breaking news
Artificial womb
-
కృత్రిమ గర్భాశయం!
ఏపీ సెంట్రల్ డెస్క్: సాంకేతిక విజ్ఞానం కలబోతతో కృత్రిమ మేథస్సు (ఏఐ) ఎప్పటికప్పుడు కొత్త పుంతలు తొక్కుతోంది! సృష్టికి ప్రతిసృష్టి జరుగుతోంది. తాము కోరుకున్న లక్షణాలతో పండంటి బిడ్డకు తల్లిదండ్రులయ్యేలా కృత్రిమ గర్భాశయం తొలిసారిగా ఆవిష్కృతమైంది. జర్మనీకి చెందిన శాస్త్రవేత్త హషీం అల్ ఘైలీ ప్రపంచంలో తొలిసారిగా కృత్రిమ గర్భాశయాన్ని సృష్టించారు.‘ఎక్టో లైఫ్’ అని అని వ్యవహరించే ఈ కృత్రిమ ల్యాబ్ ద్వారా ఏటా 30,000 మంది శిశువులకు పురుడు పోయవచ్చని చెబుతున్నారు. క్షీణిస్తున్న జన సంఖ్యతో సతమతమవుతున్న జపాన్, బల్గేరియా, దక్షిణ కొరియా లాంటి చాలా దేశాలకు ఎక్టో లైఫ్ ద్వారా ప్రయోజనం చేకూరుతుందని చెబుతున్నారు. ఈ దేశాల్లో వృద్ధుల జనాభా గణనీయంగా పెరుగుతుండగా జననాల రేటు చాలా తక్కువగా ఉంది. ‘క్యాన్సర్ తదితర ప్రాణాంతక జబ్బుల కారణంగా గర్భాశయాన్ని శస్త్ర చికిత్స ద్వారా తొలగించిన మహిళలకు ఇది ఎంతో ఉపకరిస్తుంది. ‘ఎక్టో లైఫ్’ అందుబాటులోకి రావడం ద్వారా నెలలు నిండక ముందే శిశువుల జననం, సిజేరియన్ కష్టాలు లాంటివి ఇకపై గత అనుభవాలుగానే మిగలనున్నాయి’ అని హషీం పేర్కొన్నారు. ప్రసూతి మరణాలకు అడ్డుకట్ట ‘ప్రపంచవ్యాప్తంగా ఏటా మూడు లక్షల మందికిపైగా మహిళలు ప్రసూతి సమస్యలతో మరణిస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఎక్టో లైఫ్కృత్రిమ గర్భాశయంతో ఇలాంటి సమస్యలు, శస్త్ర చికిత్స ద్వారా కాన్పులకు తెర దించవచ్చు’అని హషీం తెలిపారు.‘ఏఐ’ పాత్ర ఏమిటంటే..?⇒ శాస్త్రవేత్తలు సృష్టించిన కృత్రిమ గర్భాశయాన్ని నిరంతరం కనిపెట్టుకుంటూ కంటికి రెప్పలా కాపాడేది ‘కృత్రిమ మేథస్సు’ పరిజ్ఞానమే. సరిగ్గా చెప్పాలంటే.. గర్భం దాల్చిన అమ్మ పాత్రను ‘ఏఐ’ పోషిస్తుంది. ⇒ కృత్రిమ గర్భాశయంలోకి పిండాన్ని ప్రవేశపెట్టటానికి ముందే మంచి లక్షణాలున్న జీన్స్ను ఎంపిక చేసుకోవచ్చు. ⇒300 రకాల జీన్స్ నుంచి కళ్ల రంగు, జుత్తు, పొడవు, దేహ దారుఢ్యం, మేధోశక్తిని ల్యాబ్ ⇒ ‘ఎలైట్ ప్యాకేజీ’ ద్వారా ఎంపికకు వీలుంది. ⇒ ఆకర్షణీయమైన లక్షణాలను ఎంపిక చేసుకోవడంతోపాటు జన్యుపరమైన వ్యాధులను వారసత్వంగా మోసుకొచ్చే అవాంఛిత జీన్స్ను తొలగించుకోవడం ద్వారా బిడ్డ సంపూర్ణ ఆరోగ్యంతో జీవించేందుకు దోహదం చేస్తుంది. ⇒ ‘అంటువ్యాధులు (ఇన్ఫెక్షన్లు) సోకకుండా ఆరోగ్యకరమైన వాతావరణంలో పాపాయి పురుడు పోసుకునేలా ఎక్టో లైఫ్ భద్రంగా తనలో దాచుకుంటుంది. దీని ఉపరితలానికి సూక్ష్మ క్రిములు అంటుకోకుండా వీటి ప్యాడ్స్ను రూపొందించాం. ప్రతి పరికరంలోనూ ఏఐతో అనుసంధానించిన సెన్సార్లు ఉంటాయి. బిడ్డ శరీరంలో చోటు చేసుకుంటున్న మార్పులను ఇవి ఎప్పటికప్పుడు పసిగడతాయి. పసిగుడ్డు గుండె కొట్టుకునే వేగం, శరీర ఉష్ణోగ్రత, రక్తపోటు, శ్వాస తీసుకునే రేటు, ఆక్సిజన్ శాచ్యురేషన్ స్థాయిలను ఎప్పటికప్పుడు విశ్లేíÙంచి సమాచారం అందిస్తుంటాయి. అంతేకాకుండా ఏఐ పరిజ్ఞానం బిడ్డ శారీరక లక్షణాలను కూడా గమనిస్తూ ఏవైనా జన్యుపరమైన రుగ్మతలను పసిగడితే వెంటనే తెలియచేస్తుంది’ అని హషీం చెప్పారు. -
కృత్రిమ గర్భసంచులొస్తున్నాయ్!
