సీఎస్‌సీల ద్వారా పాస్‌పోర్ట్ సేవలు | Passport Seva goes rural through Common Services Centers | Sakshi
Sakshi News home page

సీఎస్‌సీల ద్వారా పాస్‌పోర్ట్ సేవలు

Mar 6 2014 9:33 PM | Updated on Sep 2 2017 4:25 AM

సీఎస్‌సీల ద్వారా పాస్‌పోర్ట్ సేవలు

సీఎస్‌సీల ద్వారా పాస్‌పోర్ట్ సేవలు

ఇకపై కామన్ సర్వీస్ సెంటర్ల (సీఎస్‌సీ)ల ద్వారా పాస్‌పోర్ట్ సేవలు అందించేందుకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ చర్యలు చేపట్టింది.

సాక్షి, హైదరాబాద్: ఇకపై కామన్ సర్వీస్ సెంటర్ల (సీఎస్‌సీ)ల ద్వారా పాస్‌పోర్ట్ సేవలు అందించేందుకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ చర్యలు చేపట్టింది.  దీనికోసం లక్షకు పైగా సీఎస్‌సీలను ఎంపిక చేసింది. ఈ సెంటర్ల ద్వారా పాస్‌పోర్ట్ సంబంధిత సేవలు అందిస్తారు. ఈ విధానానికి జాతీయ ఈ-గవర్నెన్స్ ప్రణాళికలో 2006లోనే ఆమోదం తెలిపినా ఇప్పటికి కార్యాచరణ మొదలైంది. ఈ సెంటర్లలో పాస్‌పోర్ట్ దరఖాస్తు పూర్తి చేయడం, ఆ దరఖాస్తును ఇంటర్నెట్‌కు అప్‌లోడ్ చేయడం, ఫీజులు చెల్లింపు తదితర పనులు నిర్వహిస్తారు.

ముఖ్యంగా గ్రామీణ ప్రజలకు ఇవి ఎంతో ఉపయోగపడతాయి. దీనికోసం రూ.100 నామమాత్రపు రుసుము వసూలుచేస్తారు. తొలుత ఉత్తరప్రదేశ్, జార్ఖండ్‌లో 15 కేంద్రాల్లో మార్చి రెండవ వారంలో ఈ సేవలు ప్రయోగాత్మకంగా ప్రారంభిస్తారు. మార్చి చివరినాటికి లేదా ఏప్రిల్ మొదటి వారంలో దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్టు విదేశీ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.

పాస్‌పోర్ట్ సేవలకు సంబంధించిన సమాచారం కోసం www.passportindia.gov.in వెబ్‌సైట్‌లో చూడొచ్చు. అంతేగాకుండా జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసిన 1800-258-1800 టోల్‌ఫ్రీ నెంబర్‌కు కూడా ఫోన్ చేసి పాస్‌పోర్ట్‌కు సంబంధించిన సమాచారం తెలుసుకోవచ్చు. గతంలో పోస్టాఫీసుల్లో పాస్‌పోర్ట్ సేవలు ప్రారంభించినా అనుకున్నంతగా అది సఫలం కాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement