breaking news
agreed
-
‘అందుకు ఇజ్రాయెల్ ఓకే’: గాజాలో కాల్పుల విరమణపై ట్రంప్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ఇజ్రాయెల్-గాజా యుద్ధంపై ఆసక్తిరక ప్రకటన చేశారు. ఇరాన్ మద్దతు కలిగిన హమాస్ ఉగ్రవాదులు.. గాజాలో ఇజ్రాయెల్తో 60 రోజుల కాల్పుల విరమణకు తుది ప్రతిపాదనకు అంగీకరించాలని కోరారు. దీనికి సంబంధించిన పత్రాలను ఖతార్- ఈజిప్ట్కు మధ్యవర్తిత్వం వహించే అధికారులు అందిస్తారని తెలిపారు. ట్రంప్ తన సోషల్ మీడియా పోస్ట్లో తమ ప్రతినిధులు గాజా విషయమై ఇజ్రాయెల్ అధికారులతో సుదీర్ఘమైన సమావేశాన్ని నిర్వహించారని తెలిపారు. అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్, విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తదితరులు ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు సీనియర్ సలహాదారు రాన్ డెర్మెర్తో సమావేశమయ్యారని సమాచారం. కాగా 60 రోజుల కాల్పుల విరమణను ఖరారు చేసేందుకు రూపొందించిన షరతులను ఇజ్రాయెల్ అంగీకరించిందని, తాము ఈ యుద్ధాన్ని ముగించడానికి అన్ని పార్టీలతో కలిసి పని చేస్తామని ట్రంప్ పేర్కొన్నారు. ఖతార్, ఈజిప్ట్ ప్రతినిధులు హమాస్కు ఈ తుది ప్రతిపాదనను అందజేస్తారని ట్రంప్ పేర్కొన్నారు.మిడిల్ ఈస్ట్లో మంచి జరిగేందుకు హమాస్ ఈ ఒప్పందాన్ని అంగీకరిస్తుందని భావిస్తున్నానని, దీనికి సమ్మతించని పక్షంలో పరిస్థితులు మరింత దిగజారవచ్చని ట్రంప్ వ్యాఖ్యానించారు. గాజాలో ఇజ్రాయెల్.. హమాస్ ఉగ్రవాదుల మధ్య బందీల విడుదల కోసం ఈ కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని ట్రంప్ పేర్కొన్నారు. ఇజ్రాయెల్ తెలిపిన వివరాల ప్రకారం 2023 అక్టోబర్ 7న హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్పై దాడి చేసి 1,200 మందిని హత్యచేసి, 251 మందిని బందీలుగా పట్టకున్న దరమిల గాజాలో యుద్ధం ప్రారంభమైంది.ఇది కూడా చదవండి: ‘పహల్గామ్’ ముష్కరులపై తక్షణ చర్యలకు ‘క్వాడ్’ డిమాండ్ -
ఇసుక పాలసీకి ఏపీ కేబినేట్ ఆమోదం
-
టాటా, డొకోమో వివాదానికి ముగింపు
న్యూఢిల్లీ: ప్రముఖ వ్యాపారసంస్థ టాటా గ్రూప్ మేజర్ ఆపరేటింగ్ ప్రమోటర్ టాటా సన్స్ లిమిటెడ్, జపాన్కు చెందిన టెలికాం కంపెనీ నిప్పాన్ టెలిగ్రాఫ్ అండ్ టెలిఫోన్ కార్పొరేషన్ (ఎన్టీటీ) డొకోమో మధ్య వివాదపరిష్కారానికి ఎట్టకేలకు ముగింపు పడింది. టాటా టెలీసర్వీసెస్, డొకొమో సేవల నేపథ్యంలో ఏర్పడ్డ వివాదాన్ని పరిష్కరించుకునేందుకు టాటా సన్స్, ఎన్టీటీ డొకోమో ఒక అంగీకారానికి వచ్చాయి. ఎన్టీటీ కోరుతున్న పూర్తిస్థాయి నష్టపరిహార మొత్తాన్ని చెల్లించేందుకు ప్రమోటర్ టాటా సన్స్ అంగీకరించింది. 1.17బిలియన్ డాలర్లను చెల్లించేందుకు టాటాగ్రూప్ అంగీకరించడంతో ఈ వివాదం పరిష్కారమైంది. దీంతో సుమారు రెండు సంవత్సరాలకుపైగా సాగుతున్న వివాదాన్ని ముగిసినట్టయింది. తమ మధ్య వివాదాన్ని ముగింపు పలకనున్నట్టు ఇరు సంస్థలు మంగళవారం ఢిల్లీ హైకోర్టుకు నివేదించారు. ఈ మేరకు డొకోమోపై ఢిల్లీ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ను ఉపసంహరించుకునేందుకు టాటా సన్స్ అంగీకరించింది. మార్చి 8 దీనికి సంబంధించిన అప్లికేషన్ ను కోర్టు పరిశీలించనుంది. దీంతోపాటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జోక్యానికి వ్యతిరేకంగా తాము ఈ నిర్ణయం తీసుకోలేదని ఇరు సంస్థలు స్పష్టం చేశాయి. గత సంవత్సరం టాటా సన్స్ ఛైర్మన్ గా సైరస్ మిస్త్రీ ఉద్వాసన తరువాత, డొకొమొ వివాదం పరిష్కారం చర్చలను పునఃప్రారంచింది టాటా గ్రూపు. అయితే విదేశీ పెట్టుబడి నిబంధనలు ఉల్లంఘించినట్లు అవుతుందనే సంకేతాలను కేంద్రబ్యాంకు వెల్లడించింది. మరోవైపు ఈ వార్తలతో టాటా టెలీ సర్వీసెస్ కౌంటర్కు మార్కెట్లో డిమాండ్ పుట్టింది. ట్రేడర్ల కొనుగోళ్లతో దాదాపు 9 శాతం లాభాలతో కొనసాగుతోంది. టాటా సన్స్ తో కలసి టాటా టెలి సర్వీసెస్ లో వాటాల బదలీపై ముందు చేసుకున్న ఒప్పందాన్ని టాటా సన్స్ పాటించలేదని డొకోమో ఆరోపించింది ఈ వివాదంలో మధ్యవర్తిత్వం కోరుతూ డొకోమో లండన్లోని కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో ఈ వివాదంలో సుమారు ఎనిమిదివేల కోట్ల రూపాయల భారీ జరిమానా చెల్లించాలని కోర్టు తీర్పుచెప్పింది. డొకొమోతో చేసుకున్న ఒప్పందాన్ని బేఖాతరు చేశారని ఆరోపణలపై 1.17 బిలియన్ డాలర్ల నష్టపరిహారాన్ని చెల్లించాలని లండన్ లోని అంతర్జాతీయ వివాదాల పరిష్కారాల కోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే.