breaking news
ABHIBUS
-
ట్రావెల్కి హోలీ జోష్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హోలీ పండుగ నేపథ్యంలో ప్రయాణాలు ఊపందుకున్నాయి. కుటుంబాలతో కలిసి వేడుకలు జరుపుకొనేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు సొంతూళ్లకు బైల్దేరుతుండటంతో విమానాలు, బస్సులకు డిమాండ్ నెలకొంది. దేశీయంగా అగ్రగామి ఏఐ ఆధారిత ట్రావెల్ ప్లాట్ఫాం ఇక్సిగో ప్రకారం హోలీ పండుగ వారాంతానికి సంబంధించి ఫ్లయిట్ బుకింగ్స్ వార్షిక ప్రాతిపదికన 70–75 శాతం పెరిగాయి. ఇక ఇక్సిగోలో బస్సుల విభాగం అభిబస్లో అడ్వాన్స్ బుకింగ్స్ 70 శాతం పెరిగాయి. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకి కూడా ఫ్లయిట్, బస్సు సర్వీసులకు భారీగా డిమాండ్ నెలకొంది. ఫ్లైట్ బుకింగ్స్లో 94 శాతం వృద్ధితో గోరఖ్పూర్ అగ్రస్థానంలో ఉండగా భోపాల్ (89 శాతం), కాన్పూర్ (86 శాతం), దర్భంగా (76 శాతం), వారణాసి (72 శాతం) తర్వాత స్థానాల్లో ఉన్నాయి. వారం మధ్యలో హోలీ రావడంతో వారాంతం వరకు సెలబ్రేట్ చేసుకునేలా ప్రజలు ట్రిప్లను ప్లాన్ చేసుకుంటున్నారని ఇక్సిగో సహ వ్యవస్థాపకుడు అలోక్ బాజ్పాయ్ తెలిపారు. హైదరాబాద్ జోరు.. మెట్రో నగరాల విషయానికొస్తే 108 శాతం ఫ్లయిట్ బుకింగ్స్ వృద్ధితో హైదరాబాద్ రెండో స్థానంలో ఉంది. తొలి స్థానంలో అహ్మదాబాద్ (118 శాతం), మూడో స్థానంలో చెన్నై (101 శాతం) ఉన్నాయి. ఇక అత్యధిక డిమాండ్ నెలకొన్న రూట్లలోని రైళ్లలో చాంతాడంత వెయిటింగ్ లిస్టులు ఉండటంతో గమ్యస్థానాలను చేరుకునేందుకు ట్రావెలర్లు బస్సులవైపు మళ్లుతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి విజయవాడ, బెంగళూరుకు అడ్వాన్స్ బుకింగ్స్ 70 శాతం పెరిగాయి. అటు బెంగళూరు–చెన్నై కారిడార్లో 65 శాతం, ముంబై నుంచి పుణె, నాగ్పూర్ రూట్లలో 75 శాతం పెరిగాయి. క్రికెట్ ఫీవర్ కూడా తోడు.. టీ20 క్రికెట్ వరల్డ్ కప్ సందడి కూడా ప్రయాణాలకు ఊతమిస్తోంది. కీలక మ్యాచ్లు జరిగే ప్రాంతాల్లో ఫ్లయిట్ సరీ్వసులు, హోటళ్లకు డిమాండ్ గణనీయంగా పెరిగింది. హోమ్ షేరింగ్ కంపెనీ ఎయిర్బీఎన్బీ ప్రకారం మ్యాచ్లకు ఆతిథ్యమిచ్చే నగరాల్లో హోటళ్ల కోసం ఆన్లైన్ సెర్చ్లు రెండు రెట్లు పెరిగాయి. దేశంలోనే అతిపెద్ద స్టేడియం ఉన్న అహ్మదాబాద్లో మార్చి 7–10 మధ్య బస చేసేందుకు అనువైన హోటళ్ల కోసం సెర్చ్లు 170 శాతం ఎగిశాయి. అయితే, ఈ ధోరణి కీలక మెట్రో హబ్లకు మాత్రమే పరిమితం కాకుండా చిన్న, ద్వితీయ శ్రేణి పట్టణాల్లో కూడా కనిపించడం గమనార్హం. రాంచీలో సెర్చ్లు 120 శాతం, తిరువనంతపురంలో 110 శాతం, జైపూర్లో 70 శాతం ఎగిశాయి. కొన్ని ఆన్లైన్ పోర్టల్స్ ప్రకారం ఫిబ్రవరి–మార్చి మధ్య కాలంలో మ్యాచ్లకు ఆతిథ్యమిస్తున్న నగరాలకు ఎయిర్ ట్రావెల్ బుకింగ్స్ 25–30 శాతం పెరిగాయి. అదే విధంగా మ్యాచ్లున్న రోజుల్లో హోటల్ సెర్చ్లు 20–25 శాతం వృద్ధి చెందాయి. ట్రిప్ల పొడిగింపు.. ఆధ్యాతి్మక టూరిజం లేదా వేసవి సెలవులతో పోలిస్తే ఇలాంటి పర్యటనల వ్యవధి తక్కువే ఉంటుందని, కాకపోతే మ్యాచ్ల తర్వాత కూడా ట్రిప్ కొన్ని రోజుల పాటు పొడిగించుకునే అవకాశం ఉందని ఈజ్మైట్రిప్ సీఈవో రికాంత్ పిట్టీ తెలిపారు. స్థానిక సంస్కృతి, వంటకాల గురించి తెలుసుకునేందుకు, దగ్గర్లోని ప్రాంతాలను సందర్శించేందుకు పర్యాటకులు ఆసక్తి చూపుతుంటారని ఎయిర్బీఎన్బీ వర్గాలు తెలిపాయి. క్రికెట్ టూరిజానికి సంబంధించి ఎక్కువ శాతం పర్యాటకులు యువ ట్రావెలర్లే ఉంటున్నారని వివరించాయి. -
ఓటర్లకు బస్ టికెట్లో రాయితీ.. ఎంతంటే..
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఓటు నమోదిత శాతం పెంచాలని ఎన్నికలసంఘం ప్రచారం చేస్తోంది. అందులో భాగంగా ప్రముఖ కంపెనీలు ఓటు శాతం పెంచేలా తమ కస్టమర్లకు ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. తాజాగా ఆన్లైన్ బస్ బుకింగ్ ప్లాట్ఫామ్ ‘అభిబస్’ ఓటు వేసేందుకు తమ సొంత ప్రాంతాలకు వెళ్లే వారికి ప్రత్యేక రాయితీ కల్పిస్తున్నట్లు ప్రకటించింది.ఈమేరకు సంస్థ సీఈఓ లెనిన్ కోడూరు, సీఓఓ రోహిత్ శర్మ మాట్లాడారు. ‘తెలుగు రాష్ట్రాల్లో మే 11 నుంచి సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఓటు వేసేందుకు తమ సొంత ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ABHIVOTE కూపన్ కోడ్ ఉపయోగించి టికెట్ ధరలో కనీసం 20 శాతం నుంచి గరిష్ఠంగా రూ.250 వరకు రాయితీ పొందొచ్చు. దీంతోపాటు రూ.100 క్యాష్బ్యాక్ కూడా పొందే వీలుంది’ అని చెప్పారు.ఇదీ చదవండి: మీపేరుపై ఎన్ని సిమ్కార్డులున్నాయో తెలుసుకోండిలా..ప్రముఖ విమానయాన సంస్థ ఎయిరిండియా ఎక్స్ప్రెస్ గతంలో ఓటర్లకు ఆఫర్ ప్రకటించిన విషయం తెలిసిందే. తొలిసారి ఓటు వేయబోయే యువ ఓటర్లకు దేశీయ, ఇంటర్నేషనల్ సర్వీసుల టికెట్ ధరలపై 19 శాతం రాయితీ ఇస్తున్నట్లు చెప్పింది. -
ఐఆర్సీటీసీలో బస్ టికెట్ల బుకింగ్
ముంబై: ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ)లో ఇక నుంచి బస్ టికెట్లను కూడా బుక్ చేసుకోవచ్చు. ఈ మేరకు ఆన్లైన్ ఈ-టికెటింగ్ ఫ్లాట్ఫామ్ అభిబస్, ఐఆర్సీటీసీ మధ్య ఒప్పందం జరిగింది. దీంతో ఐఆర్సీటీసీ కస్టమర్లు వారి అవసరాలకు అనుగుణంగా అభిబస్లోని వివిధ మార్గాలలో ఎసీ, నాన్-ఏసీ టికెట్లను బుకింగ్ చేసుకునే అవకాశం లభిస్తుంది. కస్టమర్లు రైల్ టికెట్ బుకింగ్ సమయంలో వెయిటింగ్ లిస్ట్లో ఉంటే.. వెంటనే వారికి అదే గమ్యస్థానంలో బస్ మార్గాల లభ్యతను సూచిస్తుందని, దీంతో ప్రయాణికులు ఇబ్బందులు లేని టికెట్ బుకింగ్ సేవలను అందుకోవచ్చని తెలిపింది. ప్రతి రోజు ఐఆర్సీటీసీ 9లక్షల ట్రెయిన్ టికెట్లను విక్రయిస్తుండగా.. అభిబస్.కామ్, యాప్ల ద్వారా 30 వేల బుకింగ్స్ను అందిస్తోంది. ఇప్పటివరకు సుమారు 45 మిలియన్ యూజర్లు అభిబస్ సేవలను వినియోగించు కున్నారని చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ శశాంక కూనా తెలిపారు. చదవండి: క్రిప్టోకరెన్సీపై ఆర్బీఐ గవర్నర్ కీలక వ్యాఖ్యలు! -
అభీబస్ ఆఫర్ పై ఆగ్రహజ్వాల
► భగ్గుమంటున్న ఆర్టీసీ కార్మిక సంఘాలు ► మార్కెటింగ్ కోసమేనంటున్న ఆర్టీసీ ► ఇతర రాష్ట్రాల్లో నిషేధించిన సంస్థకు అప్పగించడంపై ఆందోళన ► మూడు రెట్ల ఆదాయం ఇస్తామని ఇచ్చిన బంపర్ ఆఫర్ డొక్కు బస్సులతో సాధ్యమా..? ► ఆర్టీసీ కార్మిక సంఘాల నిరసన గళం విజయనగరం అర్బన్: ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణ టిక్కెట్ల ఆన్లైన్ విక్రయాలను ప్రైవేటు సంస్థకు అప్పగించడంపై కార్మికులు మండిపడుతున్నారు. ఆన్లైన్ పాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్(ఓఆర్ఎస్)ఏజెంట్గా అభీబస్ సంస్థను ఎంపిక చేయడంపై కార్మికలోకం భగ్గమంటోంది. సంస్థ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాయి మార్చి 1 నుంచి అన్ని బస్స్టేషన్ల కరెంట్, అడ్వాన్స్డ్ రిజర్వేషన్ ప్రక్రియను అభీబస్ చేపట్టబోతోందంటూ ఆర్టీసీ ఏకగ్రీవ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. నిర్వహణ బాగోలేదని తమిళనాడు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో నిషేధించిన అభీబస్ సంస్థకు బాధ్యతలు కట్టబెట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల పరిధిలోని ఆర్టీసీ నార్త్, ఈస్ట్ కోస్ట్ (నెక్) రీజియల్ పరిధిలోని తొమ్మిది డిపోల వద్ద ఉద్యోగులు గురువారం ఆందోళనకు దిగారు. ఆర్టీసీ సంస్థ, ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినదించారు. సంస్థ తీరులో మార్పురాకుంటే సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. దశాబ్దకాలంగా ఆర్టీసీ ఆన్లైన్ పాసింజర్ రిజర్వేషన్ విధానాన్ని చేపడుతోంది. ఈ విధానంలో భాగంగా అధీకృత ఏజెంట్లను నియమించి నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తున్నారు. అధీకృత ఏజెంట్లతో పాటు బస్స్టేషన్లలో ఆర్టీసీ సొంతంగా కరెంట్, అడ్వాన్స్డ్ రిజర్వేషన్ బుకింగ్ కౌంటర్లు నడుపుతోంది. ఆర్టీసీ రీజియన్లోని తొమ్మిది డిపోల పరిధిలో సుమారు 50 మంది నిరుద్యోగులు పనిచేస్తున్నారు. తాజాగా వీటికి అదనంగా అభీబస్ సంస్థను ఆర్టీసీ తన ఏజంట్గా నియమించింది. ఈ సంస్థకు బస్స్టేషన్లలో బుకింగ్ కౌంటర్స్ను అప్పగించింది. ఆర్టీసీ సాఫ్ట్వేర్ అంతా అభీబస్ సంస్థ ఆధీనంలోకి వెళ్లబోతోంది. ఆర్టీసీ ఏసీ బస్సుకు రూ.7, ఆర్టినరీ బస్సుకు రూ.5 చొప్పున అభీబస్ సంస్థకు కమిషన్ చెల్లించేలా రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోల రిజర్వేషన్ కేంద్రాలను అప్పగిస్తూ ఒప్పందం కుదుర్చుకున్నారు. విస్తృత రవాణా నెట్వర్క్ కలిగిన అభీబస్... ఆర్టీసీ ఏజంట్గా చేరడం వల్ల సంస్థకు చెందిన ఆర్టీసీ బస్సులు ప్రాచుర్యం పొందుతాయని, ఆదాయం సమకూరుతుందని, ఆక్యుపెన్సీ రేషియో వస్తుందని ఆర్టీసీ ఉన్నతాధికారులు అభిప్రాయ పడుతున్నారు. అయితే, సంస్థను అంచెలంచెలుగా ప్రైవేటీకరణ చేసేందుకు పూనుకున్నారని, ఉపాధిని దెబ్బతీసేందుకు పెద్దలు కుట్రపన్నుతున్నారంటూ ఆర్టీసీ ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఆందోళనను తీవ్రతరం చేస్తున్నారు.


