న్యూఢిల్లీ: విమానయాన సంస్థలకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ షాకిచ్చింద. విమానాల్లోని మానవ వ్యర్థాలను గృహాలపై విడిచిపెట్టడంపై మండి పడింది. దీనికి సంబంధించి సర్క్యులర్ జారీ చేయాల్సిందిగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఎ) ని ఆదేశించింది. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం పరిసర ప్రాంతంలో నివిసించే మాజీ సైనిక అధికారి లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) సాత్వంత్ సింగ్ దహియా దాఖలు చేసిన పిటీషన్ పై విమానయాన సంస్థలకు షాకిచ్చిన ఎన్జీటీ అధ్యక్షుడు స్వతంత్ర కుమార్ ఈ ఆదేశాలిచ్చారు.. స్వచ్ఛ్ భారత్ అభియాన్ కి విమానయాన సంస్థ చర్యలు విఘాతం కలిగిస్తున్నాయన్న సైనిక అధికారి వాదనలను ట్రిబ్యునల్ సమర్ధించింది.
విమానాల టాయిలెట్ ట్యాంకులను గాల్లోనే ఖాళీచేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎన్జీటీ డీజీసీఎ కి కొన్ని సూచనలు చేసింది. ముఖ్యంగా ఇలా వ్యవహరించే విమానయాన సంస్థలకు రూ .50,000 జరిమానా విధించాలని డీజీసీఏ ని కోరింది. జరిమానా ద్వారా సేకరించిన సొమ్మను సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు(సీపీసీబీ) వద్ద డిపాజిట్ చేయాలని కోరింది. సంబంధిత ఫిర్యాదులకో్సం ఒక హెల్ప్ లైన్ , ఈ మెయిల్ క్రియేట్ చేయాల్సిందిగా ఆదేశించింది.
మరోవైపు సీపీసీబీ కూడా ఎయిర్ లైన్స్ చర్యపై విస్మయం వ్యక్తంచేసింది. ఫిర్యాదు దారు ఇంటిదగ్గర సేకరించిన సాంపిల్స్ ను పరీక్షించగా, అవి మానవ వ్యర్థాలుగా తేలిందని పేర్కొన్నారు. విమానాలు ల్యాండ్ అయినపుడు నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో టాయిలెట్ ట్యాంకులు ఖాళీగా ఉండడం గమనించామని తెలిపింది. అయితే ఈ ఆరోపణలను విమాన మంత్రిత్వ శాఖ ఖండించింది. విమానం ల్యాండ్అయిన తరువాత సాధారణంగా వాటిని శుభ్రం చేస్తారని పేర్కొంది. అయితే ఏవియేషన్ అధికారులు టాయిలెట్ ట్యాంక్ లీక్ అయివుండంచ్చని తెలపడం విశేషం.
విమానయాన సంస్థలకు షాకిచ్చిన ఎన్జీటీ
Published Tue, Dec 20 2016 7:07 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- కెనడాలో మనవడిని చూడ్డానికి వెళ్లి...మనవడితో సహా దుర్మరణం
- Banjara Hills: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం.. నిండు ప్రాణం బలి
- తెలంగాణలో భానుడి భగభగలు..!
- తాతా.. నీకు టాటా..
- రోహిత్ వేముల ఆత్మహత్య కేసు మళ్లీ దర్యాప్తు చేస్తాం
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
- తిరుమలలో వడగళ్ల వర్షం (ఫొటోలు)
- కందికుంట అడ్డంగా దొరికినా..
- నిందితుడిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారు?
- కళ్లు చల్లబడ్డాయా బాబూ!
Advertisement