న్యూయార్క్: నెలలు తిరక్కుండానే పుట్టే పిల్లలు ఎక్కువ కాలం బతకరనేది మనకు తెల్సిందే. అలాంటి వారిని బతికించడం కోసం వైద్యులు వారిని ఇంక్యుబేటర్లలో పెట్టి కుస్తీ పట్టాల్సి వస్తుంది. అయినప్పటికీ కొన్నిసార్లు ఇంక్యుబేటర్లలో పెట్టిన పిల్లలు కూడా మత్యువాత పడతారు. ఇంక్యుబేటర్లలో నెలలు నిండని పసికందులను పెట్టి చికిత్స చేయడం కూడా ఖర్చుతో కూడిన వ్యవహారమే. ప్రపంచం మొత్తంగా పురిట్లోనే మరణిస్తున్న ఇలాంటి శిశువుల సంఖ్యలో ఒక్క భారత దేశంలోనే 35 శాతం మంది మరణిస్తున్నారు. వైద్య విజ్ఞానం ఇంతగా విస్తరించిన నేటి ఆధునిక కాలంలో కూడా ఇలాంటి పరిస్థితికి పరిష్కారం లేదా? పురిట్లోనే పుట్టిన బిడ్డ చనిపోతే భరించలేని ఆ బాధ నుంచి తల్లులను రక్షించేందుకు మార్గం లేదా? మరో మూడేళ్లలో ఈ పరిస్థితికి తప్పకుండా పరిష్కారం లభిస్తుందని వైద్యులు భావిస్తున్నారు. ఇటీవల గొర్రె పిల్లలపై నిర్వహించిన ప్రయోగం విజయవంతం అవడమే అందుకు కారణం. తల్లి గర్భంలో, అంటే ఇక్కడ గొర్రె గర్భసంచిలో ఉండే వాతావరణాన్ని కృత్రిమంగా వైద్యులు ఓ పారదర్శక బ్యాగ్లో సష్టించారు. ఆ బ్యాగ్ను బయోబ్యాగ్ అని పిలుస్తున్నారు. నిర్దిష్ట కాలానికన్నా 105 నుంచి 120 రోజుల ముందు జన్మించిన ఓ ఎనిమిది గొర్రె పిల్లలను ఈ బయోబ్యాగుల్లో పెట్టి వైద్య పరిశోధకులు అధ్యయనం చేశారు. మెల్ల మెల్లగా ఆ గొర్రె పిల్లలు కదలడం, కాళ్లు, చేతులు ఆడించడం, కళ్లు తెరవడం చేశాయి. నాలుగు వారాల అనంతరం వాటిని బ్యాగుల్లో నుంచి తీసి సాధారణ వెంటి లేటర్లలో ఉంచారు. ఆ ఎనిమిది గొర్రె పిల్లలు బతకడం విశేషం. ఈ అధ్యయనం వివరాలను ‘ది వెర్జ్’ అనే సైన్స్ పత్రికలో ప్రచురించారు. ఈ తరహాలోనే స్త్రీల గర్భంలో ఉండే వాతావరణాన్ని కత్రిమంగా సష్టించే మానవ బయోబ్యాగ్ను అభివద్ధి చేయవచ్చని వైద్యులు అభిప్రాయానికి వచ్చారు. ఈ బ్యాగులు అందుబాటులోకి రావడానికి మరో మూడేళ్లు పట్టవచ్చని వారు అంచనా వేస్తున్నారు. అలా అని స్త్రీల అవసరం లేకుండానే పిల్లలను కనవచ్చు అనుకోవడం అది సైన్స్ ఫిక్షన్ సినిమా అవుతుంది తప్ప, నిజం కాదని ఫిలడెల్ఫియా పిల్లల ఆస్పత్రిలో గర్భస్త్ర పిండాలకు చికిత్సచేసే డాక్టర్ అలెన్ ఫ్లేక్ వ్యాఖ్యానించారు. -
కత్రిమ గర్భసంచులొస్తున్నాయ్!