వెల్కమ్ బుక్ ప్రైజ్ తుది జాబితాల్లో భారత సంతతికి చెందిన ఇద్దరు అమెరికన్లు చోటు సంపాదించారు.
లండన్: ప్రతి ఏటా వైద్యం, ఆరోగ్యం విషయాలపై పుస్తకాలను రచించిన వారికిచ్చే ప్రతిష్టాత్మక వెల్కమ్ బుక్ ప్రైజ్ తుది జాబితాల్లో భారత సంతతికి చెందిన ఇద్దరు అమెరికన్లు చోటు సంపాదించారు. ఈ అవార్డు కింద 30 వేల పౌండ్లు నగదు బహుమతిని అందజేస్తారు.
సిద్ధార్థ ముఖర్జీ రాసిన ‘ది జీన్’ పుస్తకం, పాల్ కళానిధి రాసిన ‘వెన్ బ్రీత్ బికమ్స్ ఎయిర్’ పుస్తకాలు బహుమతి తుది జాబితాలో నిలిచాయి. వీటితో పాటు మరో నాలుగు పుస్తకాలు కూడా తుది జాబితాలో నిలిచాయి.


