రాహుల్ ప్రధాని అభ్యర్థిత్వంపై వాడివేడి చర్చ! | congress core committee meet at manmohan singh's house | Sakshi
Sakshi News home page

రాహుల్ ప్రధాని అభ్యర్థిత్వంపై వాడివేడి చర్చ!

Jan 15 2014 6:11 PM | Updated on Sep 2 2017 2:38 AM

రాహుల్ ప్రధాని అభ్యర్థిత్వంపై వాడివేడి చర్చ!

రాహుల్ ప్రధాని అభ్యర్థిత్వంపై వాడివేడి చర్చ!

కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాని అభ్యర్థిత్వంపై వాడివేడిగా చర్చ కొనసాగుతోంది.

ఢిల్లీ: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాని అభ్యర్థిత్వంపై వాడివేడిగా చర్చ కొనసాగుతోంది. బీజేపీ తమ ప్రధాని అభ్యర్థిగా గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని ప్రకటించి ముందంజలో ఉండగా , కాంగ్రెస్ పార్టీ ప్రధాని అభ్యర్థి విషయంలో మల్లగుల్లాలు పడుతోంది. రాహుల్ ను ప్రధానిగా ప్రకటించాలా?వద్దా?అనే అంశంపై సందిగ్ధత నెలకొంది. కాగా రాహుల్ మాత్రం ఏ బాధ్యతనైనా చేపట్టేందుకు సుముఖంగా ఉన్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రధాని మన్మోహన్ సింగ్ నివాసంలో బుధవారం కాంగ్రెస్ కోర్ కమిటీ మరోసారి సమావేశమైంది.

 

ఈ భేటీకి రాహుల్ తో పాటు, ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, సుశీల్ కుమార్ షిండే, ఏకే ఆంటోనీ, అహ్మద్ పటేల్ సమావేశమైయ్యారు. జనవరి 17వ తేదీ శుక్రవారం జరుగునున్నఏఐసీసీ భేటీలో కాంగ్రెస్ ప్రధాని అభ్యర్థిని ప్రకటిస్తారు. దీంతో ఈ  రోజు జరిగే భేటీకీ ప్రాధాన్యత సంతరించుకుంది. కోర్ కమిటీ భేటీలో రాహుల్ కు అప్పగించే బాధ్యతలపై కాంగ్రెస్ పెద్దలు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement