పుంగనూరులోని శ్రీ సుగుటూరు గంగమ్మ జాతరకు భక్తులు పోటెత్తారు
జమీందారుల కులదైవమైన గంగమ్మకు ప్యాలెస్లో పూజలు చేసి అట్టహాసంగా మంగళవారం వేడుకలు ప్రారంభించారు
మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన సతీమణి స్వర్ణమ్మ కలసి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు
జాతర సందర్భంగా అమ్మవారిని పల్లకీలో పట్టణ పుర వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు
జాతరకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావడంతో పుర వీధులు కిక్కిరిశాయి
అమ్మవారికి నెయ్యి దీపాలు, పెరుగన్నం పెట్టి మొక్కులు చెల్లించుకున్నారు


