జీఎస్టీ డెడ్లైన్ వాయిదా పడింది! | GST roll-out deferred to July 1 : Finance Minister Arun Jaitley | Sakshi
Sakshi News home page

జీఎస్టీ డెడ్లైన్ వాయిదా పడింది!

Jan 16 2017 6:53 PM | Updated on Oct 2 2018 4:19 PM

జీఎస్టీ డెడ్లైన్ వాయిదా పడింది! - Sakshi

జీఎస్టీ డెడ్లైన్ వాయిదా పడింది!

కేంద్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి తీసుకురావాలనుకుంటున్న జీఎస్టీ అమలు వాయిదా పడింది.

కేంద్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి తీసుకురావాలనుకుంటున్న జీఎస్టీ అమలు తేదీ వాయిదా పడింది. జీఎస్టీ అమలును 2017 జూలై 1కు వాయిదా వేస్తున్నట్టు ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ వెల్లడించారు. పన్ను అధికారాలపై కేంద్ర, రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యకు పరిష్కారం లభించనందున్న ఈ అమలు తేదీని వాయిదా వేస్తున్నట్టు జైట్లీ తెలిపారు. జీఎస్టీ అమలు తేదీపై నేడు సమావేశమైన అరుణ్ జైట్లీ నేతృత్వంలోని కౌన్సిల్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. తదుపరి మీటింగ్ ఫిబ్రవరి 18న జరుగనుంది.
 
వార్షిక టర్నోవర్ 1.5 కోట్ల వరకు ఉన్న సంస్థల పన్నులపై తమకే పూర్తి హక్కులు కల్పించాలని రాష్ట్రాలు కోరుతున్నాయి. ఈ విషయంపై కేంద్రం సుముఖంగా లేనప్పటికీ, ఆఖరికి 90 శాతం హక్కులు రాష్ట్రాలకు, 10 శాతం కేంద్రానికి ఉంటాయని అరుణ్ జైట్లీ తెలిపారు. రూ.1.5 కోట్లకంటే ఎ‍క్కువ టర్నోవర్ ఉన్న పన్ను చెల్లింపుదారులపై కేంద్ర, రాష్ట్రాలు 50:50 హక్కులు కలిగి ఉండనున్నట్టు చెప్పారు.
 
అయితే పశ్చిమబెంగాల్ లాంటి రాష్ట్రాలు ఈ విషయంలో వాదిస్తున్నాయి. జీఎస్టీ అమల్లోకి వచ్చిన సమయంలో తమ రెవెన్యూలు భారీగా కోల్పోతామని పేర్కొంటున్నాయి. పెద్ద నోట్ల రద్దు కూడా తమ రెవెన్యూలకు గండికొడుతున్నాయని చెబుతున్నాయి. వచ్చే ఐదేళ్లలో కేంద్రం చెల్లించే నష్టపరిహారాలను పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement