సౌదీ అరేబియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నిజామాబాద్ జిల్లాకు చెందిన వ్యక్తి మృతి చెందాడు.
సౌదీలో నిజామాబాద్ వాసి మృతి
Feb 26 2016 12:47 PM | Updated on Oct 17 2018 6:06 PM
నవీపేట్: సౌదీ అరేబియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నిజామాబాద్ జిల్లాకు చెందిన వ్యక్తి మృతి చెందాడు. నవీపేట్ మండలానికి చెందిన గణేశ్ (45) ఐదేళ్ల క్రితం జీవనోపాధి కోసం సౌదీ వెళ్లాడు. రోడ్డు ప్రమాదంలో నవీన్ మృతి చెందినట్టు మండల కేంద్రంలోని దరియాపూర్లో ఉంటున్న కుటుంబ సభ్యులకు సమాచారం అందింది.గణేశ్ కు భార్య సరస్వతి, ఇద్దరు కుమారులు ఉంటున్నారు.
Advertisement
Advertisement