సాక్షి, మహబూబ్నగర్ :
నవంబర్ నుంచి కొత్త రేషన్కార్డులకు కొత్త పంథాలో బియ్యం సరఫరా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఇప్పటివరకు ఒక వ్యక్తికి నాలుగు కిలోల చొప్పున.. గరిష్టంగా 20 కేజీలకు మించకుండా ఇచ్చేవారు. కానీ కొత్త కార్డులపై ఒక్కో వ్యక్తికి ఐదుకిలోల చొప్పున కుటుంబ సభ్యులందరికీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
దీంతో బియ్యం కోటా పెరిగే అవకాశముంది. అయితే మరోవైపు కస్టమ్ మిల్లింగ్ బియ్యాన్ని (సీఎంఆర్) సరఫరా చేయడంలో మిల్లర్లు మీనమేషాలు లెక్కిస్తున్నారు. గడువు మీద గడువులు విధించినా వారి నుంచి స్పందన ఉండడం లేదు. చివరకు జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకొని క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించినా పట్టింపులు లేవు. చివరాఖరుగా ప్రభుత్వమే అ క్టోబర్ 30నాటికి బియ్యం అందజేయాలని తా జాగా గడువు విధించింది. ఈ గడువు కూడా సమీపిస్తున్నా లక్ష్యం నెరవేరడం లేదు. ఈ నేపథ్యంలో కొత్త కార్డులకు బియ్యం సరఫరా, మిల్ల ర్ల నుంచి రాబట్టడంపై పౌరసరఫరాల శాఖ మల్లగుల్లాలు పడుతోంది.
మిల్లర్ల ఇష్టారాజ్యం...
ఈ ఏడాది మార్చిలో రైతులు పండించిన వరి ధాన్యాన్ని ఐకేపీ ఆధ్వర్యంలోని మిహ ళా స్వయం సహాయక సంఘాల ద్వారా కొనుగో లు చేశారు. పౌరసరఫరాల శాఖలో తగిన సిబ్బంది లేరని, ఇతరత్రా కారణాల చేత మహి ళా సంఘాల ఆధ్వర్యంలో దాదాపు 61,308.439 టన్నుల వరిధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఈ ధాన్యాన్ని జిల్లాలోని దాదాపు 45 రైస్మిల్లులకు సరఫరా చేశారు.
స్వీకరించిన ధాన్యంలో దాదాపు 68శాతం అంటే 41,689.738 మెట్రిక్ టన్నులు ప్రభుత్వానికి స రఫరా చేయాల్సి ఉంది. ఇదంతా కూడా కేవలం 14 రోజుల్లోనే మిల్లర్లకు ఆదేశాలున్నాయి. మొ త్తం మీద జూన్ మొదటి వారం నాటికి పూర్తి స్థాయిలో బియ్యం అందజేయాల్సి ఉండేది. గడువుల మీద గడువులు విధిస్తూ ఆఖరుకు సెప్టెంబర్ 30 నాటికి సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే పౌరసరఫరాలశాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఇప్పటి వరకు కూడా ఆ లక్ష్యం నెరవేరడం లేదు.
సెప్టెంబర్ 30 నాటికి కేవలం 32శాతం బియ్యం మాత్రమే మిల్లర్ల నుంచి రావడంతో జిల్లా కలెక్టర్ జీడీ ప్రియదర్శిని రంగంలోకి దిగి క్రిమినల్ కేసులు పెట్టాలని ఆదేశించారు. అనంతరం చివరాఖరు అవకాశంగా అక్టోబర్ 30నాటికి పూర్తిస్థాయిలో ఇవ్వాలని మిల్లర్లకు ప్రభుత్వం అవకాశమిచ్చింది.
ఇంకా 25.71శాతం బకాయి..
నాలుగు నెలలుగా మిల్లర్లు మీనమేషాలు లెక్కిస్తుండడంతో ఆఖఱు అవకాశమిచ్చిన ప్రభుత్వం అందుకు పక్కా చర్యలు తీసుకుంది. ధాన్యం బాకీ ఉన్న మిల్లర్ల నుంచి బయట మార్కెట్ బియ్యం వెళ్లకుండా చూ సేందుకు ప్రత్యేకంగా సెప్టెంబర్ 20వ తేదీన 15 మంది అ దికారులను నియమించింది.
మొత్తం మిల్లర్ల నుంచి 41,689.738 టన్నుల బియ్యం రావాల్సిఉండగాఇప్పటి వరకు 30,919.403 మెట్రిక్ టన్నుల బియ్యం మాత్రమే వచ్చింది. ఇంకా 10,770.335 మె ట్రిక్ టన్నుల బియ్యం రావాల్సి ఉంది. దీపావళి సెలవులు పోను తుది గడువుకు వారం రోజుల వ్యవధి మాత్రమే ఉంది. దీంతో అతి కొద్ది కాలంలో మిల్లర్ల నుంచి ఎలా రాబట్టాలోనని అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు.
కొత్త కార్డులకు బియ్యం వచ్చేనా..?
Published Sun, Oct 19 2014 3:43 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఫాప్, కోహ్లి విధ్వంసం.. గుజరాత్పై ఆర్సీబీ ఘన విజయం
విరాట్ కోహ్లి బుల్లెట్ త్రో.. గుజరాత్ బ్యాటర్ ఫ్యూజ్లు ఔట్! వీడియో
ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)
వారికి వాడుకుని వదిలేసే అలవాటు: కాంగ్రెస్పై మండిపడ్డ జ్యోతిరాదిత్య సింధియా
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement