-
వామ్మో! ఏకంగా.. లారీ పై.. ఎక్కిన విమానం..!
మహబూబ్నగర్: సాధారణంగా విమానం ఆకాశంలో ఎగురుతుంది.. లేకపోతే విమానాశ్రయంలో ఆగుతుంది. కానీ, ఓ విమానం లారీపై ప్రయాణించడంతో ప్రజలు ఆశ్చర్యంగా చూశారు. ఆదివారం హైదరాబాద్ వైపు నుంచి విమానం తీసుకెళ్తున్న ఓ లారీ జోగుళాంబ గద్వాల జిల్లా పుల్లూరు టోల్ప్లాజా వద్ద ఆగింది. దీంతో వాహనదారులు, ప్రయాణికులు రెక్కలు లేని విమానాన్ని ఆసక్తిగా గమనించారు. కర్నూలులో హోటల్ నిర్వహణ కోసం ఈ విమానాన్ని ఢిల్లీ నుంచి తీసుకెళ్తున్నట్లు తెలిసింది. -
హైవేపై విమానాల ల్యాండింగ్ ట్రయల్ రన్
జే.పంగులూరు: విజయవాడ–ఒంగోలు మధ్యనున్న జాతీయ రహదారిపై గురువారం విమానాల ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. అత్యవసర సమయాల్లో విమానాలు దిగేందుకు వీలుగా.. ఇప్పటికే జాతీయ రహదారిపై రెండు ప్రాంతాల్లో రన్వేలు నిర్మించారు. వరదలు, భూకంపాలు, ప్రకృతి విపత్తులతో పాటు అత్యవసర పరిస్థితుల్లో యుద్ధ విమానాలు సైతం క్షేమంగా నేలపైకి దిగడానికి వీలుగా రన్వేలను ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా 19 చోట్ల అత్యవసర ల్యాండింగ్ కోసం ఏర్పాట్లు చేయగా.. రాష్ట్రంలో ప్రకాశం జిల్లా సింగరాయకొండ–కలికివాయి, బాపట్ల జిల్లా రేణింగవరం–కొరిశపాడు మధ్య హైవే మీద రన్వేలు సిద్ధం చేస్తున్నారు. రేణింగవరం–కొరిశపాడు మధ్య 4 కిలోమీటర్ల మేర ఏర్పాటు చేసిన రన్వేపై గురువారం ఉదయం 11 గంటలకు కార్గో, ఫైటర్ జెట్ విమానాలు దిగనున్నాయి. ఇందుకోసం సంబంధిత అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వైమానిక దళ సిబ్బంది విమానాలు దిగే ప్రాంతాన్ని పరిశీలించారు. అవసరమైన యంత్రాలను ఏర్పాటు చేశారు. ట్రయల్ రన్ సందర్భంగా ట్రాఫిక్ను మళ్లించనున్నారు. రన్వే కోసం తారు రోడ్డును నాలుగు కిలోమీటర్ల పరిధిలో 6 మీటర్ల మేర తవ్వి.. నాలుగు లేయర్లుగా సిమెంట్ రోడ్డు వేశారు. డివైడర్లను, చుట్టుపక్కల ఉన్న చెట్లను, విద్యుత్ తీగలను తొలగించారు. -
ల్యాండింగ్ చేస్తూ ఢీ కొట్టిన రెండు విమానాలు
వాషింగ్టన్: ఎయిర్పోర్ట్లో ల్యాండింగ్ చేసే సమయంలో రెండు మినీ విమానాలు ఢీకొని ఘోర ప్రమాదం జరిగింది. అమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగిన దుర్ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. వాట్సోన్విల్లే నగరంలోని స్థానిక విమానాశ్రయంలో రెండు విమానాలు ల్యాండింగ్ చేసేందుకు ప్రయత్నించగా ఈ ప్రమాదం జరిగినట్లు చెప్పారు. ‘వాట్సోన్విల్లే మున్సిపల్ ఎయిర్పోర్ట్లో 2 విమానాలు ల్యాండింగ్ చేసే ప్రయత్నంలో ఢీకొన్నాయి. ఈ సంఘటనపై పలు ఏజెన్సీలు సత్వరం స్పందించాయి. పలువురు ప్రాణాలు కోల్పోయినట్లు మాకు సమాచారం ఉంది.’ అని ట్విట్టర్లో పేర్కొన్నారు స్థానిక అధికారులు. ఈ ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. మరోవైపు.. ఫెడరల్ ఏవియేషన్ ప్రకారం.. ట్విన్ ఇంజిన్ సెస్నా 340 విమానంలో ఇద్దరు, సింగిల్ ఇంజిన్ సెస్నా152 విమానంలో పైలట్ ఉన్నారు. ఎవరైనా ప్రాణాలతో బయటపడ్డారా? అనే విషయం తెలియరాలేదని పేర్కొంది ఎఫ్ఏఏ. Multiple agencies responded to Watsonville Municipal Airport after 2 planes attempting to land collided. We have reports of multiple fatalities. Report came in at 2:56pm. Investigation is underway, updates to follow. pic.twitter.com/pltHIAyw5p — City of Watsonville (@WatsonvilleCity) August 18, 2022 ఇదీ చదవండి: ఆకాశమే ఆమె హద్దు.. -
వామ్మో.. ఈ విమానం ల్యాండింగ్ చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే!
ఎథెన్స్: గ్రీస్లోని స్కియాథోస్ విమానాశ్రయం సుందరమైన వీక్షణలకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ విమానాలు దిగడాన్ని చూడటానికి ప్రతిరోజూ వందలాది మంది పర్యాటకులు ల్యాండింగ్ ప్రాంతాన్ని సందర్శిస్తారు. విమానాల ల్యాండింగ్, టేకాఫ్ను వీక్షించేందుకు రోజుకు సుమారు 100 మందికిపైగా ఇక్కడి వస్తారు. ఈ విమానాశ్రయం ఇతర అంతర్జాతీయ ఎయిర్పోర్టుల్లా అంత పెద్దగా ఉండదు. చిన్న రన్వే ఉంటుంది. ఇక్కడ దిగేందుకు అనుమతి పొందిన అతిపెద్ద విమానం బోయింగ్ 757. ఇటీవల ఓ ప్రయాణికుల విమానం అత్యంత తక్కువ ఎత్తులో ల్యాండింగ్ చేసిన విధానాన్ని చాలా మంది ఆశ్వాదించారు. ఆ దృశ్యాలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయగా వైరల్గా మారాయి. విజ్ఎయిర్ ఎయిర్బస్ ఏ321నియో ప్లేన్.. సముద్ర నీటిని తాకుందా అన్నట్లు వెళ్తూ.. అలెగ్జాండ్రోస్ పపడియామంటిస్ ఎయిర్పోర్ట్లో దిగింది. ల్యాండింగ్కు కొద్ది సెకన్ల ముందు విమానం ముందు టైర్లు రోడ్డుపై ఉన్న వారిని తాకుతాయా అన్నట్లు కనిపించింది. రన్వే ఫెన్సింగ్ దాటిన క్రమంలో ఆ గాలికి అక్కడి వారు దూరంగా పడిపోతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఈ వీడియోను గ్రేట్ఫ్లైయర్ యూట్యూబ్లో పోస్ట్ చేసింది. స్కియథోస్ అంతర్జాతీయ విమానాశ్రయం కేవలం 5,341 అడుగుల రన్వే కలిగి ఉంటుంది. అతితక్కువ పొడవు, తక్కువ వెడల్పుతో ఉండటం దీని ప్రత్యేకత. ఈ ఎయిర్పోర్ట్ 1972లో ప్రారంభమైంది. ఇదీ చదవండి: దక్షిణాఫ్రికాలోని ఒక పట్టణం...అక్కడ అంతా శ్వేత జాతీయులే! -
వైరల్ : చూస్తున్నంతసేపు ఉత్కంఠ..
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
ప్రిసైడింగ్ అధికారులదే కీలకపాత్ర
తప్పక చదవండి
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- పారిస్ ఒలింపిక్స్కు భారత రిలే జట్లు అర్హత
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అందరివాడు జగన్ను ఆశీర్వదించండి
- పేదల అక్షరంపై కక్ష
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement