కారు బాంబు పేలుళ్లతో దద్దరిల్లిన బాగ్దాద్ | 22 killed in Baghdad bomb attack | Sakshi
Sakshi News home page

కారు బాంబు పేలుళ్లతో దద్దరిల్లిన బాగ్దాద్

Jul 23 2014 9:01 AM | Updated on Sep 2 2017 10:45 AM

ఇరాక్ రాజధాని బాగ్దాద్ నగరం కారు బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. నగరవ్యాప్తంగా మంగళవారం సంభవించిన కారు బాంబు పేలుళ్లలో దాదాపు 22 మంది మృతి చెందారు.

బాగ్దాద్: ఇరాక్ రాజధాని బాగ్దాద్ నగరం కారు బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. నగరవ్యాప్తంగా మంగళవారం సంభవించిన కారు బాంబు పేలుళ్లలో దాదాపు 22 మంది మృతి చెందారు. మరో 45 మంది తీవ్రంగా గాయపడ్డారని ఆ దేశ హోంమంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు. క్షతగాత్రులు నగరంలోని వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారని  తెలిపారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. ఈ ఏడాది మొదటి ఆరునెలలో దేశంలో తీవ్రవాదుల దాడులు, హింసలో 5,576 మంది మృతి చెందగా, 11,666 మంది గాయాలపాలైయ్యారని ఇరాక్లోని యూఎన్ అసిస్టెంట్ మిషన్ శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది.
 

Advertisement
 
Advertisement
Advertisement