విజయవాడ-ఢిల్లీ మార్గంలో డెరైక్ట్ సర్వీసు: ఎయిర్ ఇండియా | Vijayawada-forward service on the way to Delhi: Air India | Sakshi
Sakshi News home page

విజయవాడ-ఢిల్లీ మార్గంలో డెరైక్ట్ సర్వీసు: ఎయిర్ ఇండియా

Jan 15 2015 12:56 AM | Updated on Sep 2 2017 7:43 PM

బిజినెస్ బ్యూరో: విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా....

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా.. విజయవాడ-ఢిల్లీ మార్గంలో డెరైక్ట్ సర్వీసును జనవరి 15 నుంచి ప్రారంభిస్తోంది. ఏఐ459 విమానం ఢిల్లీలో ఉదయం 6.20కి బయల్దేరి విజయవాడకు 8.25కు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఏఐ460 విమానం 9 గంటలకు బయల్దేరి ఢిల్లీకి 11.05కు చేరుకుంటుంది.

ఇప్పటికే హైదరాబాద్ మీదుగా ఢిల్లీ-విజయవాడ మధ్య ప్రతిరోజు ఒక సర్వీసు నడుస్తోంది. ఢిల్లీ నుంచి బ్యాంకాక్, బర్మింగ్‌హాం, ఫ్రాంక్‌ఫర్ట్, ఖాట్మండు, లండన్, మెల్‌బోర్న్, సిడ్నీ, ప్యారిస్, రోమ్, మిలన్‌లకు వెళ్లే విమానాలకు కనెక్ట్ అయ్యేందుకు కొత్త సర్వీసు దోహదం చేస్తుందని ఎయిర్ ఇండియా తెలిపింది.
 

Advertisement

పోల్

Advertisement