ఆగస్టు 15 కల్లా ‘ఈ–పంచాయతీ’: జూపల్లి | E-panchayat scheme to be launched soon in telangana | Sakshi
Sakshi News home page

ఆగస్టు 15 కల్లా ‘ఈ–పంచాయతీ’: జూపల్లి

May 2 2017 2:04 AM | Updated on Sep 5 2017 10:08 AM

గ్రామాల్లో ఈ– పంచాయతీ వ్యవ స్థను అమలు చేసేందుకు కసరత్తు సాగుతోంది.

సాక్షి, హైదరాబాద్‌: గ్రామాల్లో ఈ– పంచాయతీ వ్యవ స్థను అమలు చేసేందుకు కసరత్తు సాగుతోంది. ఆన్‌లైన్‌లో పౌర సేవలను అందించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుం టోంది. ఆగస్టు 15వ తేదీకల్లా ఈ–పంచాయతీని ఏర్పాటు చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభి వృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. పంచాయ తీరాజ్, గ్రామీణాభివృద్ధి కార్యక్రమాల పురోగతిపై సోమవారం ఇక్కడ మంత్రి సమీక్షించారు. గ్రామాల్లో ఆగస్టు 15 నాటికి జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు, పన్నుల చెల్లింపు లాంటి అన్ని సేవలను ఆన్‌లైన్‌ ద్వారా అందించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

Advertisement
 
Advertisement
Advertisement