breaking news
accountent
-
హీలియం గ్యాస్తో అనంత వాయువుల్లోకి.. ఢిల్లీలో తొలి కేసు
న్యూఢిల్లీ: కొందరు క్షణికావేశానికి లోనై నిండు జీవితాన్ని మధ్యలోనే అంతం చేసుకుంటుంటారు. ఆ క్షణంలో వారు సరైన నిర్ణయం తీసుకుంటే జీవితాన్ని బంగారుమయం చేసుకోగలుగుతారు. ఢిల్లీకి చెందిన ఒక యువ చార్టర్డ్ అకౌంటెంట్ హీలియం గ్యాస్ పీల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.ధీరజ్ కన్సల్ అనే 25 ఏళ్ల చార్టర్డ్ అకౌంటెంట్ ఢిల్లీలోని ఒక గెస్ట్ హౌస్లో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ధీరజ్ ఫేస్బుక్లో తన సూసైడ్ నోట్ను పోస్ట్ చేశాడు. దానినే రాత పూర్వకంగానూ తన గదిలో ఉంచాడు. హీలియం గ్యాస్ పీల్చడంద్వారా ఢిల్లీలో నమోదైన తొలి ఆత్మహత్య కేసుగా ఇది నిలిచింది. ధీరజ్ గోల్ మార్కెట్లోని ఒక గెస్ట్ హౌస్లో బసచేస్తున్నాడు. అతను గది నుంచి ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో గెస్ట్ హౌస్ యజమానికి అనుమానం వచ్చింది.దీంతో అతను పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు తలుపు పగలగొట్టి చూడగా, ధీరజ్ మంచం మీద అచేతనంగా కనిపించాడు. అతని నోటికి హీలియం సిలిండర్ను అనుసంధానం చేసిన పైపు ఉంది. అలాగే అతని ముఖం పారదర్శక ప్లాస్టిక్ షీట్తో కప్పి ఉంది. జూలై 20న గెస్ట్ హౌస్లో చెక్ ఇన్ చేసిన ధీరజ్ జూలై 28న చెక్ అవుట్ చేయాల్సి ఉంది. ధీరజ్ తన ఫేస్బుక్ పోస్ట్లో..‘నా మరణానికి ఎవరినీ నిందించవద్దు. ఇది నేను తీసుకున్న నిర్ణయం. నా జీవితంలో నేను కలిసిన ప్రతి ఒక్కరూ నాతో ఎంతో ప్రేమగా మెలిగారు.అందుకే ఎవరినీ ఇబ్బంది పెట్టవద్దని పోలీసులను అభ్యర్థిస్తున్నాను. నా డబ్బును అనాథాశ్రమానికి లేదా వృద్ధాశ్రమానికి విరాళంగా ఇవ్వండి. నా అవయవాలను దానం చేయండి. ఎవరూ ఇబ్బందుల్లో పడకూడదనే నేను ఎవరి పేర్లను ప్రస్తావించడం లేదు’ అని ధీరజ్ సూసైడ్ నోట్లో రాశాడు. ఘజియాబాద్లోని ఒక ఈ-కామర్స్ వెబ్సైట్ నుండి ధీరజ్ హీలియం సిలిండర్ను ఆర్డర్ చేశాడని పోలీసులు గుర్తించారు. ధీరజ్ 2002లో తన తండ్రిని కోల్పోయాడు. అనంతరం తల్లి తిరిగి వివాహం చేసుకుంది. దీంతో అప్పటి నుంచి ధీరజ్ తన తాత ఇంటిలో పెరిగాడు. -
భారత్ చేతికి మరిన్ని స్విస్ ఖాతాల వివరాలు
న్యూఢిల్లీ/బెర్న్: వార్షిక ఆటోమేటిక్ సమాచార మారి్పడి (ఏఈఓఐ) ఒప్పందం ప్రకారం స్విస్ బ్యాంకుల్లోని ఖాతాదారుల వివరాలకు సంబంధించిన 5వ సెట్ను భారత్కు స్విట్జర్లాండ్ అందించింది. వీటిలో వందల కొద్దీ ఖాతాల వివరాలు ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇందులో కొందరు వ్యక్తులు, కార్పొరేట్లు, ట్రస్టులకు చెందిన అకౌంట్లు అనేకం ఉన్నట్లు వివరించాయి. భారత్కు స్విట్జర్లాండ్ అందించిన వివరాల్లో ఖాతాదారు పేరు, చిరునామా, దేశం, ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నంబరు, ఖాతాల్లో బ్యాలెన్స్ మొదలైనవన్నీ ఉన్నట్లు పేర్కొన్నాయి. గత నెల సెపె్టంబర్లో సమాచార మారి్పడి చోటు చేసుకోగా తదుపరి విడత సెట్ను స్విట్జర్లాండ్ 2024 సెప్టెంబర్లో భారత్కు అందించాల్సి ఉంటుంది. పన్ను చెల్లింపుదారులు ట్యాక్స్ రిటర్నుల్లో తమ ఆర్థిక వివరాలన్నీ సక్రమంగా పొందుపర్చారా లేదా అనేది పరిశీలించేందుకు ఈ వివరాలు ఉపయోగపడతాయి. స్విస్ బ్యాంకుల్లో నల్లధనాన్ని దాచుకుని, పన్నులు ఎగ్గొడుతున్న కుబేరుల ఆటకట్టడానికి ఉద్దేశించిన ఏఈఓఐ కింద భారత్కు తొలిసారి 2019 సెపె్టంబర్లో మొదటి సెట్ వివరాలు లభించాయి. మరోవైపు, ఈ ఏడాది మొత్తం 104 దేశాలతో ఆర్థిక ఖాతాల వివరాల మారి్పడి జరిగినట్లు స్విట్జర్లాండ్ ఫెడరల్ ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్టీఏ) తెలిపింది. 