సాక్షి, మంచిర్యాల : జిల్లాలో సమస్యలతో సతమతమవుతున్న మారుమూల గ్రామాలు అనేకం ఉన్నాయి. ఎన్ని దశాబ్దాలు గడిచినా, ఎన్ని ప్రభుత్వాలు మారినా ఈ గ్రామాలు అభివృద్ధికి నోచుకోవడం లేదు. మోదీ సర్కారు ప్రవేశపెట్టిన సంసద్ గ్రామ్ యోజన పథకానికి ఇలాంటి మూడు గ్రామాలను ఎంపిక చేసుకుంటే నిరుపేదల బతుకుల్లో అభివృద్ధి బాటలు వేయవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
జిల్లాలోని ఎంపీలు గోడం నగేష్, బాల్కసుమన్ ఎంపిక చేయనున్న గ్రామాల విషయంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ దండేపల్లి మండల పరిధిలోని గూడెం గ్రామాన్ని ఎంపిక చేశారు. మారుమూల గ్రామాలతో పోల్చితే ఈ గ్రామం కాస్తోకూస్తో అభివృద్ధి బాటలో ఉంది. పాలక వర్గం లేదనే ఒకే ఒక్క కారణంతో ఈ పంచాయతీని ఎంపిక చేశారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అభివృద్ధికి నోచుకోని గ్రామ పంచాయతీల్లో అన్ని రకాల సదుపాయాలు కల్పించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
సంసద్ గ్రామ యోజన పథకం కింద ఆదర్శ గ్రామ పంచాయతీలను ప్రతిపాదించి నివేదికలు పంపాలని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసిం ది. గ్రామ పంచాయతీల ఎంపిక బాధ్యత ఎంపీలు, కలెక్టర్లకు అప్పగించింది. ఎంపీలు తన నియోజకవర్గ పరిధిలోని మూడు పంచాయతీలను దత్తత తీసుకుని.. ఆ గ్రామాల్లో సుపరిపాలన, సామాజిక, ఆర్థిక, పర్యావరణ, కమ్యూనికేషన్ వ్యవస్థ అభివృద్ధి, పాఠశాలలు, రోడ్ల నిర్మాణం, మెరుగైన వైద్యం ఇతర సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించింది.
ఈ క్రమంలో పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్ తన పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని గూడెం గ్రామ పంచాయతీని ఎంచుకున్నారు. అభివృద్ధి దశలో ఉన్న ‘గూడెం’కు బదులు.. అనేక సమస్యలున్న గ్రామ పంచాయతీలను దత్తత తీసుకుని వాటిని అభివృద్ధి చేస్తే.. పథక లక్ష్యం నెరవేరేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఎంపీ తీసుకున్న నిర్ణయంపై మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గాల ప్రజల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ గ్రామాల ఎంపిక విషయంలో స్థానిక అధికారుల అభిప్రాయాలను ఎంపీలు పరిగణలోకి తీసుకోవాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని..
- బాల్క సుమన్, ఎంపీ పెద్దపల్లి
గూడెంలో ఉన్న సత్యనారాయణ స్వామి ఆలయాభివృద్ధితోపాటు ఆ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో గ్రామాన్ని దత్తత తీసుకున్న. దశలవారీగా నా పరిధిలోని అన్ని నియోజకవర్గాలు, మండలాలు, గ్రామాలను అభివృద్ధి చేసేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తా.
గిదేం ఎంపిక..!
Published Wed, Nov 26 2014 2:33 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
నల్లజర్లలో అర్ధరాత్రి టీడీపీ బరితెగింపు
ఆత్మవిశ్వాసం + మనోధైర్యం..
సేవాభావం పెంపొందించుకోవాలి
భక్తిశ్రద్ధలతో శివాలయాల్లో ప్రదోష పూజలు
యువన్ శంకర్రాజా ఇండిపెండెంట్ మ్యూజికల్ ఆల్బమ్
రామేశ్వరం అగ్ని తీర్థంలో భక్తుల పుణ్యస్నానాలు
నీట్లో భిన్న ప్రశ్నపత్రాలతో గందరగోళం
వేలూరు జిల్లాలో గాలివాన
మరణంలోనూ వీడని బంధం
తప్పక చదవండి
- బాకీ తీర్చలేదని బట్టలూడదీసి.. మర్మాంగాల మీద తన్నుతూ..
- CM Jagan అంటే ఒక పాఠం: నటి శ్యామల
- యూనిసెఫ్ భారత జాతీయ అంబాసిడర్గా కరీనా : భావోద్వేగం
- ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు కొట్టిన సంజూ.. భారత తొలి క్రికెటర్గా..
- Konathala Ramakrishna: మీ సంగతి చూస్తాం
- దుబాయ్ నుంచి సెలవుపై వచ్చి ఆంబులెన్స్ ఢీ కొట్టి..
- ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
- Rafah: ఇజ్రాయెల్ దుందుడుకు చర్య.. ఐరాస ఆందోళన
- హైదరాబాద్లో విషాదం.. ఏడుగురు మృతి
- రెచ్చిపోయిన పచ్చ మూక.. హోం మంత్రి తానేటి వనితపై దాడికి యత్నం
Advertisement