గిట్టుబాటు ధర కోసం పత్తి రైతుల ఆందోళన | the cotton farmers' protest for Cost price | Sakshi
Sakshi News home page

గిట్టుబాటు ధర కోసం పత్తి రైతుల ఆందోళన

Nov 30 2015 12:18 PM | Updated on Aug 29 2018 4:18 PM

పత్తికి గిట్టుబాటు ధర లభించటం లేదని రైతులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు.

పత్తికి గిట్టుబాటు ధర లభించటం లేదని రైతులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ఈ ఘటన నల్లగొండ జిల్లా సూర్యాపేట మండలం బాలెంలో చోటుచేసుకుంది. గ్రామంలో ఉన్న మంజీత్ కాటన్ కంపెనీ సీసీఐ అధికారులతో కుమ్మక్కై తక్కువ ధరకే పత్తి కొనుగోలు చేస్తోందని సోమవారం ఉదయం మిల్లు ఆవరణలోనే రైతులు ధర్నాకు దిగారు.

మిల్లులోని ఒక షెడ్డులో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తున్నట్లు కొన్ని రోజుల క్రితం అధికారులు ప్రకటించారు. అయితే, మిల్లు నిర్వాహకులు షెడ్డును ఇవ్వకపోవటంతో కొనుగోళ్లు ప్రారంభం కాలేదు. పెపైచ్చు క్వింటాలుకు పత్తి రూ.4 వేలు పలుకుతుండగా రూ.3 వేలకే మిల్లు కొనుగోలు చేస్తోందని రైతులు ఆరోపించారు. దీనిపై రెండు వందల మంది రైతులు మిల్లు ఆవరణలో ఆందోళనకు దిగారు. అక్కడికి చేరుకున్న అధికారులతో వాగ్వాదానికి దిగారు.



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement