జోగిపేట : పట్టణంలో గత నెల జరిగిన హత్య కేసులో అనుమానితుడిగా ఉన్న వ్యక్తి ఒకరు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన జోగిపేటలో గురువారం కలకలం రేపింది. వివరాలి లా ఉన్నాయి.. మే 29వ తేదీ వేకువజామున నర్రా ఆంజనేయులు (30)ను గుర్తు తెలియని వ్యక్తులు కిరాతకంగా హత్య చేశారు. కాగా.. ఆంజనేయులు హత్యకు సంబంధించిన వివరాలు అత డి సోదరుడైన పెంటయ్యకు తెలిసి ఉం టాయని కుటుంబ సభ్యులు పలువురు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు పెంటయ్యను శనివారం పోలీస్స్టేషన్కు పిలిపించారు.
హత్యకు సంబంధించిన వివరాలు తెలిసి ఉంటే చెప్పాలని కోరినా అతడి నుంచి ఎటువంటి సమాచారం రాకపోవడంతో ఆదివారం ఇంటికి పంపి సోమవారం తిరిగి రావాలని సూచించారు. అయితే ఏం జరిగిందో తెలియదుగానీ.. సోమవారం ఇంటి నుంచి వెళ్లిన పెంటయ్య గురువారం పశువుల పాక వద్ద గల చింత చెట్టుకు వేలాడుతూ కనిపించాడు. ఈ విషయాన్ని గమనించిన పెంటయ్య తల్లి రత్నమ్మ కుటుంబ సభ్యులకు తెలి యజేసింది. సమాచారం అందుకున్న సీఐ నాగయ్య, ఎస్ఐ శ్రీనివాస్లు గ్రా మానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం సంఘటనా స్థలంలో ఉన్న ఖాళీ బీరు బాటిల్, సిల్తో ఉన్న గుళికల ప్యాకెట్ను గుర్తించారు. ఈ మేరకు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
అప్పుల బాధతోనే ఆత్మహత్య చేసుకున్నాడు
గత నెల పెద్ద కూతురు వివాహం చే యడంతో ఆర్థిక ఇబ్బందులు, అదే నెలలో సోదరుడు ఆంజనేయులు మృతితో మానసికంగా కృంగిపోయిన తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి భార్య సుశీల జోగిపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు. మృతుడికి పెద్ద కుమార్తె నవనీతకు వివాహం కాగా కుమారుడు శివకుమార్, మరో కుమార్తె భవానీలు ఉన్నారు. జోగిపేట ప్రభుత్వాస్పత్రిలో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు.
హత్యకేసులో అనుమానితుడి ఆత్మహత్య
Published Fri, Jun 19 2015 1:20 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
హోమ్ ఓటింగ్ ప్రక్రియ వేగవంతం చేయండి
మోదీని ఆపే దమ్ము కేసీఆర్కే ఉంది
కాలవ అండ .. కరిగిన కొండ!
వైఎస్ జగన్తోనే సంక్షేమం
ప్రమాదంలో ఒకరి మృతి
ఐస్క్రీం తిని 100 మందికి అస్వస్థత
పాండవపురలోనూ అబార్షన్ దందా
స్టీరింగ్ విరిగి.. వరి మడిలోకి
కస్టడీలో రేవణ్ణ విచారణ
వీడియో బాధితుల కోసం సిట్ సహాయవాణి
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement