breaking news
Anantababu
-
ఎమ్మెల్సీ అనంతబాబుకు మధ్యంతర బెయిల్
ఢిల్లీ:డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ అనంతబాబుకు బెయిల్ మంజూరైంది. అనంతబాబుకు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అనంతబాబు.. మే నెలాఖరు నుంచి రిమాండ్లో ఉన్న సంగతి తెలిసిందే. -
అనంతబాబు డిఫాల్ట్ బెయిల్ పిటిషన్పై తీర్పు రిజర్వ్
సాక్షి, అమరావతి: డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో డిఫాల్ట్ బెయిల్ కోరుతూ ఎమ్మెల్సీ అనంతబాబు దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ చీమలపాటి రవి తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించారు. పోలీసులు 90 రోజుల్లో చార్జిషీట్ దాఖలు చేయనందున డిఫాల్ట్ బెయిల్ ఇవ్వాలంటూ అనంతబాబు దాఖలు చేసిన ఈ వ్యాజ్యంపై జస్టిస్ రవి బుధవారం విచారణ జరిపారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది కలిగినీడి చిదంబరం వాదనలు వినిపిస్తూ.. 90 రోజులకు రెండు రోజుల ముందు పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారని, సాంకేతిక కారణాలతో కోర్టు దానిని తిరస్కరించిందని తెలిపారు. ఇది అసంపూర్ణ చార్జిషీట్ కిందకే వస్తుందని, అందువల్ల డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేయాలని కోరారు. పోలీసుల తరఫున అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ దుష్యంత్రెడ్డి వాదనలు వినిపిస్తూ.. చార్జిషీట్లో లోపాలున్నాయని కోర్టు తిరస్కరించిందని, వాటిని సవరించి తిరిగి దాఖలు చేశామన్నారు. గడువులోపు దాఖలు చేసిన చార్జిషీట్ను సాంకేతిక కారణాలతో కోర్టు తిరస్కరిస్తే, దానిని సకాలంలో దాఖలు చేసినట్లుగానే భావించాలన్నారు. ఈ కేసులో ఫోరెన్సిక్ నివేదికలు అందాల్సి ఉందన్నారు. ఈ కేసులో తాను ఎవరినీ సమర్థిస్తూ వాదనలు చెప్పడంలేదని, కోర్టుకు సహాయకారిగా వ్యవహరిస్తున్నానని న్యాయమూర్తి ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. నేరచరిత్రను పరిగణనలోకి తీసుకోండి అనంతబాబు బెయిల్ పిటిషన్ను వ్యతిరేకిస్తూ డ్రైవర్ సుబ్రహ్మణ్యం తల్లి నూకరత్నం ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేయగా, ఆమె తరఫున సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. అనంతబాబుకు నేర చరిత్ర ఉందన్నారు. పోలీసులు గడువు లోపే చార్జిషీట్ దాఖలు చేశారని తెలిపారు. అందరి వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇదే కేసులో రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలంటూ అనంతబాబు దాఖలు చేసిన మరో పిటిషన్పై తదుపరి విచారణను ఈ నెల 22కి వాయిదా వేశారు. -
బెయిల్పై అనంతబాబు విడుదల
విశాఖపట్నం :వైఎస్సార్ కాంగ్రెస్ తూర్పు గోదావరి జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు అనంత ఉదయభాస్కర్ శనివారం బెయిల్పై విడుదలయ్యారు. అరకు ఎంపీ కొత్తపల్లి గీత ఫిర్యాదుతో ఉదయభాస్కర్ను అరెస్టు చేసి, రిమాండ్ ఖైదీగా విశాఖ కేంద్ర కారాగారానికి తరలించిన విషయం తెలిసిందే. రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి, ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు, తూర్పు గోదావరి జిల్లా పరిషత్ ప్రతిపక్షనేత జ్యోతుల నవీన్కుమార్, పార్టీ అధికార ప్రతినిధి కొమ్మిశెట్టి బాలకృష్ణ, వాణిజ్య విభాగం కన్వీనర్ కర్రి పాపారాయుడు, రాష్ట్ర యువజన విభాగం సభ్యుడు వాసిరెడ్డి జమీలు జైలు వద్ద ఉదయభాస్కర్కు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ఉదయభాస్కర్పై అక్రమ కేసులు బనాయించారన్నారు. పోలీసు అధికారులు సమగ్ర దర్యాప్తు జరిపి న్యాయం చేయాలని కోరారు.