* వాటర్గ్రిడ్పై నేడు జిల్లా యంత్రాంగంతో మంత్రి కేటీఆర్ సమీక్ష
* సమావేశానికి హాజరుకానున్న ప్రజాప్రతినిధులు
* పంచాయతీ రాజ్ పనుల పురోగతిపైనా చర్చించనున్న మంత్రి
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ‘వాటర్గ్రిడ్’పై కరసత్తు ప్రారంభమైంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి యంత్రాంగం రూపొందించిన ప్రణాళికలను క్షేత్రస్థాయిలో ప్రజాప్రతినిధులతో సమీక్షించేందుకు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.తారకరామారావు జిల్లాలవారీ పర్యటనకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే.
ఈక్రమంలో శనివారం ఆయన జిల్లాకు రానున్నారు. వికారాబాద్లోని మహవీర్ ఆస్పత్రిలోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాలోని అన్ని విభాగాల అధికారులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించనున్నారు. పంచాయతీరాజ్ విభాగాల్లో పనుల పురోగతితోపాటు వాటర్గ్రిడ్పై సుదీర్ఘంగా చర్చించనున్నారు. జిల్లా మంత్రి మహేందర్రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి, కలెక్టర్ రఘునందన్రావు, జేసీలు, ప్రజాప్రతినిధులంతా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
రూ.2,500 కోట్లతో వాటర్గ్రిడ్..
ప్రతిష్టాత్మక వాటర్గ్రిడ్ కోసం జిల్లా యంత్రాంగం రూ.2,500 కోట్లతో ప్రణాళిక తయారు చేసింది. వాటర్గ్రిడ్ కింద జిల్లా పశ్చిమ ప్రాంతంతోపాటు ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, ఎల్బీ నగర్ ప్రాంతాల్లో కృష్ణా నీటితో.. మల్కాజిగిరి, రాజేంద్రనగర్, మేడ్చల్ ప్రాంతాలను గోదావరి నీటితో అనుసంధానం చేసేలా ఈ ప్రణాళిక తయారైంది. మొత్తంగా గ్రిడ్ ద్వారా జిల్లాలోని 1,044 హాబిటేషన్లకు తాగునీటిని అందించనున్నారు.
ఈ ప్రణాళికకు సంబంధించి ఇప్పటికే ప్రాథమిక సర్వే మొదలైనట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి. అయితే ఇందుకు సంబంధించి తుది ప్రణాళిక ఖరారుకు కొంత సమయం పట్టనుందని, కాగా క్షేత్రస్థాయిలో అన్ని వార్గాలనుంచి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే గ్రిడ్ ప్రణాళికకు అసలురూపు రానుందని జిల్లా గ్రామీణ నీటి సరఫరా విభాగం ఇంజనీరు ఒకరు ‘సాక్షి’తో పేర్కొన్నారు.
ఎలా చేద్దాం!
Published Sat, Jan 31 2015 4:11 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మోదీకి బహుమతిగా ఇవ్వాలి
అబద్ధాల పునాదులపై..
బీజేపీకి మరో రూపమే బీఆర్ఎస్
పదేళ్ల అభివృద్ధి ఏది?
● బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిన అమిత్ షా పర్యటన ● కాగజ్నగర్ వికాస్ సంకల్ప్ సభ విజయవంతం ● ఉమ్మడి జిల్లా నుంచి తరలివచ్చిన జనం ● మార్మోగిన జైశ్రీరామ్, భారత్ మాతాకీ జై నినాదాలు
బీఆర్ఎస్, బీజేపీకి బుద్ధి చెప్పాలి
నేడు జేపీ నడ్డా రాక
చిన్నబోయిన చిన్నబొంకూరు
ఓసీపీ..ఉక్కిరిబిక్కిరి
‘నల్లసూరీడు’పై నజర్
తప్పక చదవండి
- ఉద్యమం అయిపోలే.. మిగిలే ఉంది
- హైదరాబాద్పై కుట్ర
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- 47 డిగ్రీలూ దాటేసింది! రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఎండలు
- కుట్రలెన్ని చేసినా పదేళ్లు మేమే..: సీఎం రేవంత్రెడ్డి
- ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి?: జి.కిషన్రెడ్డి
- ఇంగ్లిష్ మీడియంపై ఇంతలేసి మాటలా?
- మహిళకు ఏటా రూ. లక్ష: రాహుల్ గాంధీ
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
Advertisement