ఇరాక్పై ఆందోళన అక్కర్లేదు
కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి మాయారాం న్యూఢిల్లీ: ఇరాక్ సంక్షోభం వల్ల భారత్కి చమురు సరఫరా సమస్యలేమీ తలెత్తబోవని కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి అరవింద్ మాయారాం తెలిపారు. దీర్ఘకాలికంగా చమురు సరఫరాకు ఢోకా లేకుండా భారత్ తగు చర్యలు తీసుకుంటోందని శనివారం కమోడిటీ మార్కెట్లపై జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మాయారాం తెలిపారు. మరోవైపు, దేశీయంగా ఈసారి వర్షపాతం సాధారణం కన్నా తక్కువగా ఉంటుందన్న అంచనాలపై మరీ ఆందోళన చెందనక్కర్లేదని మాయారాం చెప్పారు. ఒకవేళ వర్షాభావం వల్ల ఆహార ధాన్యాల ఉత్పత్తి తగ్గినా కూడా పరిస్థితిని చక్కదిద్దేందుకు తగినన్ని ఆహార ధాన్యాల నిల్వలు ఉన్నాయన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
హోం ఓటింగ్ పరిశీలన
నిప్పుతో చెలగాటమా!
మాదిగలను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ
‘రాహుల్ పేరు చెబితే ఓట్లు పడవు’
కాంగ్రెస్తోనే అన్నివర్గాలకు సముచిత న్యాయం
హామీలు నెరవేర్చడంలో రేవంత్ విఫలం
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
హామీల అమలులో కాంగ్రెస్ విఫలం
పార్లమెంట్ ఎన్నికలు బహిష్కరిస్తాం..
మూడోసారి మోదీ సర్కారే..
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement