ఆర్టీసీ చరిత్రలో రికార్డు ఆదాయం నమోదైంది.
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ చరిత్రలో రికార్డు ఆదాయం నమోదైంది. సంక్రాంతి నేపథ్యంలో గత సోమవారం ఒక్కరోజే రూ. 32 కోట్లు వసూలైంది. ఇంత పెద్దమొత్తంలో వసూళ్లు ఆర్టీసీ చరిత్రలో ఇప్పటి వరకు వ చ్చిన దాఖలాలు లేవు. ఒక్కరోజు రికార్డు వసూలు రూ. 29 కోట్లుగా ఉంది. కాగా, ఆర్టీసీనీ ప్రైవేటీకరించే కుట్ర జరుగుతోందని ఆర్టీసీ తెలంగాణ ఎంప్లాయీస్ యూనియన్ ఆరోపించింది. వెంటనే ప్రైవేటు బస్సులను ఉపసంహరించుకోకుంటే ఆందోళనకు సిద్ధమవుతామని ఓ ప్రకటనలో హెచ్చరించింది.