78 దేశాలతో సమాచారం ఇచి్చపుచ్చుకున్నట్లు పేర్కొంది. 25 దేశాల నుంచి తాము వివరాలు తీసుకున్నప్పటికీ ఆయా దేశాల గోప్యత ప్రమాణాలు ఇంకా అంతర్జాతీయ స్థాయిలో లేనందున తాము తమ సమాచారమేమీ ఇవ్వలేదని వివరించింది. -
బ్యాంకులో లెక్కతేలని దోపిడీ
అంకెలగారడీతో మాయం చేశారు ఏసీఈవో, అకౌంటెంట్ నిర్వాకం తిమ్మాపూర్ : జిల్లాలో పేరున్న సంఘాలలో పోరండ్ల సహకార పరపతి సంఘం ఒకటి. సంఘం పరిధిలో బ్యాంకు సైతం కొనసాగుతోంది. లావాదేవీలతోపాటు డిపాజిట్లు, పంట రుణాలు, బంగారు ఆభరణాలపై రుణాలు, భూమి తనఖా, లాంగ్ టర్మ్ రుణాలను సంఘం పరిధిలోని బ్యాంకు ద్వారా కొనసాగుతున్నాయి. ఏడాది క్రితం వరకు పరిస్థితి బాగానే ఉన్నా ఉద్యోగుల వ్యవహారం సంఘానికే మచ్చతెచ్చేలా తయారైంది. 2015–2016 సంవత్సరంలో అంకెల గారడీ చేసి లక్షల రూపాయలు మాయం చేశారని తేలింది. అసిస్టెంట్ సీఈవో గంగారెడ్డి, అకౌంటెంట్ ఆగయ్య తమ తెలివితేటలతో లక్షల రూపాయలను కాజేయగా వీరి దోపిడీ ఇటీవల జరిగిన ఆడిట్లో బయటపడింది. ఇద్దరు కలిసి నలభై లక్షలను మాయం చేశారని ప్రాథమికంగా తెలిసింది. ఇందులో ఆగయ్య రూ.10లక్షలు, గంగారెడ్డి రూ.30లక్షలు తమ స్వంతానికి వినియోగించుకున్నట్లు అధికారులు గుర్తించారు. విషయాన్ని గోప్యంగా ఉంచిన ఆడిటర్లు, సంఘ పాలకవర్గం రికవరీ మొదలుపెట్టారు. ఇరవై రోజుల్లో ఇద్దరి నుంచి రూ.40లక్షల వరకు రికవరీ చేసినట్లు పాలకవర్గం తెలిపింది. ఇప్పటికీ బ్యాంకు లావాదేవీల పుస్తకాలు ఆడిటర్ వద్దనే ఉండడం.. ఆమె ఆడిట్ నివేదికను ఇవ్వకపోవడంతో లెక్కల వ్యవహారం ఇంకా తేలలేదు అంకెల గారడీ... పోరండ్ల సొసైటీ పరిధిలోని బ్యాంకులో అంకెల గారడీతో ఏసీఈవో, అకౌంటెంట్ ఏకంగా రూ.40 లక్షలకుపైగా మాయం చేశారనేది స్పష్టమైంది. బ్యాంకు పొదుపు ఖాతాలలో లావాదేవీలు లేనివాటిని ఎంచుకున్నారు. సుమారు డెబ్బై మందికి చెందిన ఖాతాలలో ఉన్న మొత్తానికి పక్కన అంకెలను చేర్చి లక్షలున్నట్లు చూపిస్తూ, ఖాతాదారుల సంతకాలను ఫోర్జరీ చేసి డబ్బులను విత్ డ్రా చేస్తున్నట్లు రాసుకున్నారు. సంతకాన్ని పరిశీలించే అధికారి ఏసీఈవో కాగా, డబ్బులు ఇచ్చేది అకౌంటెంట్ కావడంతో ఇద్దరూ తమ స్వాహా పర్వాన్ని కొనసాగించారు. వడ్డీ మాటేంటీ..? ఉద్యోగులు కాజేసిన రూ.40లక్షల బ్యాంకు డబ్బులకు లావాదేవీల రూపంలో వడ్డీ జమయ్యేది. ఏడాది కాలంలో రూ.40లక్షలు వాడుకున్న ఉద్యోగుల నుంచి అంతే మొత్తాన్ని రికవరీ చేయడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఇంత మొత్తానికి వడ్డీని ఎందుకు వసూలు చేయడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. అసలుతోపాటు వడ్డీని కలిపి మొత్తం రికవరీ అయ్యేలా చూడాలని సంఘ సభ్యులు కోరుతున్నారు. చర్యలు తీసుకుంటాం... – దేవేందర్ రెడ్డి, సంఘం చైర్మన్ ఉద్యోగులు అవకతవకలకు పాల్పడినట్లు ఇరవై రోజుల క్రితమే మా దష్టికి వచ్చింది. ఇప్పటి వరకు రూ.40లక్షలు రికవరీ చేశాము. ఇంకా ఆడిటర్ పూర్తి నివేదిక ఇవ్వలేదు. వడ్డీతో కలిపి అసలు రికవరీ చేసి సోమవారం పాలకవర్గ సమావేశంలో ఇద్దరిపై చర్యలు తీసుకుంటాం. సభ్యులు ఆందోళన చెందవద్దు.