breaking news
Annabel Sutherland
-
కివీస్ బ్యాటర్ వన్మ్యాన్ షో.. బట్లర్ సేనదే హండ్రెడ్ టైటిల్
హండ్రెడ్ మెన్స్ కాంపిటీషన్ 2026 విజేతగా మాంచెస్టర్ సూపర్జెయింట్స్ నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్ పోరులో ట్రెంట్ రాకెట్స్పై 5 వికెట్ల తేడాతో మాంచెస్టర్ సూపర్జెయింట్స్ విజయం సాధించింది. టిమ్ సీఫెర్ట్ విధ్వంసంతో టార్గెట్ను ఈజీగా అందుకున్న సూపర్జెయింట్స్ టైటిల్ను సొంతం చేసుకుంది. 159 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సూపర్జెయింట్స్ 98 బంతుల్లోనే 5 వికెట్లు కోల్పోయి టార్గెట్ను అందుకుంది. టిమ్ సీఫెర్ట్ (38 బంతుల్లో 72; 4 ఫోర్లు, 7 సిక్సర్లు) సంచలన ఇన్నింగ్స్ ఆడగా, చివర్లో లూస్ డు ప్లూయ్ (27 నాటౌట్), కెప్టెన్ జాస్ బట్లర్ (23) రాణించారు. ట్రెంట్ రాకెట్స్ బౌలర్లలో మొహమ్మద్ ఆమిర్ 3 వికెట్లు తీయగా, క్లావిన్ హారిసన్ 2 వికెట్లు పడగొట్టాడు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ట్రెంట్ రాకెట్స్ 100 బంతుల్లో 8 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. అనెరిన్ డొనాల్డ్ (38) టాప్ స్కోరర్గా నిలవగా, లూయిస్ జార్జరీ (32), బెన్ డకెట్ (31) పర్వాలేదనిపించారు. సూపర్జెయింట్స్ బౌలర్లలో నూర్ అమ్మద్ 3 వికెట్లు తీయగా, సొన్ని బేకర్ 2 వికెట్లు పడగొట్టాడు. హాఫ్ సెంచరీతో అదరగొట్టిన టిమ్ సీఫెర్ట్ 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'తో పాటు 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ' (394 పరుగులు) సొంతం చేసుకున్నాడు. ఇక బట్లర్ సేనకు ఇదే తొలి హండ్రెడ్ టైటిల్ కావడం విశేషం. అంతేకాదు హండ్రెడ్ చరిత్రలో ఐదు ఫిఫ్టీలో బాదిన తొలి క్రికెటర్గా టిమ్ సీఫెర్ట్ రికార్డులకెక్కాడు.ట్రెంట్ రాకెట్స్కు మెయిడెన్ టైటిల్మరోవైపు హండ్రెడ్ వుమెన్స్ విజేతగా ట్రెంట్ రాకెట్స్ నిలిచింది. సన్రైజర్స్ లీడ్స్ వుమెన్తో జరిగిన ఫైనల్లో ట్రెంట్ రాకెట్స్ 8 వికెట్ల తేడాతో నెగ్గి తొలిసారి చాంపియన్స్గా నిలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ లీడ్స్ 91 పరుగులకే కుప్పకూలింది. అనాబెల్ సదర్లాండ్ (25 పరుగులు) టాప్ స్కోరర్గా నిలవగా, డాని గిబ్సన్ 22 పరుగులతో పర్వాలేదనిపించింది. ట్రెంట్ బౌలర్లలో కిమ్ గార్త్, సమంతా బేట్స్, చార్లీ ఫిలిప్స్, జార్జియా ఆడమ్స్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం ట్రెంట్ రాకెట్స్ మరో 46 బంతులు మిగిలి ఉండగానే రెండు వికెట్లు కోల్పోయి 92 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. ఓపెనర్లు సోఫియా డంక్లే (41) రాణించగా.. బెత్ మూనీ (31 నాటౌట్) ఆఖరి వరకు నిలిచి జట్టును గెలిపించింది. జార్జియా ఆడమ్స్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, అన్నాబెల్ సదర్లాండ్ (315 పరుగులు, 11 వికెట్లు) ప్లేయర్ ఆఫ్ సిరీస్ అవార్డు గెలుచుకున్నారు.We were all Jos Buttler watching that finish 🫣#TheHundredFinal pic.twitter.com/w06H16zE0z— The Hundred (@thehundred) August 16, 2026Five fifties in 10 innings for Tim Seifert in this year's Hundred 🔥pic.twitter.com/XFTJa0GeZV— Cricinfo (@cricinfo) August 16, 2026చదవండి: 'సాకులు వెతుక్కోను.. మా ఓటమికి కారణమదే' -
ఎలిమినేటర్ ముంగిట సన్రైజర్స్ విధ్వంసం
హండ్రెడ్ వుమెన్స్ కాంపిటీషన్లో సన్రైజర్స్ లీడ్స్ జట్టు ఐదో విజయంతో పట్టికలో రెండో స్థానానికి చేరుకొని ఎలిమినేటర్ పోరుకు మరింత దగ్గరైంది. మంగళవారం రాత్రి మాంచెస్టర్ సూపర్జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ లీడ్స్ వుమెన్ 41 పరుగులతో విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ 100 బంతుల్లో 4 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. మిడిలార్డర్ బ్యాటర్ అన్నాబెల్ సదర్లాండ్ (36 బంతుల్లో 62 నాటౌట్, 6 ఫోర్లు, 3 సిక్సర్లు), కెప్టెన్ డాని గిబ్సన్ (13 బంతుల్లో 24) రాణించడంతో సన్రైజర్స్ భారీ స్కోరు చేసింది. సూపర్జెయింట్స్ బౌలర్లలో మాడీ విల్లర్స్ 2 వికెట్లు తీసింది. అనంతరం మాంచెస్టర్ సూపర్జెయింట్స్ 100 బంతుల్లో 8 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసి ఓటమిపాలైంది. ఓపెనర్లు స్మృతి మంధాన (17 బంతుల్లో 28), గ్రేస్ స్క్రీవెన్స్ (24 బంతుల్లో 31) మినహా మిగతావారంతా విఫలమయ్యారు. సన్రైజర్స్ బౌలర్లలో జొనాసన్ 3 వికెట్లు తీయగా, దీప్తి శర్మ, అన్నాబెల్ సదర్లాండ్ రెండు వికెట్లు పడగొట్టారు. ఆల్రౌండ్ ప్రదర్శన కనబరిచిన అన్నాబెల్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు గెలుచుకుంది.Annabel Sutherland just smashed THREE sixes in a row off the final three balls of the innings 🤯That was special. #TheHundred | #RoadToTheEliminator pic.twitter.com/oQ9EswA72z— The Hundred (@thehundred) August 11, 2026Smriti Mandhana is on the charge 💥Watch the #RoadToTheEliminator action LIVE on Sky Sports Main Event, Sky Sports Cricket and YouTube 📺#TheHundred pic.twitter.com/VDCdJJu8sk— The Hundred (@thehundred) August 11, 2026చదవండి: తొలి టెస్టుకు వర్షం ముప్పు.. గాలే చేరుకున్న టీమిండియా -
IND v AUS: భారత్ ఆలౌట్.. ఆసీస్ స్కోరెంతంటే?
ఆస్ట్రేలియాతో ఏకైక టెస్టులో భారత మహిళా జట్టు మొదటి రోజు తడబడింది. తొలి ఇన్నింగ్స్లో నామమాత్రపు స్కోరుకే ఆలౌట్ అయింది. ఆసీస్ వుమెన్ టీమ్తో మూడు టీ20, మూడు వన్డేలు.. ఒక టెస్టు ఆడేందుకు హర్మన్ సేన ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే.టాస్ గెలిచిన ఆస్ట్రేలియాటీ20 సిరీస్ను భారత్ 2-1తో దక్కించుకోగా.. వన్డే సిరీస్ను ఆసీస్ 3-0తో క్లీన్స్వీప్ చేసింది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య శుక్రవారం డే- నైట్ టెస్టు మ్యాచ్ మొదలైంది. పెర్త్లోని WACA స్టేడియం వేదికగా టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది.ఫలితంగా బ్యాటింగ్కు దిగిన భారత్కు ఆదిలోనే దెబ్బ తగిలింది. ఓపెనర్ స్మృతి మంధాన (Smriti Mandhana) నాలుగు పరుగులకే వెనుదిరిగింది. లూసీ హోమిల్టన్ బౌలింగ్లో బౌల్డ్ అయి పెవిలియన్ చేరింది. వన్డౌన్లో వచ్చిన ప్రతికా రావల్ (18) సైతం నిరాశపరిచింది.హాఫ్ సెంచరీతో రాణించిన జెమీమాఇక మరో ఓపెనర్ షఫాలీ వర్మ 35 పరుగులతో ఫర్వాలేదనిపించగా.. నాలుగో నంబర్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ (Jemimah Rodrigues) అర్ధ శతకం (84 బంతుల్లో 52, 7 ఫోర్లు)తో రాణించింది. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (19) విఫలం కాగా.. లోయర్ ఆర్డర్లో కశ్వీ గౌతం (34 నాటౌట్) మెరుగైన బ్యాటింగ్తో ఆకట్టుకుంది.మిగిలిన వారంతా పెవిలియన్కు క్యూ కట్టారు. దీప్తి శర్మ (7), రిచా ఘోష్ (11), స్నేహ్ రాణా (5), సయాలీ సత్గరే (7), క్రాంతి గాడ్ (1) ఇలా వచ్చి అలా వెళ్లారు. ఫలితంగా భారత్ 62.4 ఓవర్లలో 198 పరుగులు చేసి ఆలౌట్ అయింది.అనాబెల్కు నాలుగు వికెట్లుఆసీస్ బౌలర్లలో అనాబెల్ సదర్లాండ్ నాలుగు వికెట్లతో చెలరేగి భారత బ్యాటింగ్ ఆర్డర్ను కుదేలు చేయగా.. లూసీ హోమిల్టన్ మూడు వికెట్లు పడగొట్టింది. డార్సీ బ్రౌన్ రెండు, ఆష్లే గార్డ్నర్ ఒక వికెట్ దక్కించుకున్నారు.ఇక తొలి రోజే బ్యాటింగ్ మొదలుపెట్టిన ఆసీస్కు భారత బౌలర్లు ఆరంభంలోనే షాకిచ్చారు. ఓపెనర్లలో జార్జియా వోల్ (2)ను సయాలీ బౌల్డ్ చేయగా.. ఫోబే లిచిఫీల్డ్ (9)ను క్రాంతి గాడ్ పెవిలియన్కు పంపింది. కెప్టెన్ అలెసా హీలీ (13) వికెట్ను సయాలీ తన ఖాతాలో వేసుకోగా.. ఎలిస్ పెర్రీ, అనాబెల్ పట్టుదలగా నిలబడ్డారు.నిలకడగా పెర్రీ, అనాబెల్శుక్రవారం నాటి మొదటిరోజు ఆట పూర్తయ్యేసరికి ఎలిస్ పెర్రీ 62 బంతుల్లో 43, అనాబెల్ 29 బంతుల్లో 20 పరుగులతో క్రీజులో నిలిచారు. మొత్తంగా ఆసీస్ 27 ఓవర్ల ఆట పూర్తి చేసుకుని మూడు వికెట్ల నష్టానికి 96 పరుగులు చేసింది. ఫలితంగా తొలి ఇన్నింగ్స్లో భారత్ కంటే ఆసీస్ 102 పరుగులు వెనుకబడి ఉంది. అయితే, ఓవరాల్గా తొలి రోజు ఆసీస్దే పైచేయి అని చెప్పవచ్చు. చదవండి: T20 WC: అతడి వల్లే ఇదంతా.. మా కొంప మునిగింది అక్కడే: మెకల్లమ్ -
ICC rankings: దీప్తీ శర్మకు భారీ షాక్
ఐసీసీ మహిళల టీ20 బౌలింగ్ ర్యాంకింగ్స్లో ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ అన్నాబెల్ సదర్లాండ్ తిరిగి అగ్రపీఠాన్ని అధిరోహించింది. తాజాగా ప్రకటించిన ర్యాంకింగ్స్లో భారత్ స్టార్ ఆల్రౌండర్ దీప్తీ శర్మను వెనక్కి నెట్టి నంబర్ వన్ స్దానాన్ని సదర్లాండ్ కైవసం చేసుకుంది.సదర్లాండ్ 736 పాయింట్లతో టాప్ ర్యాంక్లో కొనసాగుతుండగా.. దీప్తీ శర్మ(735) రెండో స్ధానంలో ఉంది. దీప్తీకి ఆసీస్ ప్లేయర్కు కేవలం ఒక్క పాయింట్ మాత్రమే తేడా ఉంది. ఇటీవల శ్రీలంక మహిళలతో జరిగిన టీ20 సిరీస్లో శర్మ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయకపోవడంతో తన టాప్ ర్యాంక్ను కోల్పోవల్సి వచ్చింది. ఈ ఐదు మ్యాచ్ల సిరీస్లో ఆమె కేవలం 5 వికెట్లు మాత్రమే పడగొట్టింది. మరోవైపు, భారత బౌలర్లు రేణుకా సింగ్ ఠాకూర్ ఐదు స్థానాలు దిగజారి 11వ స్థానానికి, రాధా యాదవ్ రెండు స్థానాలు తగ్గి 18వ స్థానానికి పడిపోయారు.ఇక బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో మాత్రం మన అమ్మాయిలు అదరగొట్టారు. శ్రీలంకతో సిరీస్లో దుమ్ములేపిన భారత కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ రెండు స్థానాలు ఎగబాకి 13వ ర్యాంక్కు చేరుకుంది. ఈ సిరీస్లో వరుసగా మూడు హాఫ్ సెంచరీలు బాదిన షఫాలీ తన 6వ స్ధానాన్ని మరింత పదిలం చేసుకుంది. ఆల్రౌండర్ల ర్యాంకింగ్స్లో హైదరాబాద్ క్రికెటర్ అరుంధతీ రెడ్డి సత్తాచాటింది. ఆల్ రౌండర్ల జాబితాలో ఆమె ఏకంగా 44 స్థానాలు ఎగబాకి 21వ స్థానానికి చేరుకుంది.చదవండి: ఆ ముగ్గురిని చూస్తుంటే..: కోహ్లిపై భారత మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు -
‘ఆర్సీబీ’కి దెబ్బే.. ఆ ప్లేయర్కు ఎవరూ సాటిరారు!
వుమెన్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)-2026లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)కి చిక్కులు తప్పవని భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా అన్నాడు. ఎలిస్ పెర్రీ లేనిలోటును ఎవరూ భర్తీ చేయలేరని పేర్కొన్నాడు. కాగా డబ్ల్యూపీఎల్ తాజా సీజన్ ఆరంభానికి ముందే ఆర్సీబీ కీలక ప్లేయర్ సేవలు కోల్పోయింది. వ్యక్తిగత కారణాలతో ఈ ఎడిషన్ నుంచి పూర్తిగా తప్పుకొంటున్న ఆస్ట్రేలియా స్టార్ పెర్రీ ప్రకటించింది.అత్యధిక పరుగులుగత మూడు సీజన్లుగా తమతోనే కొనసాగుతున్న పెర్రీని ఆర్సీబీ.. ఈ ఏడాది రూ.2 కోట్లతో జట్టు అట్టి పెట్టుకుంది. గతేడాది (2024) జట్టు టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన ఆమె (972)...లీగ్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ల జాబితాలో రెండో స్థానంలో ఉంది. అయితే, తాజా ఎడిషన్కు ఆమె దూరం కావడంతో.. భారత యువ క్రీడాకారిణి సయాలీ సత్గరేను ఆర్సీబీ జట్టులోకి తీసుకుంది.ఇక గతంలో గుజరాత్ జెయింట్స్ తరఫున రెండు సీజన్లలో కలిపి 4 మ్యాచ్లు ఆడిన సయాలీ.. 20 పరుగులు చేయగలిగింది. తాజాగా పెర్రీ స్థానంలో.. కనీస ధర రూ.30 లక్షలకు సయాలీని ఈసారి ఆర్సీబీ ఎంచుకుంది. సదర్లాండ్ కూడామరోవైపు.. ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్, ఆస్ట్రేలియాకే చెందిన అనాబెల్ సదర్లాండ్ కూడా వ్యక్తిగత కారణాలతోనే లీగ్కు దూరమైంది. ఒక ఏడాది గుజరాత్ జట్టు తరఫున ఆడిన సదర్లాండ్ గత రెండు సీజన్లుగా ఢిల్లీతోనే ఉంది.ఈ ఏడాది రూ.2.20 కోట్లకు ఆమెను ఢిల్లీ కొనసాగించింది. సదర్లాండ్ స్థానంలో ఆసీస్ లెగ్స్పిన్నర్ అలానా కింగ్ను క్యాపిటల్స్ తీసుకుంది. కింగ్ గత ఏడాది యూపీ వారియర్స్ తరఫున ఒకే ఒక డబ్ల్యూపీఎల్ మ్యాచ్ ఆడింది. ఈ నేపథ్యంలో కామెంటేటర్ ఆకాశ్ చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.ఆ ప్లేయర్కు ఎవరూ సాటిరారు!‘‘ఈసారి ఎలిస్ పెర్రీ రావడం లేదు. అనాబెల్ సదర్లాండ్ కూడా ఈ సీజన్ ఆడటం లేదు. దీంతో ఆర్సీబీ, ఢిల్లీలకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆర్సీబీ ఈసారి ఫేవరెట్గా ఉంది.కానీ ఎలిస్ పెర్రీ లేకపోవడం వారి గెలుపు అవకాశాలపై కచ్చితంగా ప్రభావం చూపుతుంది. పెర్రీ స్థానంలో ఆర్సీబీ సయాలీ సత్గరేను తీసుకువచ్చింది. వీరి స్కిల్ సెట్ ఒకటే కావొచ్చు.. కానీ సయాలీ.. పెర్రీ స్థానాన్ని భర్తీ చేయలేదు. నైపుణ్యాల పరంగా ఎలిస్ పెర్రీకి సయాలీ దరిదాపుల్లోకి కూడా రాలేదు’’ అని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు.అదే విధంగా.. అనాబెల్ స్థానంలో అలనా సరైన ప్లేయర్ కాదని ఈ మాజీ క్రికెటర్ అభిప్రాయపడ్డాడు. అనాబెల్ మీడియం పేస్ బౌలింగ్తో పాటు బ్యాటింగ్ చేయగలదన్న ఆకాశ్ చోప్రా.. అలనా మంచి స్పిన్నర్ మాత్రమే అని.. బ్యాటింగ్ పరంగా ఆమె పెద్దగా ఆకట్టుకోలేదని పేర్కొన్నాడు.తారా నోరిస్ దూరంఇదిలా ఉంటే.. యూపీ వారియర్స్ జట్టు సభ్యురాలు తారా నోరిస్ కూడా లీగ్కు దూరమైంది. టీ20 వరల్డ్ కప్ క్వాలిఫయర్స్లో తన జట్టు అమెరికా తరఫున బరిలోకి దిగేందుకు నోరిస్ ఈ నిర్ణయం తీసుకుంది. నోరిస్ స్థానంలో ఆస్ట్రేలియా ఆల్రౌండర్ చార్లీ నాట్ను వారియర్స్ జట్టులోకి ఎంచుకుంది. నాట్ గతంలో ఎప్పుడూ డబ్ల్యూపీఎల్ ఆడలేదు. చదవండి: బీసీసీఐ యూటర్న్!.. షమీకి గోల్డెన్ ఛాన్స్!


