'లేని హక్కుల కోసం ఏపీ పోరాడుతోంది' | Harish rao takes on ap government | Sakshi
Sakshi News home page

'లేని హక్కుల కోసం ఏపీ పోరాడుతోంది'

Feb 13 2015 6:37 PM | Updated on Oct 19 2018 7:22 PM

'లేని హక్కుల కోసం ఏపీ పోరాడుతోంది' - Sakshi

'లేని హక్కుల కోసం ఏపీ పోరాడుతోంది'

నాగార్జున సాగర్ జలాల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులను తప్పుదోవ పట్టిస్తోందని తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు.

హైదరాబాద్: నాగార్జున సాగర్ జలాల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులను తప్పుదోవ పట్టిస్తోందని తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. సాగర్ నీటి విషయంలో లేని హక్కుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోరాటం చేస్తోందని విమర్శించారు. బచావత్ అవార్డు ప్రకారం తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తోందని హరీష్ రావు స్పష్టం చేశారు.

శుక్రవారం సాగర్ వద్ద ఇరు రాష్ట్రాల ఇరిగేషన్ అధికారులు మోహరించడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. సాగర్ నుంచి కృష్ణా డెల్టాకు నీటిని విడుదల చేసేందుకు ఏపీ ఇరిగేషన్ అధికారులు రాగా, తెలంగాణ అధికారులు అడ్డపడ్డారు. ఈ నేపథ్యంలో హరీష్ రావు వివరణ ఇచ్చారు. ఏపీ ఇప్పటికే 365.75 టీఎంసీల నీటిని వాడుకుందని, 43 టీఎంసీల నీటిని అదనంగా వాడుకుందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం 144.4  టీఎంసీలను వాడుకుందని, తమ రాష్ట్రానికి కేటాయించిన నీటి కంటే ఇది తక్కువని హరీష్ రావు అన్నారు. సాగర్ గేట్ల వద్ద రాజకీయాల కోసం డ్రామాలు, ధర్నాలు చేయడం సరికాదని వ్యాఖ్యానించారు. వచ్చే సీజన్ను దృష్టిలో ఉంచుకుని ఇరు రాష్ట్రాలు చర్చించుకుంటే మంచిదని హరీష్ రావు సూచించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement