కేజ్రీవాల్ పై దాడి | Eggs, stone thrown at Kejriwal | Sakshi
Sakshi News home page

కేజ్రీవాల్ పై దాడి

Jan 13 2015 9:28 PM | Updated on Jul 11 2019 5:40 PM

కేజ్రీవాల్ పై దాడి - Sakshi

కేజ్రీవాల్ పై దాడి

మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ పై గుర్తు తెలియన వ్యక్తి కోడిగుడ్లు, రాళ్లతో దాడి చేశాడు.

న్యూఢిల్లీ: మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ పై గుర్తు తెలియన వ్యక్తి కోడిగుడ్లు, రాళ్లతో దాడి చేశాడు. వాయవ్య ఢిల్లీలోని సుల్తాన్ పూరా మాజ్రాలో ఎన్నికల ర్యాలీ నిర్వహిస్తుండగా ఈ దాడి జరిగింది.

ఈ ఘటనలో కేజ్రీవాల్ ఎటువంటి గాయాలు కాలేదని ఆప్ వాలంటీరు ఒకరు తెలిపారు. దుండగులు విసిరిన కోడిగుడ్లు, రాళ్లు కేజ్రీవాల్ ప్రసంగిస్తున్న వేదిక వద్ద పడడంతో ఆయనకు ఏం కాలేదన్నారు.  సుల్తాన్ పూరా మాజ్రాలో కేజ్రీవాల్ పై దాడి జరగడం ఇది రెండోసారి.

Advertisement
 
Advertisement
Advertisement