'పాలమూరు' పనులను అడ్డుకున్న ప్రజలు | people protests at palamuru ethipothala project | Sakshi
Sakshi News home page

'పాలమూరు' పనులను అడ్డుకున్న ప్రజలు

Jun 11 2016 12:42 PM | Updated on Mar 22 2019 2:57 PM

మహబూబ్‌నగర్ జిల్లా గోపాలపేట మండలం బండరాయిపల్లి గ్రామస్తులు శనివారం పాలమూరు ఎత్తిపోతల పథకంలో భాగంగా తవ్వుతున్న కాలువ పనులను అడ్డుకుని ధర్నా చేశారు.

మహబూబ్‌నగర్  : మహబూబ్‌నగర్ జిల్లా గోపాలపేట మండలం బండరాయిపల్లి గ్రామస్తులు శనివారం పాలమూరు ఎత్తిపోతల పథకంలో భాగంగా తవ్వుతున్న కాలువ పనులను అడ్డుకుని ధర్నా చేశారు. అందులోభాగంగా అక్కడే వంటా-వార్పు కార్యక్రమం నిర్వహించారు.

ముంపు గ్రామమైన బండరాయిపల్లె గ్రామస్తులకు సరైన పరిహారం, పునరావాస ఏర్పాట్లు చేయకుండానే కాలువ తవ్వకం పనులు చేస్తున్నారని వారు ఆరోపించారు. తమకు న్యాయం చేసేవరకూ ఆందోళన కొనసాగిస్తామని వారు  హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement