మంత్రులు తాగిన తర్వాతే.. ప్రజల వద్దకు తేవాలి | Errabelli Dayakar rao fires on Government | Sakshi
Sakshi News home page

మంత్రులు తాగిన తర్వాతే.. ప్రజల వద్దకు తేవాలి

Sep 2 2015 3:09 AM | Updated on Sep 3 2017 8:33 AM

మంత్రులు తాగిన తర్వాతే.. ప్రజల వద్దకు తేవాలి

మంత్రులు తాగిన తర్వాతే.. ప్రజల వద్దకు తేవాలి

ప్రమాదకరమైన నాటుసారాకు బదులుగా చీప్ లిక్కర్‌ను తెస్తున్నామంటున్న మంత్రులు.. మొదట 6 నెలలపాటు వారు తాగాకే

ప్రజల్ని మత్తులో ఉంచేందుకే చీప్ లిక్కర్ : ఎర్రబెల్లి

 తొర్రూరు : ప్రమాదకరమైన నాటుసారాకు బదులుగా చీప్ లిక్కర్‌ను తెస్తున్నామంటున్న మంత్రులు.. మొదట 6 నెలలపాటు వారు తాగాకే ప్రజల వద్దకు దాన్ని తేవాలని టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు.  మంగళవారం వరంగల్ జిల్లా తొర్రూరులో ఆయన విలేకరులతో మాట్లాడారు. టీఆర్‌ఎస్ ఇచ్చిన హామీలు మరిచిపోయి ప్రజలంతా మత్తులో ఉండేందుకే కేసీఆర్ చీప్ లిక్కర్ తెస్తున్నారన్నారు. గ్రామ జ్యోతి సభల్లో చీప్‌లిక్కర్, మద్యం వద్దన్నా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. చీప్ లిక్కర్‌కు వ్యతిరేకంగా ఈనెల 3న అన్ని ఎక్సైజ్ పోలీస్‌స్టేషన్ల ఎదుట నిరసన దీక్షలు, ధర్నాలు చేపడుతున్నామని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement