కారు బాంబు పేలుళ్లతో దద్దరిల్లిన బాగ్దాద్ | 22 killed in Baghdad bomb attack | Sakshi
Sakshi News home page

కారు బాంబు పేలుళ్లతో దద్దరిల్లిన బాగ్దాద్

Jul 23 2014 9:01 AM | Updated on Sep 2 2017 10:45 AM

ఇరాక్ రాజధాని బాగ్దాద్ నగరం కారు బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. నగరవ్యాప్తంగా మంగళవారం సంభవించిన కారు బాంబు పేలుళ్లలో దాదాపు 22 మంది మృతి చెందారు.

బాగ్దాద్: ఇరాక్ రాజధాని బాగ్దాద్ నగరం కారు బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. నగరవ్యాప్తంగా మంగళవారం సంభవించిన కారు బాంబు పేలుళ్లలో దాదాపు 22 మంది మృతి చెందారు. మరో 45 మంది తీవ్రంగా గాయపడ్డారని ఆ దేశ హోంమంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు. క్షతగాత్రులు నగరంలోని వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారని  తెలిపారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. ఈ ఏడాది మొదటి ఆరునెలలో దేశంలో తీవ్రవాదుల దాడులు, హింసలో 5,576 మంది మృతి చెందగా, 11,666 మంది గాయాలపాలైయ్యారని ఇరాక్లోని యూఎన్ అసిస్టెంట్ మిషన్ శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement