మహాగణాధ్యక్షాయ.. | Hyderabad People Ready For Ganesh Chaturthi Festival | Sakshi
Sakshi News home page

మహాగణాధ్యక్షాయ..

Sep 2 2019 9:10 AM | Updated on Sep 9 2019 11:50 AM

Hyderabad People Ready For Ganesh Chaturthi Festival - Sakshi

శ్రీ ద్వాదశాదిత్య మహాగణపతి

ఖైరతాబాద్‌:  గణేశ్‌ నవరాత్రి వేడుకలకు నగరం సిద్ధమైంది. సోమవారం నుంచి 9 రోజులపాటు సందడి చేయనున్న గణనాథులు అందమైన మండపాల్లో కొలువుదీరారు.ఇక ఈసారి ఖైరతాబాద్‌ మహాగణపతి శ్రీ ద్వాదశాదిత్య రూపుడిగా దర్శనమివ్వనున్నాడు. చరిత్రలోనే మొదటిసారిగా 61అడుగుల ఎత్తులో....12 ముఖాలు...24 చేతులతో సూర్యభగవానుడి రథంపైనిలబడిన ఆకారంలో భక్తులకుదర్శనమిచ్చేందుకు మహాగణపతిసిద్ధమయ్యాడు. 65వ సంవత్సరంసందర్భంగా అత్యంత అద్భుతంగా..శిల్పి చిన్నస్వామి రాజేంద్రన్‌ రూపొందించినఖైరతాబాద్‌ మహాగణపతికి వినాయక చవితి సందర్భంగా తొలిరోజు సోమవారం

పూజా విశేషాలు ఇవీ...
ఉదయం 5 గంటలకు గణపతి హోమం
ఉదయం 6 గంటలకు75 అడుగుల కండువా, 75 అడుగుల జంధ్యం, 75 అడుగుల గరికమాల ఊరేగింపుగా ఖైరతాబాద్‌ మండపానికి రాక.  
ఉదయం 7–8 గంటల మధ్య మహాగణపతికి పూజా కార్యక్రమం...కండువా, జంధ్యం, గరికమాల అలంకరణ.  
ఉదయం 10–11 గంటల మధ్య లంగర్‌హౌస్‌ నుంచి ప్రత్యేకంగా తయారుచేసిన 750 కిలోల లడ్డూ సమర్పణ.  
మధ్యాహ్నం 12 గంటలకు శ్రీ ద్వాదశాదిత్య మహాగణపతికి గవర్నర్‌ నరసింహన్‌దంపతుల తొలిపూజ.
సాయంత్రం 6 గంటలకు కేంద్ర సహాయమంత్రి కిషన్‌రెడ్డి, మంత్రి ఈటలరాజేందర్‌ రాక. 

ప్రత్యేక పూల అలంకరణ.....
ఖైరతాబాద్‌ మహాగణపతికి తొలిపూజకోసం ప్రత్యేక పూల అలంకరణ చేపట్టారు. ఇందుకోసం ప్రత్యేకంగా 300 కిలోల పసుపు బంతి, 300 కిలోల ఎరుపు బంతి, 100 కిలోల చామంతి, 30 అరటి చెట్లు ఉపయోగించి మాలలు తయారు చేశారు. ఒక్కో మాల 80 అడుగుల పొడవు ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement