ధారూరు క్రిస్టియన్‌ జాతరకు ప్రత్యేక రైళ్లు

Special Trains To Dharur For Annual Christian Feast - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వికారాబాద్‌ సమీపంలోని ధారూరులో క్రిస్టియన్‌ జాతర నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడపనుంది. సికింద్రాబాద్‌ నుంచి బీదర్‌కు ఈనెల 15, 17 తేదీల్లో నాలుగు సర్వీసులు నడుపుతోంది. బీదర్‌ నుంచి ధారూరుకు కూడా నాలుగు సర్వీసులు తిప్పుతోంది. ఈ సందర్భంగా యశ్వంత్‌పూర్‌–బీదర్, నాందేడ్‌–బెంగళూరు, బెం గళూరు సిటీ–నాందేడ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు ధారూరు స్టేషన్‌లో తాత్కాలిక స్టాప్‌ను కల్పించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top